Tuesday, October 27, 2009

మీలాదె నబి , milade nabi

-


మీలాదె నబి--మీలాదున్నబి
మౌలిద్ లేదా మీలాద్ అనునది మహమ్మదు ప్రవక్త జన్మదినోత్సవం. ఇది ఇస్లామీయ కేలండర్ లోని మూడవ నెల 'రబీఉల్-అవ్వల్' 12వ తేదీన్ వస్తుంది.

మౌలిద్ అనునది సాధారణం గ జన్మదినోత్సవం కొరకు వాడుతారు. ఈజిప్టు, దక్షిణాసియా లో ఇది సర్వసాధారణపదం. ఆధ్యాత్మిక గురువులు ఔలియాల జన్మదినాన్ని గూడా 'మౌలిద్' గా జరుపుకుంటారు. భారతదేశం సాధారణంగా జరుపుకొనే ఉరుసు ఉత్సవాలు ఈ కోవకు చెందినవే.

మీలాదున్నబి / డాక్టర్‌ షేక్‌ మహమ్మద్‌ ముస్తఫా (@ఈనాడు అంతర్యామి ) ->

పుడమిపై పుట్టిన ప్రతి ఒక్కరు మానవ జీవితానికి సార్థకత, సంపూర్ణత సమకూర్చడానికి నిండు ప్రయత్నం చేయాలి. ధర్మనిష్ఠతో ప్రవర్తించాలి. ఇది దైవానికి అమితమైన ఇష్టం- వంటి పరమసత్యాల్ని మహాప్రవక్త మహమ్మద్‌(స) లోకానికి అందజేశారు. దివ్య ఖుర్‌ఆన్‌లోని ఆదేశాల్ని ఆయన క్రియాత్మకంగా ఆచరించి చూపారు. ప్రవక్త(స) జీవితం దివ్య ఖుర్‌ఆన్‌ వ్యాఖ్యానమై వెలసింది.

అరబ్‌ దేశంలో పాశవిక భావాలు ఆనాడు రెక్కలు విప్పుకొన్నాయి. అజ్ఞానాంధకారంలో అరబ్‌ దేశీయులు కొట్టుమిట్టాడుతున్నారు. ధర్మజ్ఞులు, శాంతిప్రియులు మౌనాన్ని ఎన్నుకొన్నారు. సంకుచిత తమోభావనలు సమత్వపు ప్రభల్ని అస్తమింపజేశాయి.

మహాప్రవక్త(స) ప్రయత్నం ఫలితంగా నాడు వివేకదీపిక ప్రజాహృదయాల్లో వెలిగింది. ఆయన మహిత భాషణలు అందరినీ ప్రభావితం చేశాయి. శత్రువులు సైతం ఆయన మంచి మనస్సుకు శిరస్సువంచారు. ఒకే దైవం, దాన ధర్మం, పరులక్షేమం, చెడు నుంచి విమోచనం సార్వజనీన అంశాలుగా ప్రవక్త(స) రూపుదిద్దిన విధానం పవిత్రజ్ఞాన వర్షాన్ని కురిపింపజేసింది. అరబ్‌ దేశంలో అలముకొన్న అజ్ఞాన తమస్సును నశింపచేయడంలో ప్రవక్త(స) ఎదుర్కొన్న కడగండ్లు పృథ్వీతలాన్ని విస్మయం చెందేలా చేశాయి. అనాథగా ప్రవక్త(స) జీవితాన్ని ఆరంభించారు. మహోన్నత వ్యక్తిగా అపూర్వ లోకోపకారిగా ఎదిగి చరిత్రలో నిలిచారు. అరబ్‌ ద్వీపకల్పం సర్వం ఆయన వశమైంది. ముత్యాల గద్దియను అధిరోహించగల శక్తిసంపన్నుడైన సమ్రాట్టు అయ్యీ ఆడంబరాల్ని త్యజించారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు నాంది పలికారు. పూరిగుడిసెలో జీవితం గడిపారు. ఆయన ఆహారం ఖర్జూర పండ్లు, మేకపాలు. ఈతచాపలేక జనపనార పట్ట మాత్రమే ఆయనకు శయ్య. ధరించే వస్త్రాలకు అతుకులెన్నో.

మహమ్మద్‌ ప్రవక్త(స) రబీ ఉల్‌ అవ్వల్‌ మాసం పన్నెండో తేదీ (క్రీ.శ. 571 ఏప్రిల్‌ 20) మక్కాలో జన్మించారు. మీలాద్‌ అంటే జన్మదినం. నబి అంటే ప్రవక్త. మీలాద్‌-ఉన్‌-నబి అంటే ప్రవక్త జన్మదినం. సంప్రదాయబద్ధంగా ఆనందోత్సాహాలతో ముస్లిములు మీలాదున్నబి జరుపుకొంటారు. ప్రవక్త జన్మించకముందే తండ్రి గతించడం, ఆరేళ్లకు తల్లి మరణించడం విషాద ఉదంతాలుగా మిగిలాయి. తాత అబ్దుల్‌ ముత్తలిబ్‌ ఆయనకు 'మహమ్మద్‌' అని నామకరణం చేసి పెంచసాగాడు. ఆయనా రెండేళ్ళలో తుదిశ్వాస విడిచాడు. ఆ బాలుడు అనాథగా మిగిలిపోయాడు. ఎదురైన ఆటంకాలు ఛేదించుకొని మానవశ్రేయం కోసం ప్రవక్త(స) జీవితం గడిపారు. మానవులంతా సమానమన్నారు. కేవలం పుట్టుక వల్ల, కులం వల్ల, కుటుంబం వల్ల, ధనం, అధికారం వల్ల ఎవ్వరికీ ఏ ఘనతా దక్కదన్నారు. వజ్రశక్తి నింపుకొన్న ప్రవక్త(స) ప్రచారం తీరు స్వార్థపరులై పెత్తనం చేస్తున్న పెద్దల మనుగడకు గట్టి ప్రతిబంధకమైంది. ప్రవక్త (స)కు శత్రువులేర్పడ్డారు. యస్‌రబ్‌ పట్టణానికి ప్రవక్త(స) వలస వెళ్లారు. అది క్రీ.శ. 622వ సంవత్సరం. ఇదే ఇస్లాముకు శకారంభ సంవత్సరం. ఈ వలసను 'హిజ్‌రత్‌' అని, శకాన్ని 'హిజ్రీ' అని అంటారు. యస్‌రబ్‌ పట్టణం మదీనాగా మారింది. మక్కాలోని శత్రువులు క్రూరులు. ప్రవక్త(స)ను, ఇస్లామ్‌ను మట్టుపెట్టే ప్రయత్నంలో ఆయనపై దాడిచేశారు. యుద్ధాలు జరిగాయి. ప్రవక్త(స) ఆశను వదల్లేదు. నిరాశకు లొంగలేదు. విజయం ప్రవక్త(స) వశమైంది.

గృహస్థుగా ఉండి సంసార జీవితం గడుపుతూ లోకానికి దివ్య సందేశ ప్రబోధం చేసిన మహమ్మద్‌ ప్రవక్త శత్రువుల గుండె లోతుల్లోని ద్వేషాన్ని, దుష్టత్వాన్ని నిర్మూలించగలిగిన మహోన్నత వ్యక్తి. ఆయన మతోన్మాదాన్ని గడప తొక్కనీయలేదు. ఇతర మతాలయెడల సద్భావం, సహనం, గౌరవం చూపాలని ఖురాన్‌ ప్రబోధాల్లో ఉంది. ప్రవక్త(స) వచనాల్లోనూ విస్పష్టంగా ఉంది. ప్రజల శాంతియుత జీవన విధానాన్ని భగ్నపరచే అమానుష హింసకుల క్రూర చర్యల్ని అడ్డుకోవడానికి మాత్రమే ధర్మబలంతో ప్రవక్త(స) యుద్ధభూమికి నడిచారు. పరులక్షేమం, సహజీవనం, శాంతి పరిరక్షణం - అంశాల్ని తిరస్కరించిన వారి రాక్షసత్వాన్ని ఎదిరించారు. ప్రేమ సౌభ్రాత్రాల్ని పోషించారు. ఆయన హృదయంలో సామ్రాజ్య పిపాస లేదు. మత విస్తరణ అంతకన్నా లేదు. కేవలం శాంతి సౌఖ్యాల పరిరక్షణ మాత్రం ఆయన మనస్సును అల్లుకొంది.

సాటి మనుషులు చెడుదోవన నడుస్తుంటే వారిని ప్రతి ఒక్కరూ సన్మార్గాన పయనించేలా చేయడం ప్రధాన బాధ్యతగా భావించాలి.

సంఘంలోని వ్యక్తులు పరస్పరం సహాయం చేసుకొనేవారిగా విశాల దృక్పథంతో జీవించాలి. కనీసం పరులకు హాని తలపెట్టనివారిగా మనగలిగినా మానవతకు అంతకన్నా మించిన భూషణం ఏముంది! అజ్ఞానాంధకారాల మంచుతెరలు తొలగి నిఖిలలోకం నిండుహర్షం వహించాలని మీలాదున్నబి ఆశయం.


పూర్తీ వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి - > మేలాడే - ఉన్-నబి


  • ===========================
Visit My Website - > Dr.Seshagirirao

తులసీపూజ ,tulasi pooja


తులసి పూజ - తులసి ప్రాశస్త్యమ్‌

శ్లో|| యన్మూలే సర్వతీర్ధాని యన్మధ్యే సర్వదేవతా

య దగ్రే సర్వవేదశ్చ తులసీం త్వా నమామ్యహమ్‌ ||

శ్రీ మహాలక్ష్మీ నారాయణ స్వరూపిణియైన "తులసి" యొక్క మూలంలో సర్వతీర్ధాలు, మధ్యభాగమందు సమస్త దేవతలు, తులసిమొక్క పైభాగమున సర్వవేదాలతో కొలువైవున్న తులసి మాతకు ముందుగా నమస్కరించుకుని, అంతటి పూజ్యనీయమైన ఆ తులసి ఆవిర్భావ చరిత్ర-తులసి ప్రాశస్త్యమును గూర్చి, మన పురాణములలో ఎన్నో కధలు కానవస్తున్నాయి. వాటిలో ఒకగాధను సమీక్షించుకుందాం!

"బ్రహ్మవైవర్తపురాణ"మందు గల తులసి వృత్తాంతము ఇలా ఉన్నది. ధర్మధ్వజుడు, మాధవి అను దంపతులకు అతిలోక సౌందర్యవతియైన కుమార్తై కలిగినది. వారు ఆ బిడ్డకు "బృంద" అను నామకరణము చేసుకుని అల్లారు ముద్దుగా పెంచుకోసాగిరి. ఆమెకు వివాహవయస్సురాగనే శ్రీహరిని వివాహమాడతలచి బదరికాశ్రమము జేరి బ్రహ్మనుగూర్చి ఘోరముగ తపమాచరించినది. బ్రహ్మదర్శన మిచ్చి నీ కోరిక ఏమిటో చెప్పుమనగా "నేను రాధాశాపముతో నున్న రుక్మిణిని, నాకు శ్రీకృష్ణుడే భర్తగా పొందుటకు"- వరమీయమని ప్రార్ధించినది.

అందులకు బ్రహ్మ ! నీ కోరిక తప్పక నెరవేరగలదు. కాని! ముందుగా గోలోకనివాసి సుదాముడే ముందుగా నీకుభర్త కాగలడు, అనంతరమే నీవు కోరిన వాడే నీకు పతియగును అని వరమిచ్చి అంతర్ధానమయ్యెను.

ఇలా ఉండగా బ్రహ్మదేవుడు చెప్పిన సుదాముడు పుష్కరకాలము శాపకారణముగా భూలోకమున శంఖచూడుడై జన్మించి తపమాచరించసాగెను. అతని తపస్సునకు మెచ్చి బ్రహ్మ ఏమివరము కావాలో కోరుకోమన్నాడు. అంత శంఖ చూడుచు "లక్ష్మీభూలోకమున పుట్టినదట! నాకామెతో వివాహాము చేయించమని వేడుకొనెను" బ్రహ్మ 'తధాస్తు' అని పలికి ఆమె బదరికాశ్రమమున నున్నది. ఆమె నీకు తప్పక లభ్యముకాగలదు అని యంతర్ధానమందెను. అనంతరము శంఖ చూడుడు బృందవాద ప్రతి వాదములను గమనించి అప్పుడు వార్కి మరల బ్రహ్మ ప్రత్యక్షమై వారి వారి అభీష్టములు నెరవేరుటకు వార్కి వైభవముగా వివాహము గావించెను.

ఇక శంఖచూడునకు లక్ష్మీయంశతో నున్న భార్య లభ్యమగుసరికి! అష్ట్తెశ్వర్యము లతో తులతూగుచూ అతిసమయము పెంచుకుని స్వర్గాధిపత్యము పొందగోరి దేవరాజ్యమును కొల్లగొట్టి; దేవతలను పలు ఇక్కట్లు పాలు చేయుటయే కాకుండా; పరమేశ్వరుని చెంతకేగి, శివా! నీ భార్య సుందరాంగి. అమెను నాకు వశ్యురాలును చేయుము లేనిచో యుద్ధమునకు తలపడమని ఘోరముగా శివునితో యుద్ధము చేయసాగెను. వెంటనే శ్రీహరి వారిని సమీపించి "శివా! వీడు అజేయుడు అగుటకు కారణం! ఈతని భార్య మహాపతివ్రత. ఆమె పాతివ్రత్య భంగము నేనాచరించదను. నీవు వీనిని వధించుము." యని యుక్తి చెప్పెను.

అనంతరము మాయా శంఖచూడుని వేషము ధరించి యున్న శ్రీహరిని చూచి బృంద తన భర్తే వచ్చినాడని భ్రమించి! ఆతనికి సర్వోపచారములుచేసి శ్రీహరి చెంతకు చేరగానే! ఆమె పాతివ్రత్యము భగ్నమగుట గ్రహించి శివుడు శంఖచూడుని సంహరించగా! నాతడు దేహమును విడచి "సుదాముడై" గోలోకమునకు పోయెను. బృంద తన ఎదుట ఉన్నది మాయా శంఖచూడుడని గ్రహించి శ్రీహరిని "శిలారూప మందుదువుగాక" యని శపించగా! తిరిగి ఆమెను నీవు "వృక్షమగుదువుగాక" యని శపించెను. ఆవిధంగా శ్రీహరి గండకీనదిలో సాలగ్రామ శిలగాపుట్టి; బృంద తులసీ వృక్షమై పోయి ఇద్దరూ ప్రపంచముచే పూజనీయస్వరూపములు పొందినట్లుగా బ్రహ్మవైవర్త పురాణగాధ ద్వార విదతమగుచున్నది.

ఒకసారి పరమేశ్వరుడు కుమారుడైన కుమారస్వామిని చెంతకుం చేర్చుకుని; పుత్రా!

"పుత్రా! సకల వృక్షములలోన తులసియొక్కటయే

పూజ్యమైక క్ష్మారుహంబు దాని పత్రములను దాని

పుష్పములను బ్రాణ సమములగును అచ్యుతనకు."

మరియు వృక్షాలన్నిటియందు తులసి శ్రేష్ఠమైనది, శ్రీహరికి ఇది అత్యంత ప్రీతిపాత్రమైనది. "తులసిపూజ" తులసీ స్త్రోత్రం చదవడం, తులసి మొక్కలో పోసిన నీటిని శిరస్సున జల్లుకోవడం, తులసీవనమును పెంచి వాటి మాలలు శ్రీహరికి సమర్పించుట ఎంతో! పుణ్యప్రదమైనవి. గోదాదేవి తులసీవనంలోనే అయోనిజగా విష్ణుచిత్తునింట వెలసి శ్రీరంగనాధుని ఇల్లాలయింది.

శ్లో|| వశిష్ఠాది ముస్తోమై: పూజితో తులసీవనే

తదా ప్రభృతి యద్విష్ణు : బ్రతిజ్ఞాం కృతవాన్‌ ప్రభు:

తస్మిన్‌ తులస్యాంతు య: పూజాంకురు తేనర:

సర్వపాప వినిర్ముక్త : మమసాయుజ్య మాప్నుయాత్.

