అన్ని మతము లలోను దేవుడు , దేవుని ఆరాధన ఉన్నది ... సంప్రదాయాలు , కొలిచే విధానాలు వేరువేరు గా ఉన్నాయి కాని మూలము , అర్ధము , పరమార్ధము , ఒక్కటే ...దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు . అది ఒక నమ్మకము మాత్రమే . పూర్వము ఆదిమానవుడు ప్రకృతి లో ఉండే భీబత్సవాలు ... ఉరుములు , మెరుపులు , గాలివానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండా, వాన లన నుండి భయపడి అప్రయత్నముగా " అమ్మో , నాన్నో " అని అరిచేవాడు ... చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు .. ఆ ధైర్యం తోనే జీవము గడిపేవాడు , రక్షణ కోసము ఏ చెట్టునో ,రాయినో , పుట్టనో ఆశ్రయించేవాడు ... తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు . పూజించేవాడు . ఆమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు . దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు , ఆత్యాద్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది . నమ్మకమే జీవిత నావకు దిక్చూచి . ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనషులు ... మనిషి మనిషి కి తేడా , మనసు మనషు కి తేడా ఉంటుంది . మనసు + శరీరము కలిస్తేనే మానవ జీవి . (psycho + soma ) ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి . పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?. అవి ఎలా ఉద్భవించాయి ? అస్సలు ఎందుకు ఉద్భవించాయి అనేది ఎవరికీ తెలియదు . ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది ... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతము గాను , అంతర్గతం గా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు .... ఎందుకంటే తానూ బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున. ఇక్కడ మనము -- పది ప్రముఖ చర్చిలు-- గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకుందాం . --
భారతదేశంలో సుమారు రెండువేల సంవత్సరాల నుంచి క్రైస్తవమతం వ్యాప్తిలో ఉంది. క్రీస్తు శిష్యులలో ఒకరైన సెయింట్ థామస్ ఒకటో శతాబ్దంలోనే భారత్కు వచ్చి క్రైస్తవ మత ప్రచారం చేశారు. అనంతరం దేశం పశ్చిమతీరంలో ముఖ్యంగా కేరళ, గోవాల్