వశిష్ఠాది మునిగణముచే ఎన్నో విధములుగా స్తోత్రపూర్వకముగా శ్రీహరి తులసీ వనమందు పూజలందుకొని నన్ను "కార్తీక శుద్ధద్వాదశి" నాడు విశేషించి ఎవరు బూజచేయుదురో! అట్టివారి సమస్తయొక్క పాపములు అగ్నిలోపడిన మిడుతలు వలె భస్మమయి వారు తప్పక నా సాన్నిధ్యమును పొందుదురని ప్రతిజ్ఞ చేసెనట!

శ్లో|| తులసీవ్రత మహాత్మ్యం శ్రోతవ్యం పుణ్యవాంచ్చిన:

యదిచ్చేద్విష్ణు సాయుజ్యం శ్రోతవ్యం బ్రాహ్మ్ణ్తణ్తెస్సహ

విష్ణో : ప్రీతిశ్చ కర్తవ్యా శ్రోత వ్యాతులసీకధా

ద్వాదశ్యాం శ్రవణాత్తస్యా: పునర్జన్మ న విద్యతే.

విష్ణు సాన్నిధ్యముగోరి విష్ణుదేవునకు యేమాత్రమైన ప్రీతి జేయవలయునునని తలచేవారు తులసీ వ్రతమహాత్మ్యము తప్పక వినవలయును. అందునా! ఆ వ్రత కధను "క్షీరాబ్ధిద్వాదశి" రోజున తులసీ కధ వినువార్కి, చదువువార్కి, పూర్వజన్మ కృతమైన దు:ఖములన్నియు తొలగిపోయి విష్ణులోకమును పోందుదురు, అని శంకరునిచే "తులసి" కొనియాడబడినట్లు చెప్పబడినది. అట్టి తులసీ బృందావన మందు ఉసిరిమొక్కతో కలిపి "తులసీధాత్రీ సమేత శ్రీమన్నారాయణుని" ఈ కార్తీక ద్వాదశినాడు పూజించుట ఎంతో విశిష్టమైనదిగా పేర్కొనబడినది. మరియు అట్టి తులసీ దళములకు "నిర్మాల్యదోషం" పూజలో ఉండదని కూడా చెప్పబడినది.

కావున! మన హిందూమతంలో "తులసి" ఆధ్యాత్మిక దృష్టిలో విశిష్టమైన స్ధానాన్ని పొందింది. తులసిమొక్క హిందువులకు పూజనీయమైనది. కావున హిందువులు ప్రతిఇంటా తులసి మొక్కను కోటలో పెంచి పూజించుట మనం చూస్తూ ఉంటాము. ఇక పట్టణావాసులైతే అంతలో కొంత జాగా ఏర్పరచుకుని, చిన్నచిన్న కుండీల్లోనో, డబ్బాల్లోనో పెంచి పూజిస్తూ ఉంటారు. కావున 'తులసి' ఉన్న ఇల్లు నిత్యకళ్యాణము పచ్చతోరణంతో శోభిల్లుతూ ఉంటుంది.

ఇక ఈ తులసిని వైద్యపరంగా కూడా చూస్తే! ఆయుర్వేద శాస్త్రంలో 'సప్తతులసి-భరతవాసి' అంటూ తులసిని ఏడువిధాలుగా వివరించబడినది. అవి: 1.కృష్ణ తులసి 2. లక్ష్మీతులసి 3.రామతులసి 4. నేల తులసి 5. అడవి తులసి 6. మరువ తులసి 7.రుద్రతులసిగా వివరుస్తారు. వైద్యపరంగా వాటి అన్నిటికి ఎన్నో అమోఘమైన ఔషధగుణాలతో కూడి ఉంటాయని ఆయుర్వేద శాస్త్రం కొనియాడుతోంది. ప్రతిరోజు ఉదయం రెండు తులసి ఆకులు (కోటలోవికాదు) విడిగా పెంచుకున్న మొక్కలనుండి నమలి మింగితే వార్కి బుద్ధిశక్తి, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మరియు అనేక మానసిక రుగ్మతలు నయమవుతాయని; ఇలా ఎన్నో విశేష గుణాలను చెప్తారు.ఇక దాని కాండముతో తయారుచేయబడ (తులసిమాల)కు ఇటు ఆధ్యాతికపరంగా అటు ఆరోగ్యపరంగా ఎన్నోలాభాలు ఉన్నాయిట !

కావున ఈ "క్షీరాబ్దిద్వాదశి" వ్రతాన్ని ఆచరించి ఇటు ఆధ్యాత్మిక సంపదతో పాటు ఆరోగ్య భాగాన్ని సర్వులమూ పొందుదాం!

మూలం : నిత్యజీవితములో పండగలు-పర్వదినాలు పేజీ నెంబర్ 193
------------------------------------------------------------------------------------------------
తులసీ పూజతో సర్వదేవతారాధన

ప్రతి మనిషికీ తల్లి తొలిగురువు అని పెద్దలంటారు. ఆ తల్లిని గురువుగా భావించి, గురుదక్షిణ ఇవ్వడం కొద్ది మందికే సాధ్యం. అటువంటి అసాధారణ వ్యక్తులలో సంగీత త్రయంలోని త్యాగరాజును చెప్పుకోవాలి. సంగీత కుటుంబం నుండి వచ్చిన తల్లి సీతమ్మ సంగీతంలోని ఓనమాలు నేర్పి త్యాగరాజు తొలిగురువయింది.

ప్రతి నిత్యం తులసి కోటకు ప్రదక్షిణలు చేస్తూ, మధురమైన కంఠంతో పురందరదాసు, రామదాసు, అన్నమయ్యల కీర్తనలు తల్లి పాడుతుంటే వింటూ, గొంతు కలిపి పాడుతూ త్యాగరాజు పెరిగాడు. వంశానుగతంగా వచ్చిన శ్రీరామభక్తి, తల్లి సంకీర్తనల ద్వారా మరింత పరిపుష్టమై, త్యాగరాజును అచిరకాలంలోనే గొప్ప సంగీతజ్ఞుడిగా, వాగ్గేయకారుడిగా తీర్చిదిద్దింది.
తన బంగారు భవితవ్యానికి మార్గదర్శకురాలైన తల్లికి గురుదక్షిణ సమర్పించడమే తన ప్రథమ కర్తవ్యమని త్యాగరాజు భావించాడు. తల్లికి అత్యంత ప్రియమైన తులసీమాతపై కీర్తనలు రచించి తద్వారా ఆమెకు సంతృప్తి కలిగించాడు. ఎన్నో ఔషధగుణాలు కలిగి, సౌభాగ్యప్రదాయినిగా ప్రతియింటా వెలసిన తులసీమాతపై త్యాగరాజు రచించిన కీర్తనలు ఎంతో ప్రసిద్ధి పొందాయి.

సావేరి రాగం - రూపకతాళం
ప॥తులసీ జగజ్జననీ దురితాపహారిణీ॥
చ॥చరణ యుగంబులు నదులకు పరమ వైకుంఠమట
సరసిజాక్షి నీమధ్యము సకల సురావాసమట
శిరమున నైగమకోట్లు చెలగుచున్నారట
సరస త్యాగరాజాది వర భక్తులు పాడేరట॥

తులసి మొక్క అడుగుభాగాన శ్రీ మహావిష్ణువు సాలగ్రామ రూపంలో ఉంటాడు. విష్ణుపాదాల నుండే గంగ పుట్టడం వల్ల, నదులకు పుట్టిల్లు వైకుంఠమనీ, విష్ణు నివాసమైన తులసియే వైకుంఠమని, మధ్య భాగంలో సకల దేవతలు కొలువుంటారనీ, శిరోభాగం వేద స్వరూపంగా భాసించడం వల్ల, ఒక్క తులసి మాతను పూజిస్తే సకల దేవతలనూ పూజించినట్లే అని త్యాగరాజు తులసీ మహాత్మ్యాన్ని తెలియపరిచాడు.

- ఎస్. రాజ్యలక్ష్మి
  • ==============================================
Visit My Website - > Dr.Seshagirirao

Monday, October 26, 2009

క్రిస్టమస్ , Christmas






క్రిస్టమస్

క్రిస్టమస్ క్రైస్తవులకు ముఖ్యమైన పండగ. ఏసు క్రీస్తు పుట్టిన రోజును ఈ రోజు జరుపుకుంటారు. కొంతమంది క్రైస్తవులు డిసెంబర్ 25న, మరికొంత మంది ఆర్థడాక్స్ చర్చిలకు చెందిన క్రైస్తవులు జనవరి 7న క్రిస్టమస్‌ను జరుపుకుంటారు. చారిత్రక మరియు సందర్భోచిత ఆధారాల ప్రకారం ఏసుక్రీస్తు డిశంబరులో పుట్టి ఉండకపోవచ్చు. ఈ రోజును ఒక రోమన్ల పండగ రోజు అయినందునో లేదా వింటర్ సోల్టీస్ అయినందునో క్రిస్టమస్ జరుపుకోవటానికి ఎంచుకున్నారు.

యేసు (Jesus) (క్రీ.పూ 7–2 నుండి క్రీ.శ 26–36 వరకు) , నజరేయుడైన యేసుగా కూడా పిలవబడే ఈయన క్రైస్తవ మత మూలపురుషుడు. అంతకాక, యేసు వివిధ ఇతర మతములలో కూడ ప్రముఖమైన వ్యక్తిగా పరిగణించబడినాడు. ఈయన సాధారణంగా యేసు క్రీస్తుగా కూడ వ్యవహరించబడతాడు. ఇందులో క్రీస్తు అన్న పదము గ్రీకు భాషలో క్రీస్తోస్ ("ఆభిషిక్తుడు") అనే అర్ధం వచ్చే పదం నుండి పుట్టిన ముకుటం. ఇది హీబ్రూలో "మెసయ్యా"కు సమానార్ధము కలపదము.
పూర్తీ వివరాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి - > యేసు జనము


క్రిస్మస్‌ బహుమతి

రెండువేల సంవత్సరాల క్రితం సంగతి. ఒక అభాగ్యురాలు, సమాజ నిరాపేక్షకు గురైన ఒక స్త్రీ ఆ జనం ఎదుట దోషిగా నిలబడింది. ఆమె చుట్టూ ఉన్నవారి చేతుల్లో రాళ్ళు. పాపం చేసినవారిని రాళ్ళతో కొట్టి చంపడం ఆ దేశంలో ఉన్న దారుణమైన ఆచారం. ఇంతలో వారి మధ్యలోకి ఒక ఆజానుబాహువు వచ్చాడు. ఆయన ముఖంలో తేజస్సు. రాళ్ళతో కొట్టబోతున్నవారు ఒక్కక్షణం ఆగారు. 'మీలో పాపం చేయనివారెవరు? పాపం చేయని వారు ఎవరైనా ఉంటే, ముందుగా వారే రాయి విసరండి' అన్నాడాయన. అంతా ఒక్కసారి వెనుతిరిగారు. వారి చేతుల్లోని రాళ్ళు కింద పడ్డాయి. ఆమె చేతులు జోడించి ఆయన ముందు మోకరిల్లింది. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు.

పాపం చేసినవారికి శిక్ష విధించడం కాదు. పాపమే మరణించాలి. అలా జరిగితే పాపంలేని మనిషి పాపరహితుడై యేసుక్రీస్తులా మారతాడని దేవుని నమ్మకం. అందుకే నశించిన దాన్ని వెదికి రక్షించే నిమిత్తం ఆయన తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును ఈలోకానికి పంపాడని విశ్వసిస్తారు. అలా సమస్త మానవాళి పాపపరిహారార్థం దేవుడు నరుడిగా జన్మించిన పవిత్రమైన రోజే క్రిస్మస్‌.

యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం వెలసింది. ఆ నక్షత్రాన్ని అనుసరించి వెళ్ళి బాలయేసును దర్శించిన ముగ్గురు జ్ఞానులు పరమానంద భరితులయ్యారు. ఆ సంతోషానికి గుర్తుగా వారు బాలయేసుకు మూడు కానుకలను సమర్పించారు. అవి బంగారము, బోళం, పరిమళ సాంబ్రాణి. వారు సమర్పించిన బంగారం క్రీస్తు ప్రభువు పరిశుద్ధతకు, పవిత్రతకు చిహ్నంగా కనబడుతుంది. బోళం సమర్పణకు సూచన. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ప్రేమతో సమర్పించిన రీతిలో అందరూ ఒకరిపట్ల మరొకరు ప్రేమానురాగాలు కలిగి ఉండటం, ద్వేషాన్ని విడనాడటం క్రిస్మస్‌ పర్వదినం ప్రాముఖ్యం. ఇక ఆనాడు జ్ఞానులు కానుకగా సమర్పించిన పరిమళ సాంబ్రాణిని ఆరాధనకు సూచనగా లేఖనాలు పేర్కొంటాయి. అహంకారంతో అవమానం, వినయవిధేయతలతో జ్ఞానం కలుగుతాయి. నీ కన్నతండ్రి హితోపదేశం విను, నీ తల్లి వృద్ధాప్యంలో ఉంటే ఆమెను నిర్లక్ష్యం చేయకు- ఇవి క్రీస్తు పలికిన అమృతవాక్కులు. యేసు అనగా గ్రీకుభాషలో రక్షకుడని, క్రీస్తు అనగా హెబ్రూ భాషలో అభిషిక్తుడని అర్థం. సమస్త లోక ప్రజల ఆకలి తీర్చే జీవాహారం ఇచ్చే క్రీస్తు ప్రభువు జన్మించిన ఊరిపేరు బెత్లహేమ్‌. ఆ మాటకు అర్థం- రొట్టెల గృహం.

యేసుక్రీస్తు తన శిష్యులకు ఒకసారి తప్పిపోయిన గొర్రెపిల్ల కథ చెప్పారు. 'మీలో ఎవరికైనా వంద గొర్రెలు ఉన్నాయనుకోండి, వాటిలో ఒక గొర్రె తప్పిపోతే అప్పుడు ఆ గొర్రెలకాపరి సురక్షితంగా ఉన్న తొంభైతొమ్మిదింటినీ వదిలి, తప్పిపోయిన ఆ ఒక్కదాన్నీ వెదకడానికి వెళతాడు. ఎంత అలసినా, కాలం వృథా అయినా అతను గొర్రె దొరికే వరకూ వెదుకుతూనే ఉంటాడు. అది దొరికినప్పుడు ఎంతో సంతోషిస్తాడు. దాన్ని భుజాల మీద పెట్టుకుని తీసుకువస్తాడు. తప్పిపోయి దొరికిన తన గొర్రె గురించి స్నేహితులకు ఆనందంగా చెబుతాడు...' అంటూ ఆయన బోధించారు. అలా తప్పిపోయిన గొర్రె వంటి అమాయక ప్రజలను వెదికి రక్షించేందుకు ఈ లోకంలోకి వచ్చిన ప్రభువుగా ఆయనను కీర్తిస్తారు. ఇందుకు సాదృశ్యంగా ఆయన జన్మించినప్పుడు ఆ శుభవర్తమానం అమాయకులైన గొర్రెల కాపరులకే ముందుగా తెలియడం ఆశ్చర్యానుభూతి కలిగించే విషయం.

'నిన్ను వలే నీ పొరుగువాణ్ని ప్రేమించు' ఇది ఆయన చిన్నవాక్యంలో అందించిన అద్భుతమైన ఉపదేశం. 'దుర్మార్గులను, సన్మార్గులను; పతితులను, పవిత్రులను ఒకే దృష్టితో ప్రేమించగలిగే దివ్య మానసాన్ని మీరు ప్రతిష్ఠించుకోండి' అని ఆయన చేసిన బోధన- అన్ని కాలాల్లో అందరూ అనుసరించదగ్గ ఆత్మసాధన. దేవుడు కొలువుదీరేది ఆత్మలో అయితే... దానికి మార్గం- క్రీస్తు బోధించిన ప్రేమతత్వం, కరుణ, క్షమ. 'సంపూర్ణ మానవత్వమే మనిషిని మహాపురుషుడిగా, దైవస్వరూపుడిగా మారుస్తుంది'- ఇదే క్రిస్మస్‌ పర్వదినం ద్వారా సమస్త మానవాళికి అందే శుభసందేశం.


  • ===========================================
visit my website - > dr.Seshagirirao - MBBS

బక్రీద్ , Bakridh





బక్రీదు :
ఈద్ అల్-అజ్ హా , ఈదుల్ అజ్ హా లేదా ఈదుజ్జుహా లేదా బఖర్ ఈద్ లేదా బక్రీదు. అల్లాహ్ ఆదేశం ప్రకారం ఇబ్రాహీం ప్రవక్త తనకుమారుడైన ఇస్మాయీల్ ను బలి ఇవ్వడాని తీసుకెళ్ళే సాంప్రదాయాన్ని స్మరిస్తూ ప్రపంచంలోని ముస్లింలు ఈ పండుగను జరుపు కొంటారు. ఈ పండుగకు ప్రామాణికం ఖురాన్. (ఇరాన్ లో ముస్లింలు దీనిని 3వ అతి ముఖ్యమైన పండుగగా జరుపుకొంటారు.) ఈదుల్ ఫిత్ర్ (రంజాన్) లో లాగ, బక్రీదు పండుగనాడు కూడా ప్రార్థనలు ఖుత్బా (ధార్మిక ప్రసంగం) తో ప్రారంభమౌతుంది.

ఇస్లామీయ కేలండర్ ప్రకారం 12వ నెల యైన జుల్ హజ్జా 10వ తేదీన ఈ పండుగ జరుపుకొంటారు. ఈ పండుగ 3 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ నెలలోనే హజ్ తీర్థయాత్రగూడా చేస్తారు. ఈ యాత్రకొరకు సౌదీ అరేబియా లోని మక్కా నగరానికి వెళ్ళి మస్జిద్-అల్-హరామ్ లోని కాబా చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేస్తారు. ఈ పండుగ రంజాన్ పండుగ జరిగిన 70 రోజుల తరువాత జరుపుకుంటారు

సత్యసాయిబాబా జయంతి , Satyasai Baba Birthday




సత్య సాయి బాబా (Sathya Sai Baba) 20వ శతాబ్దంలో ప్రసిద్ధి చెందిన మతగురువు, ఇతనిని 'గురువు' అనీ, 'వేదాంతి' అనీ, 'భగవంతుని అవతారం' అనీ పలువురు విశ్వసిస్తారు. ఇతని మహిమల పట్ల చాలామందికి అపారమైన విశ్వాసం ఉంది.


సత్యసాయి సంస్థ వారి సమాచారం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 130 దేశాలలో 1200 వరకు సత్యసాయి కేంద్రాలున్నాయి. సత్యసాయి బాబాను అనుసరించే వారి సంఖ్య 60 లక్షలు అని ఒక అంచనా కాగా కొందరు భక్తులు ఈ సంఖ్యను "5 నుండి 10 కోట్ల మధ్య" అని చెబుతారు. ఇతను సాక్షాత్తు భగవంతుని అవతారమనీ, షిరిడీ సాయిబాబాయే మరల సత్య సాయిబాబాగా అవతరించాడనీ విశ్వాసం కలవారు అంటారు.

సత్యసాయి వంశవృక్షం
హైదరాబాద్‌: కోట్లాదిమంది భక్తులకు ఆరాధ్యుడు... తన బోధనలతో ప్రపంచంలోని భక్తులందరినీ కట్టిపడేసే శ్రీ భగవాన్‌ సత్యసాయి బాబా పూర్వీకులు ఎవరు... వారి వంశం వివరాలు ఏంటి కొంత ఆసక్తి కలిగించే అంశం.
సత్యసాయి సామాన్య కుటుంబంలో జన్మించారు. అందరిలానే విద్యార్థిగా జీవితాన్ని మొదలుపెట్టి ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం సృష్టికర్తగా ఎదిగారు. బాబా అసలు పేరు సత్యనారాయణ రాజు. 1926 నవంబర్‌ 23న కార్తీక సోమవారం రోజు బాబా జన్మించారు. పెద వెంకమరాజు, ఈశ్వరమ్మ దంపతులకు నాలుగో సంతానం బాబా. అనంతపురం జిల్లాలో నేటి పుట్టపర్తిగా పిలవబడుతున్న ఒకనాటి గొల్లపల్లి బాబా స్వగ్రామం. బాబా పూర్వీకులు... వారి కుటుంబ చరిత్రను ఒకసారి పరిశీలిస్తే...
సత్యసాయి ముత్తాత శేషంరాజు, పెద్దలక్ష్మమ్మ. వారికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు.
కుమార్తె వెంకటసుబ్బమ్మ, ఆమె భర్త మీసరగండ సుబ్బరాజు
రెండో సంతానం కొండమ రాజు, ఆయన భార్య లక్ష్మమ్మ
మూడవ సంతానం సుబ్బరాజు, ఆయన భార్య నారాయణమ్మ
కొండమరాజు వంశంలోనే సత్యనారాయణ రాజు(సత్యసాయిబాబా) జన్మించారు. కొండమరాజు, లక్ష్మమ్మ దంపతులకు పెద వెంకమరాజు, చిన వెంకమరాజు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.
పెదవెంకమరాజుకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఈయన నాలుగో సంతనామే సత్యసాయి.
తొలి సంతానం శేషంరాజు ఆయన భార్య సుశీలమ్మ
రెండో సంతానం వెంకమ్మ ఆమె భర్త మీసరగండ సుబ్బరాజు
మూడో సంతానం పార్వతమ్మ ఆమె భర్త పేరు అక్కిరాజు గోవిందరాజు
నాలుగో సంతానమే మనం ఇప్పుడు సత్యసాయిగా పిలుచుకుంటున్న సత్యనారాయణరాజు
అయిదో సంతానం జానకిరామయ్య ఆయన భార్య మీనాక్షమ్మ
* సత్యసాయి అన్న శేషంరాజు, సుశీలమ్మ దంపతులకు అయిదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శేషంరాజు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. తాను ఏ పాఠశాలలో పనిచేస్తే... అక్కడకు సత్యసాయిని

తీసుకెళ్లి చదివించేవారు. ఈ కారణంగానే పుట్టపర్తి, కడప జిల్లా కమలాపురం, బుక్కపట్నం, ఉరవకొండ పాఠశాలల్లో సత్యసాయి చదవాల్సి వచ్చింది.
* సత్యసాయి సోదరి వెంకమ్మ, సుబ్బరాజు దంపతులకు ఏకైక కుమారుడు శంకర్రాజు
* సత్యసాయి రెండో సోదరి పార్వతమ్మ, గోవిందరాజు దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె చిట్టెమ్మ ఉన్నారు. సాయిబాబా జన్మదిన వేడుక ప్రారంభం సూచికగా వేణుగోపాలస్వామి రథోత్సవం చిట్టెమ్మ

కొబ్బరికాయ కొట్టిన తర్వాతే ప్రారంభం అవుతుంది.
* సత్యసాయి సోదరుడు జానకిరామయ్య జానకిరామయ్య, మీనాక్షమ్మ దంపతులకు కుమారుడు ఆర్‌జే రత్నాకర్‌, కుమార్తెలు శైలజ, వనజ ఉన్నారు. వీరిలో రత్నాకర్‌ ప్రస్తుతం సత్యసాయి ట్రస్టు సభ్యుడిగా కొనసాగుతున్నారు.
సత్యసాయిబాబా అస్తమయంతో బాబా వంశంలోని ఆయన తరం ముగిసింది.

సత్యసాయి అస్తమయం
పుట్టపర్తి: కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం సత్యసాయిబాబా నిర్యాణం చెందారు. సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక బోధనలతో అలుపెరగని సేవ చేసిన సత్యసాయి బాబా ఇకలేరు. 24-04-2011 ఉదయం 7.40 గంటలకు బాబా నిర్యాణం చెందినట్లు వైద్యులు అధికారికంగా ప్రకటించారు. ప్రతిఫలం ఆశించకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ కోట్లాది మందిని ఆధ్యాత్మికం వైపు నడిపించిన బాబా తిరిగి రారన్న వార్త విని భక్తులు శోక సంద్రంలో మునిగిపోయారు. దాదాపు ఏడు దశాబ్దాలుగా మానవాళికి శాంతిసందేశమిచ్చిన బాబా మార్చి 28న శ్వాస సంబంధ సమస్యతో ఆస్పత్రిలో చేరారు. సత్యసాయి సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాబా 28వ రోజున తుదిశ్వాస విడిచారు. బాబా అస్తమయ వార్త విని పుట్టపర్తి అంతటా నిశ్శబ్ద వాతావరణం అలముకుంది.

27-04-2011 న సత్యసాయి అంత్యక్రియలు
పుట్టపర్తి: సత్యసాయి బాబా భౌతికకాయానికి బుధవారం ఉదయం సాయికుల్వంత్‌ హాల్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు మంత్రి గీతారెడ్డి తెలిపారు. బాబా దర్శనం కోసం వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆమె తెలిపారు.

బాబా మానవాళికి అందించిన సేవలు
పుట్టపర్తి: 'నా జీవితమే నా సందేశం' అని ప్రవచించిన సత్యసాయి మానవాళికి ఫలాపేక్ష లేకుండా అనితర సేవలు అందించారు. బాబా సేవల పరంపర ఒకసారి చూస్తే...
* 1945లో ప్రశాంత నిలయం నిర్మాణం. 1950లో ప్రారంభం.
* 1954లో పుట్టపర్తిలో చిన్న ఆస్పత్రి నిర్మాణంతో సత్యసాయి సేవలు ప్రారంభమయ్యాయి.
* 1970లో వైట్‌ ఫీల్డులో మహిళలు, పిల్లలకు సేవలందించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు.
* 1981లో సత్యసాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ లెర్నింగ్‌(సత్యసాయి విశ్వవిద్యాలయం).
* రాయలసీమ ప్రజల తాగునీటి అవసరాలకు 1995 మార్చిలో మంచినీటి ప్రాజెక్టును తలపెట్టారు. ఈ పథకం ద్వారా రాయలసీమలోని 750 గ్రామాలకు తాగునీరు అందించారు.
* 2004 నుంచీ చెన్నై ప్రజల దాహార్తినీ సత్యసాయిట్రస్టు తీరుస్తోంది. సత్యసాయి గంగా కెనాల్‌ పథకంపై బాబాను తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి కొనియాడారు.
* మెదక్‌ జిల్లాలోని 179 గ్రామాలకు సత్యసాయి ట్రస్టు తాగునీరు అందిస్తోంది.
* మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 141 గ్రామాలకు సత్యసాయి ట్రస్టు తాగునీరు అందిస్తోంది.
* ఉచిత వైద్యం కోసం 2001లో బెంగళూరులో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని సత్యసాయి ప్రారంభించారు.
* 2009లో ఒడిశా వరద బాధితులకు సత్యసాయి ట్రస్టు 699 ఇళ్లను నిర్మించి ఇచ్చింది.
* ఆస్ట్రేలియా, మెక్సికో, బ్రిటన్‌ సహా 33 దేశాల్లో ఉచిత విద్యాసేవలు అందిస్తున్నారు.
* 166 దేశాల్లో ఉచిత విద్య, వైద్య, ఇతర సేవలను సత్యసాయి ట్రస్టు అందిస్తోంది.
* మొబైల్‌ డిస్పెన్సరీలతో దేశంలోని మురికివాడల్లో సత్యసాయి ట్రస్టు వైద్యసేవలు అందిస్తోంది.
* సత్యసాయి సేవలను గుర్తిస్తూ 1999 నవంబర్‌ 23న తపాలాబిళ్ల విడుదల

  • source _ Eenadu telugu daily

మరిన్ని వివరాలకోసం వికీపీడియా ని చూడండి -> Satyasai Baba Birthday Celebrations

ఆంధ్ర రాష్ట్ర అవతరణ,Andhrapradesh State Formation






బ్రిటిషు పరిపాలనా కాలంలో ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్‌ వివిధ ప్రాంతాల ఏలుబడిలో ఉండేది. తెలంగాణా ప్రాంతం ఇప్పటి కర్ణాటక, మహారాష్ట్రలలోని కొన్ని ప్రాంతాలతో కలిసి నిజాము పాలనలో ఉండేది. కోస్తా, రాయలసీమ ప్రాంతాలు మద్రాసు ప్రెసిడెన్సీ లో భాగంగా, బ్రిటిషు వారి అధికారంలో ఉండేది.


మద్రాసు ప్రెసిడెన్సీలో కింది జిల్లాలు ఉండేవి.

శ్రీకాకుళం, విశాఖపట్టణం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు.


మద్రాసు ప్రెసిడెన్సీలో తమిళుల ప్రాబల్యం అధికంగా ఉండేది. జనాభాలోను, విస్తీర్ణంలోను ఆంధ్ర ప్రాంతమే హెచ్చుగా ఉన్నప్ప్పటికీ, పరిపాలనలోను, ఆర్ధిక వ్యవస్థ లోను తమిళుల ఆధిపత్యం సాగేది. సహజంగానే, ఆంధ్రులలో అభద్రతా భావం కలిగింది. తమకంటూ ప్రత్యేక రాష్ట్రం ఉంటేనే, రాజకీయంగాను, ఆర్ధికంగాను గుర్తింపు లభిస్తుందని వారు ఆశించారు. తెలుగు మాట్లాడే వారందరికీ ప్రత్యేక రాష్ట్రం – విశాలాంధ్ర - కావాలనే కోరిక తలెత్తి క్రమంగా బలపడసాగింది.


మిగతా వివరాలకు వికీపీడియా చూడండి - > ఆంధ్ర రాష్ట్ర అవతరణ

రంజాన్ , Ramzan



  • రంజాన్

'రంజాన్ లేదా రమదాన్ (Ramzan, Ramadan) ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం మతస్తులు ఆచరించే ఒక ఉపవాస దీక్షా వ్రతం మరియు ఇస్లామీయ కేలండర్ లోని ఒక ‌నెల పేరు. నెలల క్రమంలో తొమ్మిదవది.

పండుగ, పర్వదినం అంటే శుభవేళ, ఉత్సవ సమయం అని అర్థం. పండుగలు మన జీవన స్రవంతిలో భాగమై మన జాతీయతకు, సంస్కృతీ వికాసానికి దోహదం చేస్తూ వున్నాయి. ' పండుగ ' అనేది ఏ మతానికి సంబంధించినదైనా సరే..... దాని వెనుక ఒక సందేశం దాగి వుంటుంది. ' పండుగ ' మానావాళికి హితాన్ని బోధిస్తుంది. ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే ' రంజాన్ ' పండుగ సైతం ఇదే హితాన్ని మానవాళికి అందిస్తుంది.

తెలుగు వారి మాదిరిగానే ముస్లింలు 'చాంద్రమాన కేలండర్' ను అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్ తొమ్మిదవ నెల 'రంజాన్', దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం ' దివ్య ఖురాన్' గ్రంథం ఈ మాసంలో అవిర్భవించడమే! క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే ' రంజాన్ మాసం '

రమజాన్‌ పర్వదినం /- డాక్టర్‌ షేక్‌ మహమ్మద్‌ ముస్తఫా

'వసంతమైనా శిలలపైన పూదోట పెరగదు. మెత్తటి మన్ను అయితే మనస్సును దోచే రంగురంగుల పూలు పూస్తాయి. బండరాయిగా మారే దిశవైపు ఎవరి గుండె వెళ్తున్నా, దాన్ని మళ్లించి మెత్తటి మన్నుగా మార్చడం పవిత్ర కర్తవ్యం'- అంటారు పెద్దలు. ఏడాదికోసారి నెల రోజులు అలాంటి ఉదాత్త భావాల్ని నేర్పిస్తుంది రమజాన్‌ మాసం. గడచిన నెల రోజులు కచ్చితంగా నిర్ణీతవేళకు సహరీ కోసం తెల్లవారుజామునే ముస్లిమ్‌ సోదరులు నిద్రలేచారు. తినడానికి, తాగడానికి ఏ సడలింపు లేకుండా నిర్ణీత సమయాన్ని పాటించారు. పగలంతా ధర్మయుతంగా చేయవలసిన పనులు చేశారు. సాయంత్రం అందరూ ఒకేవేళకు ఇఫ్తార్‌ చేశారు. సైనికుల్లా నియమ నిబంధనలకు కట్టుబడ్డారు. ఈ విధంగా ఉండటం వల్ల రమజాన్‌ మాసం వాతావరణమంతా పుణ్యకార్యం, దైవభీతి అనే సుగుణాలతో నిండిపోయింది. నెలరోజులు గడచిన అనంతరం 'షవ్వాల్‌' మాసపు నెలవంక దర్శనం జరిగిన వెంటనే పండుగ జరుపుకొంటారు. దీన్నే ఈదుల్‌ ఫితర్‌ అని, రమజాన్‌ అని అంటారు. రమజాన్‌ మాసంలోని సమస్త ఆరాధనలతో దానాలతో పండుగ ముడివడి ఉంది. ఈ కారణంగా ఈ పర్వదినం షవ్వాల్‌ మాసపు మొదటి తేదీన జరిగినా, 'రమజాన్‌' అనే ప్రసిద్ధికెక్కింది.

వివేకపు ద్వారాలు తెరచి సౌహార్ద సమభావాల్ని పంచాలనే దైవ ఆదేశాన్ని పాటించడానికి అమలిన హృదయాలతో ఒకరికొకరు సహాయపడాలి. ఇందుకు సామూహిక శక్తి అవసరం. ఈ శక్తిని కలిగించేది నమాజ్‌. దుష్టచింతనల్ని, దురాగతాల్ని, కుహనా సంస్కారాన్ని నమాజ్‌ ఎదుర్కోగలదు. సత్ప్రవర్తనను నేర్పించగలదు. 'సత్ప్రవర్తనగల వ్యక్తి సర్వేశ్వరుని దృష్టిలో అందరికన్నా మిన్న' (ఖుర్‌ఆన్‌ 49:13)

ఈద్‌ను శ్రామికుని వేతనం లభించే రోజు అని ఖురాన్‌ విస్పష్టం చేసింది. నెలరోజులు కఠోరవ్రతం పాటించినవారి శ్రమకు పరిపూర్ణ ప్రతిఫలం ఈరోజే లభిస్తుందని విశ్వాసం. పర్వదినాన ఉదయం స్నానపానాదులు ముగించుకొని నూతన వస్త్రాలు ధరించి సుగంధం, పన్నీరు పూసుకొని 'తక్బీర్‌' పఠిస్తూ ఈద్‌గాహ్‌ (పండుగ నమాజ్‌ చేసే స్థలం) చేరుకుంటారు. అక్కడ ప్రార్థన చేస్తారు. 'ఇహ్‌దినస్సిరాతల్‌ ముస్తఖీమ్‌' (మాకు సన్మార్గాన్ని చూపు). సమస్త మానవాళి హృదయాల్ని సద్బుద్ధితో నింపాలని కోరతారు. ఈద్‌గాహ్‌లో నమాజ్‌ పూర్తి అయిన అనంతరం అక్కడ సమావేశమైన వారిలో వీలైనంత ఎక్కువమందిని కలిసి సుహృద్భావంతో చేతులు కలుపుతారు. హృదయాలు సన్నిహితమవుతాయి. సద్గుణాల పరిమళం పరిఢవిల్లుతుంది. ఈద్‌ ముబారక్‌ (ఈద్‌ శుభాకాంక్షలు) తెలియజేసుకొంటారు. అనంతరం ముస్లిమేతర సోదరుల్ని ఇంటికి ఆహ్వానిస్తారు. అమితానందంతో పరస్పరం ఆలింగనం చేసుకొంటారు. విందు ఆరగిస్తారు. ఈద్‌ మిలాప్‌ సమావేశాలు ఏర్పాటుచేస్తారు. ఇవన్నీ మతసామరస్యానికి, పరస్పర సదవగాహనకు, సమైక్యతకు ప్రతీకలు. మతసహనం మానవలోకానికి మణికిరీటంగా భాసిస్తే, మనిషి మనిషిగా జీవిస్తే భగవంతునికి ఎనలేని హర్షం. ప్రతి వ్యక్తి నిస్వార్థ సేవ చేస్తే జీవితంలోని వాస్తవిక ఆనందం బోధపడుతుంది. ఇతరుల శ్రేయంకోసం జీవిస్తే అది విరాటజీవనంలో పదార్పణమవుతుంది. అప్పుడే సర్వేశ్వరుడు మన జీవితాలకు సాఫల్యం సమకూరుస్తాడు. తన హృదయ వైశాల్యాన్ని ప్రతి వ్యక్తీ లోకానికి చాటినప్పుడే జన్మకు సార్థకత, సంపూర్ణత. అది డబ్బు గడించడంవల్ల రాదు. కోరికలు నెరవేర్చుకోవడంవల్ల ఒనగూడదు. ఇది అనంత జీవిత సత్యం, పర్వదినాల సారాంశం.

------------------------------------------------------------

పూర్తీ వివరాలకు - > రంజాన్

Sunday, October 25, 2009

ఉండ్రాళ్ళ తద్దె , Undralla tadde



ఉండ్రాల తద్దె ఆడపిల్లల పండుగ . మన హిందూ సంప్రదాయము లో............
ఒకరోజు పండుగలు ---------- కృష్ణాష్టమి , (ఉదాహరణానికి )
రెండ్రోజుల పండుగలు -------- నరకచతుర్దశి - దీపావళి , ఉండ్రాలతద్దె .
మూడురోజుల పండుగలు ------భోగి - సంక్రాంతి - కనుమ ,
నెలంతా పండుగ గా ---------- కార్తీక - ఆశ్వయుజ మాసాలు ,

ప్రతి సంవత్సరమూ భాద్రపద బహుళ తదియ నాడు నోచుకునే నోము ఉండ్రాళ్ళ తదియ. ఇది రెండ్రోజుల పండుగ .

  • ముందు రోజు --
ఐదుగురు ముత్తైదువులకి గోరంటాకు ముద్ద ,పసుపు కుంకుమలు ,కుంకుడు కాయలు ,నువ్వులనూనె ఇచ్చి మాయింటికి తాంబూలము తీసుకోవటాని కి రండి అని ఆహ్వానించాలి.

వివాహం కాని ఆడపిల్లలు ఈ రోజు తెల్లవారుజామున తలంటుపోసుకోవాలి . తలంటు అనగానే ఏదో షాంపుతో కాకుండా కుంకుడుకాయల రసం తో తలని రుద్దుకోవాలి . ఆ కుంకుడులోని దేదుతనం క్రిముల్నీ , కీటకాలనీ జుట్టులోనికి రానీయదు . జుట్టులోని తడిని పిడవ (మెత్తని తుండుని చుట్టుకోవడం )ద్వారా బాగా పీల్చుకునేలా చేసుకుని సాంబ్రాణి పొగని పట్టించుకోవాలి . దీంతో జుత్తంతా సువాసనతో నిండడమేకాక , తల తడిసిన కారణం గా శిరోజాల మూలాల వద్ద వున్న తడి పూర్తిగా ఆరిపోతుంది . ఇక గోంగూరపచ్చడితో పెరుగన్నాన్ని తినిపిస్తారు ... పిల్లలందరికీ. ఈ తతంగమంతా ఉదయం 06 గంటలకే పూర్తవ్వాలి . ఇక్కడితో ఈ రోజు పండుగ ముగిసినట్లే .
వైద్య రహస్యము : ఆయుర్వేద శాస్త్రం ప్రకారము గోగూర వేడిచేసే ద్రవ్యము , పెరుగన్నము చలవ చేసే పదార్దము . తలంటు స్నానము అనేది తలని శుభ్రం చెస్తే గోంగూర పెరుగు అన్నము పిల్లలకు చురుకుదనాన్ని ఇస్తుంది . పూర్వం రోజుల్లో పొలాలకెళ్ళే రైతులంతా పెరుగన్నము గోంగూర లేదా ఆవకాయ నంజుకుని వెళ్ళిపోయి మళ్ళీ మధ్యాహ్నం రెండుగంటలకి ఆకలితో నకనకలాడుతూ వస్తూండేవారు . ఆ తీరుగా చురుకుదనాన్ని పుట్టిస్తుంది . .. ఈ భోజన మిశ్రమము . కొన్నిచోట్ల నువ్వులపొడుం కూడా ఈ మిశ్రమములో చేరుస్తారు . దీనివల్ల శ్రావణ భాద్రపద మాసాల్లో వర్షాల కారణంగా వచ్చే జలుబు - రొంప , ముక్కు - కళ్ళ మంటలు రానేరావు .

  • రెండవ రోజు :
ఉండ్రాళ్ళతద్దె లోని ప్రత్యేకత తెల్లవారుఝాము భోజనాలు. మళ్ళీ ఇన్నటిలాగే గోంగూర లేదా ఆవకాయ నంచుకుని పెరుగన్నాన్ని తిని అలసిపోయేవరకూ దాగుడుమూతలూ , ముక్కుగిల్లులాటలూ , దూదుంపుల్ల , కోతికొమ్మచ్చి మొదలగు ఆటలు దాదాపు ఉదయం 08 గంతలయ్యేంతవరకూ ఆడుతారు . ఉయ్యాలలూగుతారు. అంతా అయ్యాక ఏ పిల్లకి సంబంధించిన తల్లి రాను తెచ్చిన ఉండ్రాళ్ళని ఆయా కూతురికిస్తే ఆ తల్లీ కూతురూ ఆ ఉండ్రాళ్ళని మరో తల్లీ కూతుళ్ళకిస్తారు . ఈ సందర్భం లో ఈ కూతురు ఆ తల్లికీ , ఆ కూతురు ఈ తల్లికీ నమస్కరిస్తారు . ఇదొక తీరు ఐకమత్యాన్ని పెంపొందించుకునె తీరు -- ఆట , పండుగ అంతేకాదు తర్వాత నెలలో రాబోయే అట్లతద్దికి శిక్షణ వంటిదికూడా .
వైద్య రహస్యము : వేదం లో ఓ స్లోకము ఉంది . వివాహములో దీన్ని చెప్తారుకూడా .
సోమ: ప్రధమో వివిదే గంధర్వో వివిద ఉత్తర: !
తృతీయో అగ్ని స్టే పతి: తురీయ స్తే మనుష్యజ: !! --------------అని

పుట్టిన ప్రతి ఆడపిల్ల మీదా ఒకటి నుండి ఐదో సంవత్సరం వచ్చేవరకూ చంద్రుడు రాజ్యంచేస్తాడట . అందుకే ఆ పిల్లలు బాగా ఆకర్షణీయం గా ఉండాడమే కాక ఎప్పుడూ అలా గుర్తుకొస్తూవుంటారు కూడా . ఏ చంద్రుడు మనస్సుని దృఢం చేస్తుంటాడో ఆ కారణం గ తండ్రి , మామయ , బాబాయి .... ఇలా అందరినీ , మ ఇంటినీ . పొరుగింటినీ కూడా ఇట్టే ఆకర్షించ గలుగుతారు ఈ కాలం లో .
ఆరు నుండి పదో సంవత్సరం వచ్చే వరకూ ఆ పిల్లని చంద్రసాక్షిగా గంధర్వుడు స్వీకరించి రాజ్యం చేస్తాడు . గంధర్వుడు లావణ్యానికి అధినేత కాబట్టి ఆ పిల్లకి అందాన్ని కలిగిస్తాడు . ఆడపిల్లలలో నిజమయిన అందం (ఏ విధమైన దుర్భావకూ లేని అందం ) ఆరు నుండి పడేళ్ళ వరకూ బాగా ఉంటుంది .
ఇక 11 నుండి 15 యేళ్ల మధ్య అగ్నిదేవుడు ఆడపిల్ల బాధ్యతను గంధర్వుని సాక్షిగాస్వీకరిస్తాడు . అగ్నిదేవుడు కామానికి అధిష్టాత కాబట్టి ఆమెలో కామకుణాన్ని 11 వ సంవత్సరం రాగానే ప్రవేశపెడతాడు .

ఈ వయసుకు ముందు మయసులో అనగా 15 సంవత్సరాలలోపు ఉన్న వాళ్ళంతా శారీరకంగా ఆరోగ్యవతులుగా ఉండే నిమిత్తమే ఈ ఆటలూ , ఉండ్రాల వాయనాలు .

మద్యాహ్నం గౌరీ పూజ. గౌరిని షొడశోపచారాలతో పూజించిన వారికి సమస్త శుభాలు సమకూరుతాయంటారు. ఐదు దారపు పోగులు పోసి, ఐదు ముడులు వేసి , ఏడుతోరాలను అమ్మవారి పక్కనే వుంచి పూజించాలి. ఒక తోరం అమ్మవారికి, ఒకటి నోముకున్నవారికి , మిగితా ఐదు, ఐదుగురు ముత్తైదువులకు కట్టాలి. బియ్యపు పిండిలో బెల్లము కలిపి , పచ్చి చలిమిడి చేసి , ఐదు ఉండ్రాలను చేసి , నైవేద్యం పెట్టాలి.

పూజ తరువాత చేతిలో అక్షింతలనుంచుకొని కథచెప్పుకోవాలి.ఈ వ్రత కథ ఏమిటంటే , పూర్వం ఓ వేశ్య ,తన సౌందర్యం తో ఆ దేశపు రాజుగారిని వశపరుచుకుంది. ఒక ఉండ్రాళ్ళతద్దె నాడు ,రాజుగారు ఆమెను నోము నోచుకోమని కోరారు.ఆమె అహంకారముతో దైవ నింద చేసేసి నోముకో లేదు. పలితంగా దొంగలు ఆమె సంపదనంతా దోచుకెళ్ళారు. మహా వ్యాది బారాన పడ్డది. తరువాత రాజ పురోహితుడి సలహాతో ఉండ్రాల తద్దె నోము నోచుకొని, తన సంపద ని తిరిగి పొంది, ఆరోగ్యస్తు రాలై శేష జీవితాన్ని ఆద్యాత్మికంగా గడిపి , మరణానంతరం గౌరీ లోకానికి వెళ్ళింది.

ఒక గర్విష్టికే ఈ నోము వలన ఇంతటి సద్గతి లభించింది కదా ! సత్ప్రవర్తన తో ఉండి నోచినవారికి ఇంక ఎంత ఉన్నతమైన పలితముంటుందో ఊహించుకొని సన్మార్గం లో నడవండి ! అనేది ఈ కథలోని నీతి.

హిందు సాంప్రదాయములో నోములు , పూజలకి పెద్ద పీటనే వేసారు. నోము నోచుకుంటేనే సుమంగళిగా వుంటామా ? అందుకోసం వ్రతాలు చేయాలా ? అని వితండ వాదం చేసే వారికి ఏమీ చెప్పలేను . అంత పరిజ్ఞానము నాకు లేదు. నోముకుందాము అనుకోగానే ఇల్లు శుభ్రం చేసి , మామిడాకులు కట్టి, ముగ్గేసి, దేవుడి పీఠానికి పూలూ ,ఆకులు అలంకరించి , ధూప దీప నైవేద్యాల తో పూజించి , ముత్తైదువులకు , తాంబూల మిచ్చి , ఆశీస్సులు తీసుకోవటము తో ఇంటికి ఓ కళ వస్తుంది. మనసు లో ఓ ప్రశాంతత ఏర్పడుతుంది. ఇంట్లో పాజిటివ్ వేవ్స్ వచ్చినట్లుగా వుంటుంది. కుటుంబ శ్రేయస్సు ,ఆద్యాత్మికానందం కలుగుతుంది.
  • ================
 visit my website : Dr.Seshagirirao.com

మహావీర్ జయంతి , Mahaveer Jayanthi






అహింసను ప్రభోదించిన జైన మాట ప్రచారకుడు , వర్ధమాన మహావీరుడి జయంతి ని ప్రతిసంవత్సరము చైత్ర మాసం లో ఘనముగా జరుపుకుంటారు .
బీహార్ లో వైశాలి కి సమీపములో కుండ గ్రామము లో క్రీ.పూ. 599 లో క్షత్రియ కుటుంబములో సిద్దార్ధ మహారాజుకు , రాని త్రిష లకు జన్మించిన మహావీరుడికి తల్లి దండ్రులు పెట్టిన పేరు వర్ధమానుడు . అల్లారుముద్దుగా పెరిగిన మహావీరుడు తల్లి దండ్రులు 28 వ ఏట మరణించారు , యశోధరను వివాహమాడి , ఓ కుమార్తెకు జర్మనించ్చిన తరువాత 36 వ ఏట సన్యాసాన్ని స్వీకరించిన వర్ధమానుడు . 12 ఏళ్ళ పాటు తపస్సు చేసి మహావీరుడు గా జైనమత ప్రచారకుడయ్యాడు . అప్పటి కే జైన మతానికి 23 మంది తీర్ధన్కరులుగా ఉన్నప్పటికీ మహావీరుడు బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఆ మతానికి సంభందించిన వివరాలు వెలుగు చూశాయి . ౩౨ ఏళ్ళ పాటు అహింసా ధర్మము to మాట ప్రచారం జరిపిన మహావీరుడు 72 వ ఏట మరణించారు .

Easter Sunday,ఈస్టర్ సండే






క్రైస్తవ సోదరులకు ముఖ్యమైన పండుగల్లో ఈస్టర్‌ ఒకటి. ఆరోజు క్రైస్తవులకు మహా పర్వదినం. ఆనందించదగ్గ సుదినం. ఎందుకంటే - గుడ్‌ఫ్రైడే నాడు శిలువవేయబడ్డ ఏసుక్ర్తీసు తిరిగి జన్మించింది ఈరోజే కనుక!

బైబిల్‌ ప్రకారం - గుడ్‌ఫ్రైడే నాడు జెరూసలెంలో ఏసుక్ర్తీసును శిలువ వేయడం జరిగింది. తాను దేవునిబిడ్డగా ప్రచారం చేసుకుంటున్నాడని చక్రవర్తికి పన్నులు కట్టాల్సిన పనిలేదని ప్రజలకు నూరిపోస్తున్నాడని - ఇలా వివిధ ఆరోపణలతో ఏసుక్రీస్తును యూదులు శిలువ వేశారు. తలపై ముళ్ల కంపలతో, కొరడాదెబ్బలతో ఆయన శరీరం రక్తసిక్తమైంది. శిలువపై ఆయన్ని మేకులతో కొట్టడంతో తుదిశ్వాస విడిచాడు. గుడ్‌ఫ్రైడే నాడు ్యమధాహ్నం సరిగ్గా మూడు గంటలకు ఏసు మరణించడంతో శిలువ నుంచి ఏసుక్రీస్తు శవాన్ని జోసెఫ్‌ అనే వ్యక్తి కిందకు దించాడు.

ఆ మృతదేహాన్ని ఓ సన్నని షీట్‌లో భద్రపరిచి సమాధి చేశాడు. అయితే ఆ సమాధిలో ఏసు మృతదేహంపై ఎలాంటి సుగంధ ద్రవ్యాల్ని వేసిన దాఖలాలు లేవు. ఈ విషయాన్ని గలిలీ నుంచి వచ్చిన కొంతమంది స్త్రీలు గమనించారు. దాంతో వారు ఇంటికి వెళ్లి కొన్ని సుగంధద్రవ్యాల్ని, పెరఫ్్యూమ్‌లను తయారుచేశారు. ఆ మర్నాడు సబ్బతో (శనివారం) కాబట్టి వారు విశ్రాంతి తీసుకున్నారు. (యూదు చట్టం ప్రకారం) ఆదివారం ఉదయం పొద్దున్నే - ఆ స్త్రీలు సమాధి దగ్గరకు సుగంధ ద్రవ్యాల్ని తీసుకు వెళ్లారు.

అక్కడ వారు చూసిన దృశ్యం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆ సమాధి పక్కనే ఉన్న ఒకరాయి పక్కకు దొర్లినట్లు కనిపించింది. లోపల ఏసు మృతదేహం లేకపోవడం ఇంకా ఆశ్చర్యం. ఒక్కసారిగా మెరిసిపోయే ధవళ వస్త్రాలలో ఇద్దరు ఆ స్త్రీల చుట్టూ ఉండడం కనిపించింది. వారెవరో కాదు దేవతలు...

సమాధి నుంచి బయటకు వచ్చి - బతికి ఉన్న వ్యక్తి కోసం ఎందుకు సమాధిలో ఇంకా వెతుక్కుంటారు. వ్యర్ధంగా అని ఆ దేవతలు ఆ స్త్రీలను ప్రశ్నించారు. ఆ స్త్రీల ఆనందానికి అంతులేదు. గబగబ ఇళ్లకు వెళ్లారు. అందరికీ ఈ ఆనందకర వార్తను చెప్పారు. క్షణాల్లో ఈ విషయం అందరికీ పాకిపోయింది. దేవుని బిడ్డ తిరిగి బతకడంతో తమ జీవితాల్లో వెలుగులు నింపుతాడని భావించి వారి ఆనందానికి అవధుల్లేవు, పట్టపగ్గాల్లేవు. ఆదివారంనాడు ఏసుప్రభువు పునరుజ్జీవితుడయ్యాడు. కాబట్టి ఆ రోజు వారు ఈస్టర్‌ పండగ జరుపుకున్నారు. ఈస్టర్‌ అనే పదం పుట్టుక చాలా మందికి తెలీదు. ఆంగ్లో-స్క్సాన్‌ ట్యుటోనిక్‌లో శరదృతువుకు, ఫలత్వానికి దేవతకు - ఈస్టర్‌ అనే పదంతో సంబంధం ఉన్నట్లు చెబుతారు. ఈ దేవతను పూజించేందుకు ఏప్రిల్‌ మాస్నాని అంకితం చేశారు.

ఈస్టర్‌కు గల మరో పేరు - పాస్ట్. ఈ పదం - యూదుల పండుగ అయిన పేసో పండగ కు చెందిందని చెబుతారు.

నిజానికి చాలా లక్షల సంవత్సరాల కిందట క్రైస్తవుల్లో చాలా మంది యూదు వంశానికి చెందిన వారు. వారు ఈస్టర్‌ను కొత్త అనుభూతిగా ఆహ్వానించారు. ఈస్టర్‌ వారంలో అనేక ఉత్సవాలు జరుపుకోవడం రివాజు. వసంత రుతువును ఆహ్వానిస్తూ సూర్యోదయపు తొలికిరణాల్ని స్వాగతించడం ఓ ఉత్సవం. బాప్టిస్టులకు ఈస్టర్‌ రాత్రి ఓ మధురానుభూతి బ్టాపిజం తీసుకునే కొత్తవారు - మరణానికి చిహ్నమైన రాత్రి చీకట్లను పారదోలడం ప్రముఖంగా సాగే చర్చ. రాత్రివేళ జరిగే ఈ ఉత్సవం - నూతన జీవిత్నాని పొందేందుకు వెలుగును ప్రసాదించడం విశేషం. దీనికి గుర్తుగా వారు ఆ చీకటి వేళ కొవ్వోత్తుల్ని వెలిగిస్తారు. దీన్ని ౞నైట్‌ ఆఫ్‌ ఇల్యుమినేషన్‌ అని పిలుస్తారు. కొవ్వొత్తుల్ని వెలిగించే సంప్రదాయం ప్రారంభమైంది. ఈ ఉత్సవం నుంచే!

ఈస్టర్‌ ఆదివారంనాడు - క్రైస్తవులు చర్చిల్లో కొవ్వొత్తులు వెలిగిస్తారు. ఈస్టర్‌ నాడు - క్రైస్తవులు కొవ్వొత్తులు వెలిగించుకుని వాటిని చేతబట్టుకుని నగరమంతా పర్యటిస్తారు. దీన్ని ఈస్టర్‌ పెరేడ్‌ అంటారు. ఈ ఉత్సవం కూడా కొత్తగా బాప్టిజం తీసుకుని క్రైస్తవ మతంలోకి వెళ్ళేవారి కోసం ఏర్పాటైనది. కొత్త బట్టలు కట్టుకుని, క్రైస్తవ సోదరులందరి ఇళ్లకూ వెళ్లి బహుమతులు పంచుకోవడం జరుగుతుంది.

అంతేకాదు - ఈస్టర్‌ రోజున క్రైస్తవ సోదరులు అందంగా అలంకరించిన కోడిగుడ్లను పరస్పరం పంచుకుంటారు. ఈ కోడిగుడ్డు - నూతన జీవితానికి హ్నం. పై నున్న బలమైన పెంకును దూసుకుని బయటకు జీవి వ్చనట్లు - పునర్జన్మకు ఇది సంకేతం. గుడ్‌ఫ్రైడే నాడు సమాధి కాబడిన ఏసుప్రభువు - ఈస్టర్‌ సండేనాడు సమాధి నుంచి బయటకు వచ్చాడు. కోడిగుడ్డు లోంచి కోడిపిల్ల బయటకు వచ్చినట్లుగా జరిగిన ఆ సంఘటనకు గుర్తుగా - ఈస్టర్‌నాడు క్రైస్తవులు కోడిగుడ్లను పంచుకోవడం జరుగుతుంది. ఈస్టర్‌ నాటి కుందేలుకు కూడా ప్రాధాన్యం ఉంది. ఇది ఫలదీకరణకు, ఫలవంతానికి ప్రతీక. ఇది వసంత రుతువును ప్రతిబింబిస్తుంది.

గుడ్‌ఫ్రైడే, Good friday





గుడ్ఫ్రైడే - చరిత్ర, ప్రాధాన్యత
క్రైస్తవ సోదరులకు ప్రధానమైన రోజ్లులో గుడ్‌ఫ్రైడే ఒకటి. పాప్నులి ద్వేషించకు, పాపాల్ని ద్వేషించు అన్న ప్రేమమ్తూరి. ఏసుక్రీస్తును శిలువ వేసిన రోజది. తమ జీవిత నావను నడిపించే ఏసుప్రభువు రక్తపు ధారల మధ్య... ముళ్ళ కంచెల భారంతో... శిలువ వేయబడ్డాడని క్రైస్తవులంతా దుఃఖసాగరంలో మునిగి పోయే రోజది. ఆ రోజున వారు ప్రార్ధనలు జరుపుతారు. ఉపవాసదీక్ష పూనుతారు.

గుడ్‌ఫ్రైడ్‌ అనే పదం గ్సాడ్‌ ప్రైడే అనే పదం నుంచి ఉద్భవించిందని చెబుతారు. ఈ పదం - పది లేదా 11వ శతాబ్దంలో ్థసిరపడినట్లు తెలుస్తోంది.
క్రైస్తవ గ్రంధాల ప్రకారం - ఏసుక్రీస్తు నజరత్‌ అనే పట్టణానికి చెందిన వ్యక్తి. ఈ పట్టణం ప్రస్తుతం ఇజ్రాయిల్‌లో ఉంది. చాలామంది ఏసును దేవుని బిడ్డగా భావించేవారు... పూజించేవారు, కొలిచేవారు. అయితే యూదు ప్రవక్తలకు, ఉన్నతాధికారులకు మాత్రం ఇది కడుపుమంటగా ఉండేది. ప్రజల్ని ఏసు తప్పుదోవ పట్టిస్తున్నాడని వారు భావించేవారు. దాంతో వారు ఎలాగైనా ఏసును హతమార్చాలని కుతంత్రం పన్నారు. జుడాలని పిలవబడే 12 మంది శిష్యులతో వారు ఈ పథకాన్ని అమలు పరిచేందుకు ప్రయత్నించాడు. వారు ఏసుక్రీస్తును నిర్భధించారు. ఆ మర్నాడు ప్రవక్తల సంఘం ముందు హాజరుపరిచారు.

ప్రజల్ని పక్కదోవ పట్టిస్తున్నాడని, చక్రవర్తికి పన్నులు కట్టక్కర్లేదని ప్రజలకు చెబుతున్నాడని, తాను దేవుని ప్రతినిధిగా చెప్పుకుంటున్నాడని... ఇలా వివిధ ఆరోపణల్ని ఏసుపై రుద్దారు. ఇవన్నీ నిజమని నిర్ధారించి రోమన్‌ చక్రవర్తి ముందు ఏసును హాజరు పరిచారు. అయితే చక్రవర్తి మాత్రం ఆ ఆరోపణల్ని నమ్మలేదు - అయినా మతప్రవక్తలు పట్టుబట్టి - నగరంలోని విధ్వంసకాండకు కూడా ఏసే కారణమని నమ్మబలికారు. చక్రవర్తిపై వారు మరింత ఒత్తిడి తీసుకురావడంతో ఇక చేసేది లేక చక్రవర్తి - ఏసును ఏం చేసుకుంటారో మీ ఇష్టం అని ఆ మతప్రవక్తలకు వదిలి వేశాడు. దీంతోవారు ఏసును శిలువ వేయాలని నిర్ధారించారు.

ఏసుక్రీస్తుకు తలపై ముళ్ళ కంప పెట్టారు. సైనికులు కొరడాలతో కొట్టారు. చెక్కతో చేసిన పెద్ద శిలువను ఆయన భుజాలపై మోపారు. కొంతదూరం నడిపించారు. చుట్టూ ప్రజలు... ఆయన వెనుక ఆయన అనుచరులు... ప్రజలు రాళ్ళతో కొట్టారు. చివరకు ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఏసుక్రీస్తుకు శిలువ వేశారు. చేతుల్ని శిలువకు మేకులతో బంధించారు. రక్తం ఓడుతున్న ఏసుక్రీస్తు మూడుగంటల తర్వాత ప్రాణం వదిలాడు. ఆ రోజు శుక్రవారం... మధ్యాహ్నం సరిగ్గా మూడు గంటలకు ఏసుక్రీస్తు శిలువపై తుది శ్వాస విడిచాడు. ఆ నాటి ఆ శిలువకు గుర్తుగా.. చర్చిల్లో శిలువను ఉంచే సంప్రదాయం నెలకొంది. మరణించే ముందు ఏసుక్రీస్తు దేవుణ్ణి ఇలా ప్రార్ధించాడు.

ప్రభూ నా మరణానికి కారణమైన వీళ్ళందరిని క్షమించు. వీరు పాపులే అయినా క్షమించి వదిలిపెట్టు ఎందుకంటే పాపం అని తెలీని అమాయకులు వారు. ఏసుక్రీస్తులోని దయాగుణం, క్షమం, ఔన్నత్యాలకు ఇది నిదర్శనం. అయితే ఇది జరిగిన రెండు రోజుల తర్వాత అంటే ఆదివారంనాడు ఏసుక్రీస్తు శిలువపై నుండి పునర్జన్మించాడు. అందుకే ఆ రోజు ఆనందసందోహాల ఈస్టర్‌ ఆదివారం జరుపుకుంటారు. గుడ్‌ఫ్రైడేనాడు జరుపుకునేవి అన్ని అంతకుముందు గురువారం రాత్రి ప్రారంభం అవుతాయి. చివరి సప్పర్‌ తీసుకున్న తరువాత - వారు ఈస్టర్‌ వరకు ఉపవాసం ఉంటారు. కైస్తవులకు ఆరాధనా స్థలం - ప్రశాంతతకు ప్రతిరూపంగా, అహ్లాదకర వాతావరణానికి ప్రతిబింబంగా నిలిచే చర్చి.

గుడ్ ఫ్రైడే రోజున ఏమేం చేస్తారు...!

గుడ్ ఫ్రైడే రోజున క్రైస్తవ ధర్మాన్ని పాటించేవారు చర్చిలకు వెళ్ళి యేసు ప్రభువును ప్రార్థిస్తారు. క్రీస్తు జననం(క్రిస్మస్) పండుగ తర్వాత క్రీస్తు పేరిట ప్రార్థనలు, ప్రాయశ్చిత్తం, ఉపవాసాలను పాటిస్తారు. ఈ సమయాన్నే "ఈస్ట్ వెడ్నెస్‌డే" నుంచి ప్రారంభమౌతుంది. ఇది గుడ్ ఫ్రైడే రోజుకు పరిసమాప్తమౌతుంది. దీనినే లెంట్ అని అంటారు.

ఇదే రోజున క్రీస్తును శిలువ చేశారు. దీనికి గుర్తుగా ప్రతి సంవత్సరం క్రైస్తవ ధర్మాన్ని పాటించేవారు కొయ్యతో చేసిన శిలువను చర్చిలలో ఉంచి ప్రార్థిస్తారు. ప్రతి ఒక క్రిస్టియన్ వచ్చి ఆ శిలువను ముద్దాడుతారు.

ఆ తర్వాత మధ్యాహ్నంనుంచి మూడు గంటలవరకు సేవలుంటాయి. ఈ సేవలలో క్రీస్తు సిద్ధాంతాల(నాలుగు గోస్పెల్స్)లోంచి ఏదో ఒక దానిని చదివి భక్తులకు వినిపించి వారిచేతకూడా చదివిస్తారు.

ఆ తర్వాత చర్చిలలో ప్రవచనాలు, ధ్యానం మరియు ప్రార్థనలు జరుగుతాయి. ఈ సందర్భంగా క్రీస్తును ఎలా శిలువ చేసేరనేదానిపై మత పెద్దలు ఉపన్యాసం చేసి క్రీస్తును స్మరించుకుంటారు.

దీని తర్వాత అర్థరాత్రికి సాధారణ కమ్యూనియన్ సర్వీస్ ఉంటుంది. అంటే సామూహిక ప్రార్థనలలో క్రీస్తు స్మృతిపథాన్ని గుర్తు చేసుకుంటారు.

కొన్ని చోట్ల నల్లటి వస్త్రాలు ధరించి భక్తులు క్రీస్తును స్మరిస్తూ ఒక సమారోహాన్ని ఏర్పాటు చేస్తారు. చివరికి కృత్రిమ అంతిమ సంస్కారం కూడా చేస్తారు.

క్రైస్తవ ధర్మాన్ని పాటించేవారు గుడ్ ఫ్రైడే రోజున ప్రాయశ్చిత్తం, ప్రార్థనలు చేసుకునే రోజు. ముఖ్యంగా ఈ రోజు చర్చిలలో గంటలు మ్రోగవు.


ఏసు అమర వాక్యాలు

జీసస్‌ను శిలువ చేసేందుకు గుల్గుతా అనే పేరుగల ప్రాంతానికి తీసుకువెళ్ళారు. అక్కడ ఆయనను శిలువకు వ్రేలడదీసారు. ఏసు యహూదీయులకు రాజు అని ఓ ఉత్తరంలో పేర్కొనబడింది. మిట్టమధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఏసు తన ప్రాణాలను పరలోకానికి పంపేముందు ఏడు అమర వాక్యాలు పలికారు. వాటిని ఈ రోజు స్మరించుకోవడం మనందరి కర్తవ్యం.

మొదటి వాక్కు : ఓ తండ్రీ వీరిని క్షమించు, ఎందుకంటే వీరి ఏం చేస్తున్నారో వీరికి తెలియదు.

రెండవ వాక్కు : ఈ రోజు నీవు నాతోబాటు స్వర్గలోకంలో ఉంటావని నేను నమ్ముతున్నాను. దేవుడా నేను నీతో నిజమే పలుకుతున్నాను.

మూడవ వాక్కు : ఓ నారీమణి, నీ పుత్రుడ్ని, నీ తల్లిని చూడు.

నాలుగవ వాక్సు : ఓ నా పరమేశ్వరుడా..! ఓ నా పరమేశ్వరుడా..! నీవు నన్ను ఎందుకు వదిలేసావు?

ఐదవ వాక్కు : నేను నీకోసం పరితపిస్తున్నాను.

ఆరవ వాక్కు : పూర్తయిపోయింది.

అందరికి తండ్రి అయినటువంటి పరమేశ్వరుడు తన పుత్రుడైన ఏసును ఏ కార్యక్రమంకోసం భూమిమీదకు అవతరింపజేసాడు. ఆ పని ఇప్పుడు పూర్తయ్యింది. చివరికి శైతానుకూడా ఆ పనులు పూర్తయ్యేందుకు అడ్డుపడలేకపోయాడు. శైతాను వలన కాలేదు. కాని జీసస్ తన ప్రాణాలను వదిలి చేయవలసిన పనులేవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసాడు. మనందరికి మంచి జీవితాన్ని ప్రసాదించి మనకంటూ కొన్ని లక్ష్యాలను రూపొందించాడు దేవుడైన ఏసు ప్రభువు. వాటిని పొందడానికి నిరంతరం ప్రయత్నిస్తుండాలి.

ఏడవ వాక్కు : ఓ నా తండ్రీ ! నేను నా ఆత్మను నీ చేతులలో ఉంచుతున్నాను.

దేవుడు తనకు చెప్పిన కర్తవ్యాన్ని పూర్తి చేసుకుని ఏసు ప్రభువు ఈ ప్రపంచాన్ని వదిలి పరలోకానికి పయనమైన రోజు ఈ రోజు. ఆ రోజులలో అపరాధులకు కోరడాలతో శిక్షించేవారు. రెండవది బలిపీఠంపై వ్రేలాడదీసేవారు. ఏసు క్రీస్తు ఈ రెండు శిక్షలను అనుభవించి తన తండ్రి అయిన దేవునికి తన ఆత్మను సమర్పించి ప్రపంచంనుంచి కనుమరుగైనారు. అయినాకూడా ఆయన మన మధ్యలోనే ఉన్నారు. ఓ నా తండ్రి ఇది ఆత్మీయతకు పరిచయ మార్గం.

శుభకరమైన శుక్రవారంనాడు పవిత్రమైన ఈ రోజున ప్రపంచశాంతి, ఉగ్రవాదం అంతమవ్వాలని కోరుకుంటూ ఇరుగు పొరుగు అందరూ సోదర భావంతో మెలగాలని, ఇతరులపట్ల ప్రేమానురాగాలను పంచాలనికోరుతూ ప్రార్థించండి. హలలూయా....హలలూయా...హలలూయా...!

Thursday, October 15, 2009

బ్రహ్మ విష్ణు మహేశ్వరు లలో ఎవరిని పూజించాలి?, Whom to worship Brahma Vishnu Eswara?






హిందూ మతం లో ...
బ్రహ్మ , విష్ణు , మహేశ్వరుల లో ఎవరిని పూజించాలి ?

బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో ఎవరిని పూజించాలి? ఎవరిని గురించి తపస్సు చేస్తే కోరుకున్నవి నెరవేరతాయి? అనే సందేహం పూర్వం ఓసారి అగస్త్య మహామునికే వచ్చింది. అప్పుడాయన సందేహం ఎలా నివృత్తి అయింది అని చెప్పే కథా సందర్భం ఇది. మహారాజుకు అగస్త్యుడు తన స్వానుభవాన్ని వివరించాడు.

పూర్వం సర్వలోక జ్ఞానప్రాప్తికి అగస్త్యుడు ఎవరిని ఆరాధించాలా అని ఆలోచించి తనకు తెలిసినంతలో సనాతనుడు, యజ్ఞమూర్తి అయిన విష్ణువును ఆరాధించటం ప్రారంభించాడు. అలా ఆ యజ్ఞమూర్తిని చాలాకాలం పాటు ఆరాధిస్తుండగా ఓ రోజున యజ్ఞమూర్తి ప్రత్యక్షం కాలేదు. కానీ దేవేంద్రుడితో సహా దేవతలంతా అగస్త్యుడి ఆశ్రమానికి వచ్చారు. తాను యజ్ఞమూర్తిని ఆరాధిస్తుంటే ఆయన ప్రత్యక్షం కాక ఈ దేవతలంతా వచ్చారేమిటబ్బా.. అని అగస్త్యుడు ఆలోచిస్తుండగానే ముక్కంటి నీలలోహితుడు అయిన శివుడు అక్కడికి వచ్చి నిలుచున్నాడు.

ఆయనను చూడగానే దేవతలు, రుషులు అంతా కలిసి ఆ రుద్రమూర్తికి నమస్సులర్పించారు. ఇంతలో మహాయోగి, త్రికాలజ్ఞుడు, పద్మ సంభవుడు అయిన బ్రహ్మ ఓ విమానంలో అక్కడకు వచ్చాడు. అలా దేవతలంతా అక్కడకు వచ్చారు కానీ అగస్త్యుడు అనుకొన్నట్లు విష్ణువు మాత్రం రాలేదు. ఇదేమిటి నేననుకొన్నట్లుగాక ఈ దేవతలంతా వచ్చారేమిటి? అని ఆ ముని అనుకొంటూ ఇంతమంది దేవతల్లో అసలు పూజనీయుడెవరు? అనే సందేహం కలిగి రుద్రుడు వైపున తిరిగి అదే విషయాన్ని గురించి అడిగాడు. అప్పుడు రుద్రుడు ఇలా చెప్పటం ప్రారంభించారు.

ఓ మునీ.. లోకాలన్నీ సర్వయజ్ఞాలతో యజిస్తున్నది ఎవరినో, ఎవరి వల్ల ఈ జగత్తంతా దేవతలతో సహా పుడుతోందో.. అలాగే ఈ జగత్తంతా ఎప్పుడూ ఎవరిలో నిలిచి ఉంటుందో, ఎవరిలో విలీనమవుతోందో ఆ పరదైవమే సత్యరూపమైన నారాయణుడు. ఎవరు ఎంతమంది దేవతలను గురించి ఎన్ని పూజలు, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని నమస్కారాలు పెట్టినా అవన్నీ ఆ నారాయణుడికే చెందుతాయి. ఆ దేవదేవుడే లోకపాలనా సౌలభ్యం కోసం మూడు రూపాలుగా సృష్టించుకున్నాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనేవే ఆ రూపాలు. సత్వరజస్తమోగుణాలలో సత్వగుణం చేత జీవికి ముక్తి కలుగుతుంది. ఆ సత్వం నారాయణాత్మకం. యజ్ఞరూపుడైన నారాయణుడే ఆ భగవానుడు.

ఈయన నాలుగు యుగాలలో నాలుగు విధాలుగా లోకవాసుల చేత పూజలందుకొంటుంటాడు. కృతయుగం లోని వారు సూక్ష్మ రూపంలో ఉండే నారాయణుడిని ఉపాసిస్తారు. త్రేతాయుగం లోని ప్రజలు యజ్ఞరూపంలో ఉన్న నారాయణుడిని అర్చిస్తారు. ద్వాపరంలో పాంచరాత్ర సిద్ధాంతాన్ని అనుసరించే వారు ఆయనను ఉపాసిస్తారు. కలియుగంలో అనేక రూపాలలో ఆ జనార్ధనుడు పూజలందుకొంటుంటాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ జనార్ధనుడి కంటే పరదైవం ఇంకొకటి లేదు. విష్ణువే స్వయంగా బ్రహ్మ. బ్రహ్మే స్వయంగా రుద్రుడు.. అని బ్రహ్మ విష్ణు రుద్రులకు ఏ భేదాన్ని పాటించకుండా అందరూ ఆరాధించాలి. ఆ ముగ్గురిలో భేదాన్ని భావించిన వాడు పాపకారి, దుష్టాత్ముడు అవుతాడు.

ఇలా రుద్రుడు అగస్త్యమునికి దైవతత్వాన్ని గురించి వివరించి చెప్పారు. అగస్త్యముని అసలు విషయాన్ని అప్పటికి గ్రహించాడు. తాను అనవసరంగా బ్రహ్మ వేరు, విష్ణువు వేరు, రుద్రుడు వేరు అని అనుకొంటూ ఎదురొచ్చిన దేవతలను తక్కువ చేసి చూసినందుకు చింతించాడు. ఎవరి మనస్సుకు నచ్చిన పద్ధతిని బట్టి వారు ఆయా దేవతలను అర్చించవచ్చు. అంతేకానీ ఈ కనిపిస్తున్న దేవుడు మా దేవుడు కాదు.. అంటూ మన భేదాన్ని సృష్టించటం, ఎదుటి మతాన్ని, ఆ దేవతలను తక్కువ చేసి చూడటం సమంజసం కాదని ఆ మునికి బాగా అర్థమైంది.


ఆ కాలంలో సనాతనమతం తప్ప వేరే ఏమీలేనందున ఇప్పటి పరిస్థితులకు అనుగుణముగా మనం ఈ కథను విభిన్నమతాలకు అన్వయించుకోవచ్చు.

courtesy _

సురేష్ బాబు.
కదిరి పట్టణం,అనంతపురం జిల్లా.

Monday, October 12, 2009

అమావాస్య , New moon day (No moon day)


అమావాస్య,పౌర్ణమి ఏర్పడే విధానము -----------పౌర్ణమి రోజు చంద్రుడు------------అమావాస్య రోజు చంద్రుడు

అమావాస్య
  • చంద్రమానం ప్రకారం కృష్ణ పక్షము రోజులలో పదిహేనవ తిథి. అధి దేవత - చంద్రుడు . నెలకొక అమావాస్య చొప్పునాసంవత్సరానికి 12 అమావాస్ల్య్లుంటాయి . కొన్ని అమావాస్యలు హిందువులకు పవిత్రమైనవి . అమావాస్య కాలమానంలో చీకటి రోజు ... చంద్రుడుని చూడలేని రోజు . . . అయితే భూమండలం లో కొంతమందికే చీకటి , సగానికి చంద్రుడుకనిపిస్తాడు ... ప్రతివానికి ఏదో ఒక రోజు అమావాస్య వస్తుంది ... ఉంటుంది (చీకటి రోజు .. కష్టాలతో కూడుకున్న రోజు) .
  • అమావాస్య తిథి రోజున ఇంటి ముందు ముగ్గులు వేయకూడదని పండితులు అంటున్నారు. అమావాస్యకుముందురోజున పితృదేవతలు మన గృహానికి వస్తారని, సమయంలో పితృదేవతలకు-అర్ఘ్యమివ్వడంవంటి కార్యాలను చేయడం ద్వారా వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు.

  • అదేవిధంగా.. అమావాస్య రోజున ఇంటి ముందు చెత్తను శుభ్రం చేసి, నీటితో కల్లాపు చల్లడం వరకే చేయాలి. తర్వాతఇంటి ముందు ముగ్గులతో అలంకరిస్తే పితృదేవతలు వాకిలితోనే-ఆగిపోతారని పండితులు అంటున్నారు. అందుచేతఅమావాస్య నాడు ఇంటికొస్తారని విశ్వసించే పితృదేవతలను మనసారా ప్రార్థించి, దేవతామూర్తులకు ఇచ్చే నైవేద్యాలు, కర్పూర హారతులివ్వాలని పురోహితులు సూచిస్తున్నారు.

  • పితృదేవతలకు ప్రీతికరమైన రోజైన అమావాస్య నాడు -- దేవతలు స్మరించినా ఫలితం ఉండదని పండితులుచెబుతున్నారు. రోజున దేవతలకు సమానంగా పితృదేవతలను కొలిచే వారికి సకల సంపదలు చేకూరుతాయనివిశ్వాసం.
స్థూలంగా చెప్పాలంటే, తిథులు అంటే చంద్రుడి కళలు (Phases). వీటిల్లో అమావాస్య, పౌర్ణమి అంటే అందరికీ తెలుస్తుంది. భూమినుంచి చూస్తే ఆకాశంలో చంద్రుడు, సూర్యుడు ఒకరికొకరు ఎదురెదురుగా (నూట ఎనభై డిగ్రీల దూరంలో) ఉంటే అది పూర్ణిమ. ఇద్దరూ కలిసి ఉంటే (ఒకే డిగ్రీలో ఉంటే) అది అమావాస్య.

అమావాస్య నుంచీ పున్నమి వరకూ వచ్చే తిథుల్ని శుక్ల పక్షం అంటారు. మళ్ళా పున్నమి నుంచీ అమావాస్య వరకూ వచ్చే తిథులు కృష్ణ పక్షం లేక బహుళ పక్షం. శుక్ల పక్షపు తిథుల్నే శుధ్ధ తిథులని కూడా అంటారు. శుక్ల అంటే తెల్లని అని అర్ధం. కృష్ణ అంటే నల్లని అని అర్ధం.

పితృదేవతలు - అమావాస్య-- అనే పేరు ఎలా వచ్చింది ?:

పితృదేవతలనేవారిని శ్రాద్ధకర్మాదులతో అర్చించాలని చెప్పే సందర్భాలు అనేక పురాణాల్లో ఎదురవుతుంటాయి. ఈ పితృదేవతలు ఎవరనే సందేహానికి సమాధానమిస్తుందీ కథాసందర్భం.
ప్రతిమాసంలోను వచ్చే అమావాస్య అన్నా, మహాలయ అమావాస్య అన్నా పితృదేవతలకు ఎంతో ఇష్టమని, ఆ రోజున శ్రాద్ధ కర్మాదులను చేస్తే మంచి ఫలితం ఉంటుందని పెద్దలంతా అంటుంటారు. అసలీ పితృదేవతలకు, అమావాస్యకు ఉన్న సంబంధం ఏమిటి? పితృదేవతాగణాలు ఎన్ని? ఎలా ఉంటాయి? అమావాస్య ఎలా ఉద్భవించింది? అనే విషయాలను గురించి తెలియచెప్పే కథాంశం మత్స్యపురాణం పద్నాలుగో అధ్యాయంలో కనిపిస్తుంది. పితృదేవతలు ఏడుగణాలుగా ఉంటాయి. వీరిలో మూడు గణాలవారికి ఆకారం ఉండదు. వైరాజులు, అగ్నిష్వాత్తులు, బర్హిషదులు అనేవారికి ఇలా ఆకారం ఉండకపోవడం విశేషం. అలాగే సుఖాలినులు, హవిష్మంతులు, ఆజ్యపులు, సోమపులు అనే నాలుగు గణాలకు ఆకారం ఉంటుంది. ఈ ఏడుగణాలవారూ ప్రాణులందరిలో అమితమైన సామర్థ్యాన్ని, చైతన్యాన్ని కలిగిస్తుంటారు. అందుకే ఈ పితృదేవతలకు కావల్సిన శ్రాద్ధవిధులను నిర్వర్తించాలని అంటారు. మూర్తి (ఆకారం) లేని పితరులు వైరాజుడు అనే ప్రజాపతి కుమారులు. అందుకే వీరిని వైరాజులు అని అంటారు. ఈ పితృదేవతలు ద్యులోకంలో ఉంటారు. ఈ అమృతాలైన పితృగణాలవారు శాశ్వతాలైన లోకాలను పొందగోరి ఓసారి యోగసాధనకు ఉపక్రమించారు. అయితే ఏకాగ్రత లోపించి యోగం నుంచి భ్రష్ఠులయ్యారు. ఇలా భ్రష్ఠులైన కారణంగా వీరంతా పితృదేవతలుగా మారారు. ఈ పితృదేవతల మానసపుత్రికే మేన. ఈమె హిమవంతుడిని పెళ్లాడింది. హిమవంతుడికి మైనాకుడు అనే కుమారుడు జన్మించాడు. మైనాకుడికి క్రౌంచుడు జన్మించాడు. ఆ క్రౌంచుడి పేరుమీదనే క్రౌంచద్వీపం ఏర్పడింది. మేనా హిమవంతులకు ముగ్గురు కుమార్తెలు కూడా ఉన్నారు. ఉమ, ఏకపర్ణ, అపర్ణ అని ఆ ముగ్గురు కుమార్తెల పేర్లు. ఆ కన్యలు మంచి యోగసిద్ధి కలవారు. హిమవంతుడు ముగ్గురిలో పెద్దదైన ఉమను రుద్రుడికి, ఏకపర్ణను భృగువుకు, అపర్ణను జైగీషవ్యుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఇలా వైరాజ పితృదేవతల సంతతి వృద్ధి చెందింది. సోమపథాలు అనే లోకాలలో మరీచి అనే ప్రజాపతికి జన్మించిన పితృదేవతా గణాలు నివసిస్తుంటాయి. వీరిని దేవతలు కూడా ఆరాధించడం విశేషం. ఈ పితృదేవతలకు ఒక మానస పుత్రిక ఉంది. ఈమె పేరుమీదనే అనంతర కాలంలో అమావాస్య తిథి వచ్చింది. ఈమె జీవనకథనంలో నేటివారికి ఉపయుక్తమయ్యే ఓ సందేశం కూడా ఇమిడివుంది.
అగ్నిష్వాత్తుల మానసిక పుత్రిక పేరు అచ్చోద. ఆమె నదీరూపంగా ఉండేది. అచ్చోదను పితృదేవతలు ఒక సరస్సులో సృష్టించారు. ఓరోజున వారంతా కలిసి ఆమె దగ్గరకు వచ్చారు. ఏదైనా వరం కోరుకోమని తమ కూతురును అడిగారు. అయితే దివ్యపుష్పమాలికలు, దివ్యగంధాలు, మంచి అలంకారాలు చేసుకుని ఎంతో సుందరాకృతిలో ఉన్న మావసుడు అనే ఒక పితరుని చూసి అచ్చోద కామపరవశురాలైంది. ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి తండ్రి అయిన మావసుడినే కోరిన కారణంగా ఆమె అప్పటిదాకా సంపాదించిన యోగశక్తి అంతా నశించింది. దాంతో ఆమె తన దివ్యత్వాన్ని కోల్పోయింది. అసంబద్ధంగా ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి ప్రవర్తించినందువల్లనే ఆమెకు ఇంతటి నష్టం ప్రాప్తించింది. పితృదేవతలు అచ్చోద తమకు ఎంతో అభిమానపాత్రురాలైన మానసపుత్రికే అయినా ధర్మాన్ని అనుసరించి శిక్ష విధించడంలో... అంటే ఆమెకు దివ్యత్వం నశించాలని శపించడంలో వెనుకాడలేదు. మావసుడు మాత్రం అచ్చోదను కామించక ఇంద్రియ నిగ్రహంతోనే ప్రవర్తించాడు. అచ్చోద మావస్య కాలేదు. అంటే మావసుడికి ప్రియురాలు కాలేదు. అందుకే ఆమె అమావస్య అయింది. అమావస్య అంటే మావసుడికి ప్రియురాలు కానిది అనేది ఇక్కడి అర్ధం. అలా తదనంతర కాలంలో అచ్చోదకే అమావాస్య అనే పేరు ప్రాప్తించింది. ఈమె అంటే పితృదేవతలకు ఎంతో ప్రాణం. తమ మానస పుత్రిక మీద ఉండే మమకారంతో అచ్చోద అమావస్య (అమావాస్య తిథి) అయిన రోజున తమకు ఎవరైనా అర్పించిన శ్రాద్ధానికి అనంత ఫలితాన్ని ఆనాటి నుంచి పితృదేవతలు ఇస్తూ వచ్చారు.

రచన / డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు


ముఖ్యమైన కొన్ని అమావాస్యలు :

మహాలయ అమావాస్య" నాడు శ్రాద్ధ కర్మలు చేయండి:

  • ప్రతి మాసంలో వచ్చే అమావాస్య అన్నా, మహాలయ అమావాస్య అన్నా పితృదేవతలకు ఎంతో ఇష్టమని, ఆరోజునశ్రాద్ధ కర్మాదులను చేస్తే మంచి ఫలితం ఉంటుందని పెద్దలంటూ ఉంటారు. ఇందులో మహాలయము అంటే.. భాద్రపదబహుళ పాడ్యమి మొదలుకొని అమావాస్య వరకు ఉన్న 15 రోజులు. దీన్ని పితృపక్షంగా మహాలయంగా చెప్తారు. ఇందులో మరీ ముఖ్యమైన తిధి త్రయోదశి.

సోమవార అమావాస్య

సోమవారాల్లో వచ్చే అమావాస్యను సర్వ అమావాస్య, సోమవార అమావాస్యగా పిలుస్తారని పండితులు అంటున్నారు. సర్వ అమావాస్య రోజున గంగానది, తుంగభద్రవంటిపుణ్యతీర్థాల్లో స్నానమాచరించేవారికి కోటి జన్మల పుణ్యఫలంసిద్ధిస్తుందని పురాణాలుచెబుతున్నాయి.-అంతేగాకుండా.. తమిళనాడులోని ప్రముఖ శైవక్షేత్రంతిరువణ్ణామలై ఆలయాన్ని సోమవారం వచ్చే సర్వఅమావాస్యనాడు దర్శనం చేసుకునే వారికి అష్టైశ్వర్యాలుచేకూరుతాయని విశ్వాసం. తిరువణ్ణామలైఆలయంలోపౌర్ణమి రోజుల్లో గిరి ప్రదక్షిణ చేసే ఆనవాయితీ ఉంది. అయితే సర్వ అమావాస్య రోజునతిరువణ్ణామలైలో గిరిప్రదక్షిణచేసే వారికి వెయ్యిమార్లు గిరిప్రదక్షిణ చేసినంత ఫలితందక్కుతుందని పురోహితులుఅంటున్నారు. అమావాస్యరోజున పుణ్యతీర్థాల్లో స్నానమాచరించి, శివునికి నేతిదీపంవెలిగించే వారికి పుణ్యఫలం సిద్ధిస్తుంది. అలాగే పితృదేవతలను తృప్తిపరచేందుకు అర్ఘ్యమివ్వడం ద్వారా వారి ఆశీస్సులను పొందవచ్చునని పండితులు అంటున్నారు.


దీపావళి అమావాస్య :

  • రావణసురునితో జరిపిన యుద్ధంలో విజయం పొందిన శ్రీరామచంద్రుడు సతీసమేతంగా అయోధ్యకు విచ్చేస్తాడు. ఆరోజు అమావాస్య... అయోధ్య అంతా చీకట్లతో నిండి ఉంటుంది. దాంతో శ్రీరామునికి స్వాగతం పలికేందుకుఅయోధ్యావాసులు దీపాలను వెలిగించి అమావాస్య చీకట్లను పారద్రోలుతారు. ఆనాటి నుంచి దీపావళి పండుగనుమనం జరుపుకుంటున్నాం.

  • ఇక రెండవ కథగా నరకాసుర సంహారాన్ని చెప్పుకుందాం. ప్రాద్యోషపురానికి రాజు నరకాసురుడు. బ్రహ్మదేవుని నుంచిపొందిన వరగర్వంతో నరకాసురుడు దేవతలను, మహర్షులను నానా ఇబ్బందులు పెడుతుంటాడు. నరకాసురునిఆగడాలు శృతిమించడంతో సత్యభామ సమేతుడైన శ్రీకృష్ణుడు నరకాసురుని సంహరిస్తాడు. నరకాసురుని పీడవిరగడవ్వడంతో ప్రజలు దీపాలు వెలిగించి పండుగను జరుపుకున్నారు. పరంపర నేటికీ కొనసాగుతున్నది.

  • మూడవ కథగా పాల సముద్రం నుంచి శ్రీమహాలక్ష్మిదేవి ఉద్భవించిన వృత్తాంతాన్ని తెలుసుకుందాం. మరణాన్ని దరిచేర్చని అమృతం కోసం దేవదానవులు పాల సముద్రాన్ని చిలుకుతుండగా రోజు లక్ష్మిదేవి ఉద్భవించింది. సకలఅష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవికి దీపావళి నాటి సాయంత్రం హిందువులు ప్రత్యేక పూజలు చేస్తారు.

  • నాలుగవ కథగా... భారతంలోని ఇతివృత్తాన్ని చెప్పుకుందాం. కౌరవులు సాగించిన మాయాజూదంలో ఓడిన పాండవులుపదమూడేళ్ళు వనవాసం, ఒక సంవత్సర కాలం అజ్ఞాత వాసం సాగించి తమ రాజ్యానికి తిరిగి వస్తారు. సందర్భంగాప్రజలు దీపాలు వెలిగించి వారికి స్వాగతం పలుకుతారు.

  • ఇక చివరిదైన ఐదవ వృత్తాంతంగా మన రైతుల గురించి తెలుసుకుందాం. గ్రామీణ ప్రాంతాలలో పంట చేతికి వచ్చేసందర్భాన్ని పురస్కరించుకుని అన్నదాతలు దీపావళి పండుగను చేసుకుంటారు. మంచి పంట దిగుబడినిఅందించినందుకు ఇష్టదైవానికి కృతజ్ఞతగా ప్రత్యేక పూజలు చేసి పండుగ జరుపుకుంటారు.


పోలాల అమావాస్య


  • ముత్తైదువలు అత్యంత భక్తిశ్రద్దల పోలాల అమావాస్యను ఘనంగా జరుపుకొంటారు. ఐదోతనం, సంతానప్రాప్తి, సౌభాగ్యం, కడుపు చలువ కోసం మహిళలు ప్రతిఏటా శ్రావణమాస ఆఖరి రోజు అమావస్య రోజున పోలాలఅమావస్యనుజరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. పార్వతీదేవి ప్రతిరూపమైన పోలేరమ్మ కంద మొక్కపైఉంటారని ఆచల్లనితల్లి ఆశీస్సుల కోసం ఈరోజున కందమొక్కను పూజిస్తారు. శ్రావణమాసం ఆఖరి రోజు అమావస్యరోజున మహిళలువేకువఝామునే లేచిఅభ్యంగన స్నానాలు ఆచరించితమ పెరట్లో ఉన్న కందమొక్కను పవిత్రంగాతెచ్చి పసుపు, కున్కుమలతో పూజలు చేస్తారు. పిల్లలు లేనివారు పిల్లలు కలగాలని, పిల్లలు ఉన్నవారు కడుపుచలవ కోసం పూజలు చేస్తారు. పోలాల అమావస్య కధను చదువుకుని అక్షంతలు జల్లుకుంటారు. అమ్మవారికివాశినపోలు, పొట్టెంకల బుట్టలుతో పాటు తొమ్మిది రకాల కాయగూరలతో వండిన కలాగాయపులుసును అన్నంతోకలిపి నైవేద్యంగా పెడతారు. చలువ కోసం రజకులకు నైవేద్యాన్ని వాయనంగా అందచేస్తారు. ముత్తైదువలుఅత్యంత పవిత్రంగా పోలాల అమావస్యను భావిస్తారు. చల్లని తల్లి, కోరిన కోర్కెలు నెరవేర్చే కల్పవల్లి, ఐశ్వర్యప్రదాయిని అయిన పార్వతీదేవికి ప్రతిరూపమైన పోలేరమ్మ తమ వెన్నంటి ఉంటూ ఐదోతనాన్ని, సంతానప్రాప్తిని, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుతూ నోము నోచుకుంటారు . పూజించిన మొక్కకు నైవేద్యాలు సమర్పించిన అనంతరం తిరిగి తమ ఇంటి పెరట్లో నాటారు.

చుక్కల అమావాస్య :

శ్రావణ మాసం అమావాస్య రోజు నుండి మొదలు అగును. ఆ అమావస్యనే చుక్కల అమావాస్య అని
కూదా అందురు. కొంతమంది స్త్రీలకు చుక్కల అమావాస్య నోమును నోచుకుంటారు. ఈ వ్రతం ఐదు ఏళ్ళు చేసుకుంటారు. దీనికి దీపస్తంభ వ్రతము అని కూడా పేరు ఉంది.

నాగోబా జాగోరే!--పుష్యమాసంలో వచ్చే అమావాస్యరోజు

ఆ రోజు అమావాస్యరోజు. లోకమంతా చిమ్మచీకట్లు కమ్ముకునేరోజు. అయితే అదిలాబాద్‌ గిరిజనులకు మాత్రం అది పులకరించే రోజు. ఆనందం పండు వెన్నెలై వీరి గుండెల్లో వెల్లివిరిసే రోజు. ప్రతి ఏడాది అంబరాన్నంటే సంబరం రోజు. అదే నాగోబా జాతర రోజు.
ప్రతి సంవత్సరం పుష్యమాసంలో వచ్చే అమావాస్యరోజు అదిలాబాద్‌ గిరిజనులు నాగోబా జాతర జరుపుకుంటారు. ఈ అమావాస్యకు రెండు వారాల ముందు నుంచే గిరిజనుల్లో సంబరం మొదలవుతుంది. సరిగ్గా ఈ అమావాస్యరోజు తమ ఆరాధ్య దైవమైన 'నాగోబా' (శేష నారాయణ మూర్తి) పురివిప్పి నాట్యమాడతాడని ఇక్కడి గిరిజనుల నమ్మకం. అమావాస్యనాడు సరిగ్గా సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 12 గంటల మధ్యకాలంలో గిరిజన పూజారులకు తమ ఆరాధ్య దైవం ఆదిశేషువు కన్పిస్తాడని, వారందించే పాలు తాగి ఆశీర్వదించి అదృశ్యమవుతాడని ఇక్కడి గిరిజనులు నమ్ముతారు. అందుకే ఆదిలాబాద్‌ జిల్లా గిరిజనులే కాకుండా సరిహద్దు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి కూడా గిరిజనులు నాగోబా దేవాలయానికి వచ్చి ఆ రోజు సంబరం చేసుకుంటారు. నాగోబా జాతర ఇక్కడి గిరిజనుల సంస్కృతికి నిలువటద్దంగా చెప్పుకోవచ్చు. గిరిజనులకు ఇంతటి ఆరాధ్యమైన 'నాగోబా' దేవాలయం ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌ గ్రామంలో ఉంది. ప్రతి సంవత్సరం పుష్యమాస అమావాస్య పర్వదినాన గిరిజనులంతా తమ ఆరాధ్య దైవాన్ని సందర్శించటానికి ఈ గ్రామానికి కదిలిరావడం వల్ల ఇది ప్రముఖ జాతర స్థలంగా మారింది. అమావాస్య రోజు ఉదయం అయిదు గంటల నుంచి ప్రారంభమయ్యే పూజా కార్యక్రమాలు నాలుగు రోజులపాటు ఘనంగా జరుగుతాయి.

మనరాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి లక్షలాదిమంది గిరిజనులు ఈ స్థలానికి చేరుకోవడం వల్ల ప్రభుత్వం ఈ జాతర సందర్భంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. ప్రతి సంవత్పరం అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు గిరిజనుల స్థితిగతులను అవగాహన చేసుకోవటానికి, సమస్యలను తెలుసుకోవటానికి ఈ జాతరకు తరలిస్తారు. రెవిన్యూ,
వ్యవసాయం, పౌర సంబంధాల, భూసౌర పరిరక్షణ, పశుసంవర్ధక, గిరిజనాభివృద్ధి సంస్థ, పట్టు పరిశ్రమలు, స్త్రీ శుశు సంక్షేమం, అటవీశాఖ, వన్యప్రాణి విభాగం వంటి అనేక ఇతర శాఖల ప్రదర్శనలు, గిరిజనుల అభివృద్ధి, ఛాయాచిత్ర ప్రదర్శనలతో జాతర అద్భుతంగా కనిపించేలా జిల్లా యంత్రాంగమంతా కెస్లాపూర్‌లో రూపుదిద్దుకుంటుంది. వందలాది సంవత్సరాల చరిత్ర వున్న నాగోబా జాతర వివరాలను వారి ఆచార వ్యవహారాలను పరిశీలిస్తే బహు విచిత్రంగా నమ్మశక్యం కాని విధంగా ఉంటాయి. కాని ఈ జాతర సందర్భంగా వారి ఆచారాలు నియమాలను చూస్తే వారంటున్నది నిజమన్న భావన కలుగుతుంది.

కొన్ని వందల సంవత్సరాల క్రితం గిరిజనుల మూల పురుషులు కేవలం ఏడుగురు. మూల పురుషులు నాలుగు శాఖలుగా విడిపోయి ఈ నాలుగు శాఖలలోని మొదటి శాఖలో మడావి, మర్సకోలా, కుడ్మేల్‌, వూరు, పెందూర్‌, నెడ్మ, మెస్రిం అనే ఏడుగురు సోదరులుండేవారు. ఈ ఏడుగురి వల్ల కాలానుగుణంగా అభివృద్ధి చెందిన గిరిజన సంతతికి పై ఏడుగురు అన్నదమ్ముల పేర్లు ఇంటి పేర్లుగా మారాయి. ఏడు ఇళ్ళ పేర్లుగల గిరిజనులకు ఆరాధ్యదైవం ఆదిశేషుడు కావడం వల్ల అనాదిగా కేస్లాపూర్‌ గ్రామంలో వెలసిన వారి కులదైవం శ్రీ 'నాగోబా' పూజా ఇత్యాది కార్యక్రమాల నిర్వహణా బాధ్యత మెస్రీంకు అప్పగించారు. కాగా పెద్దవాడన్న గౌరవంతో పుష్యమాస అమావాస్య రోజు జరిగే పూజను మడానికి అప్పగించారు. అయితే కాలానుగుణంగా పూజా కార్యక్రమాలు నిర్వహించే 'మెస్రం' వంశం రెండుగా చీలిపోయింది. వాటిలో ఒకటి నాగ్‌భిడే మెస్రం. రెండవది భూయ్యాడే మెస్రిం. ఈ రెండు శాఖలవారు నాగోబానే ఆరాధ్యదైవంగా భావించిన రెండవశాఖ వారికి పూజా బాధ్యతలు అప్పగించారు. రానురాను ఈ శాఖవారి వృత్తుల ఆధారంగా 17 శాఖలుగా చీలిపోయింది. అయినా పూజలు నిర్వహించేది అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం మెస్రిం వంశస్తులకే దక్కింది.

పూజా విధానం

ప్రతి సంవత్సరం నాగోబా దేవతను పూజించడానికి నెలముందు నుంచే గిరిజనుల పడే శ్రమ నాస్తికులకు చాదస్తం అనిపించినా ఆస్తికులకు ఆశ్చర్యం కలిగిస్తుంది. వివిధ వృత్తుల ఆధారంగా 17శాఖలుగా చీలిన మెస్రం వంశస్తులలోని కటోడా దివాకర్‌ గాయికి, ఘాడియా సంకేపాయిలర్‌ వాడే శాఖలవారు కేస్లాపూర్‌ జాతరకు 16 రోజుల ముందు పుష్యమాస పౌర్ణమికి ఒకరోజు ముందు తమ కులదైవాన్ని పుష్య అమావాస్య రోజున అభిషేకించడానికి పవిత్ర గోదావరి జలం తేవటానికి కాలినడకన బయలుదేరి వెళతారు. ఇదే వంశంలోని మిగతా శాఖల వారు వారి వెంట వెడితే వెళతారు. ఒకవేళ అత్యవసర పనులుంటే వెళ్ళకపోవచ్చు. కాని మిగతా ఏడు శాఖల వారు క్రమం తప్పకుండా వెళ్ళాలన్నది నియమం. పై 7 శాఖలు ముందుగా నాగోబా ఆలయం చేరి కలశం తీసుకుని గోదావరి నదికి బయలుదేరుతారు. వారికి ముందుగా వరధాన తెగ, వాయద్య గాండ్రు వాయిస్తూ ఉంటే వెనుక నుండి గిరిజనులు వెడుతుంటారు. కేస్లాపూర్‌కు సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న జన్నారం మండలం కలమడుకు వరకు అతి భయంకరంగా అరణ్యం గుండా నడిచి వెళ్ళి గోదావరి జలం కలశం ద్వారా తీసుకుంటారు. ఈ అస్తమడుగులో గిరిజనుల పూర్వులు స్నానం చేస్తుండగా నాగదేవ ప్రత్యక్షమై దర్శనమిచ్చాడనే నమ్మకంతో అక్కడి జలాన్ని పవిత్రంగా గిరిజనులు భావిస్తుంటారు.
జలంతో నిండిన కలశాన్ని 40 కిలోమీటర్ల దూరంలోని 'పూసినగూడ' గ్రామానికి లేదా ప్రధాన పూజారి ఉండే నార్నూరు మండలం గుంజాల గ్రామానికి తెచ్చి అక్కడ ఒకరోజు ఉన్న తరువాత కలశం అదే గ్రామంలో ఉంచి గిరిజనులంతా తమ ఇండ్ల కు తరలివెళ్ళి ఒక దినమంతా పండుగ జరిపి తిరిగి కలశం ఉన్న స్థలానికి వెడతారు. ఇక్కడి నుంచి బయలుదేరిన తరువాత కేస్లాపూర్‌కు 8కి.మీ. దూరంలోని ఇంద్రవెల్లిలో ఆగి అక్కడ వెలసిన ఇంద్రాదేవిని సామూహికంగా పూజలు జరుపుతారు. ఇంద్రాదేవి వెలసిన నాటి నుంచి ఈ గ్రామానికి ఇంద్రవెళ్ళి పేరు వచ్చిందని గిరిజనులు భావిస్తుంటారు. ఇక్కడి నుంచి బయలుదేరి కేస్లాపూర్‌ చేరి ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న మర్రిచెట్టు కింద 4 రాత్రులు, ఒక పాకలో 3 రాత్రులు సామూహిక పూజలు జరిపి కేస్లాపూర్‌ మందిరానికి వాయిద్యాలతో ఊరేగిస్తూ తెచ్చి ఆలయం వద్ద ఉన్న మర్రిచెట్టుపై పవిత్ర జలకలశం భద్రపరిచి 10కి.మీ. దూరంలోని సిరికొండ (ఇది పూర్వం గిరిజనుల రాజధాని) చేరుకుంటారు. సరిగ్గా పుష్య అమావాస్య రోజున కలశం భద్రపరిచిన మర్రిచెట్టు దగ్గర బావినీరు మట్టి కలిపి పుట్టను తయారు చేసి ఆలయం ప్రక్కన ఉన్న పూజామందిరం ఈ మట్టితో అలికి అమావాస్య అర్థరాత్రి కలశంలో ఉన్న జలంతో ఆలయంలో ఉన్న నాగ దేవతను అభిషేకిస్తారు. మెస్రిం వంశస్తులు దేశంలో ఏ మారుమూల ఉన్నా తప్పనిసరిగా హాజరై నాగదేవతను పూజిస్తుంటారు.

సన్నగిల్లిన 'దర్బార్‌' ప్రాభవం

జాతర సందర్భంగా కేస్లాపూర్‌లో నిర్వహించే గిరిజన దర్బార్‌కు ఒక ప్రత్యేకత ఉంది. జాతరకు జిల్లాకు చెందిన గిరిజనులందరూ పెద్ద ఎత్తున హాజరు కావడంతో సుమారు 1942 ప్రాంతంలో ఇక్కడికి అధికార యంత్రాంగాన్ని రప్పించి గిరిజనుల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే ఏర్పాటును ప్రొఫెసర్‌ హేమండార్ఫ్‌ ఏర్పాటు చేయడం వల్ల ఈ దర్బారును అప్పటినుంచి యథావిధిగా కొనసాగించడం జరుగుతోంది. ఈ దర్బారుకు జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎస్‌.పి.లతోపాటు, ఐ.టి.డి.ఎ ప్రాజెక్టు అధికారి ఇతర అధికార యంత్రాంగం హాజరై గిరిజనుల సమస్యలను పరిష్కరించడం జరుగుతోంది. రానురాను ఈ దర్బారు నిర్వహణ లాంఛనంగానే కొనసాగుతుంది తప్ప తమ సమస్యను పరిష్కరించడం లేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఒకప్రక్క విమర్శలు వస్తున్నా అధికారుల్లో ఏమాత్రం స్పందన కలగడం లేదు. దర్బారుపై గిరిజనులకున్న నమ్మకాలు సన్నగిల్లుతున్నాయి. దర్బారుకు పూర్వపు వైభవం సమకూర్చటానికి అధికారం ఘణం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది.

Sunday, October 11, 2009

ఏకాదశి , Ekadashi


  • వైకుంఠం లో శ్రీ లక్ష్మీ తో మహావిష్ణు -----------------------------విఘ్నేశ్వరుని తో పార్వతీ పరమేశ్వరులు
******************************************************************************************************************************************************

* ఏడాది పొడుగునా నెలకి రెండు పక్షాలు 1.శుక్ల పక్షము ,2. కృష్ణ పక్షము ... పక్షానికొక ఏకాదశి చొప్పున్న ..ఇరవైనాలుగు ఏకాదషులుంటాయి . ప్రతి నెలా ఆమావాసి కి , పౌర్ణమికి ముందు ఈ ఏకాదశులోస్తుంటాయి .

* ప్రతినెలలో పూర్ణిమకి ముందు వచ్చే ఏకాదశిని "శుద్ధేకాదశి(శుద్ధ ఏకాదశి)" అంటారు. సంవత్సరం మొత్తంలోఇటువంటిశుద్ధ ఏకాదశులు 12 వుంటాయి.
ప్రతి నేలా అమావాస్య కి ముందు వచ్చే ఏకాదశి ని " బహుళ ఏకాదశి " సంవత్సరం మొత్తం లో ఇటు వంటి బహుళ ఏకాదషులు 12 ఉంటాయి .
  • మాసము/పక్షము/తిథి----- పర్వదినం
  • చైత్ర శుద్ధ ఏకాదశి---------- కామదైకాదశి
  • చైత్ర బహుళ ఏకాదశి ------ వరూధిన్యైకాదశి
  • వైశాఖ శుద్ధ ఏకాదశి--- ---- మోహిన్యైకాదశి
  • వైశాఖ బహుళ ఏకాదశి ---- అపరఏకాదశి
  • జేష్ఠ శుద్ధ ఏకాదశి --------- నిర్జలైకాదశి
  • జేష్ఠ బహుళ ఏకాదశి------- యోగిన్యైకాదశి
  • ఆషాఢ శుద్ధ ఏకాదశి ------ తొలిఏకాదశి, శయనైకాదశి
  • ఆషాఢ బహుళ ఏకాదశి- -- కామ్యైకాదశి
  • శ్రావణ శుద్ధ ఏకాదశి---- -- పుత్రఏకాదశి
  • శ్రావణ బహుళ ఏకాదశి ---- అజైకాదశి
  • భాద్రపద శుద్ధ ఏకాదశి---- -పరివర్తన్యైకాదశి
  • భాద్రపద బహుళ ఏకాదశి-- ఇంద్రఏకాదశి
  • ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి- - మహాజ్జయేకాదశి
  • ఆశ్వయుజ బహుళ ఏకాదశి- రమైకాదశి
  • కార్తీక శుద్ధ ఏకాదశి --------- ఉత్థానైకాదశి, బోధనైకాదశి
  • కార్తీక బహుళ ఏకాదశి------ ఉత్పత్యైకాదశి
  • మార్గశిర శుద్ధ ఏకాదశి ------ ధృవైకాదశి, ఉత్తమైకాదశి
  • మార్గశిర బహుళ ఏకాదశి---- సఫలైకాదశి
  • పుష్య శుద్ధ ఏకాదశి --------- వైకుంఠఏకాదశి, మోక్షఏకాదశి
  • పుష్య బహుళ ఏకాదశి----- తిలైకాదశి
  • మాఘ శుద్ధ ఏకాదశి------- భీష్మఏకాదశి, జయైకాదశి
  • మాఘ బహుళ ఏకాదశి---- విజయైకాదశి
  • ఫాల్గుణ శుద్ధ ఏకాదశి------ అమలవైకాదశి
  • ఫాల్గుణ బహుళ ఏకాదశి--- పాపవిమోచననైకాదశి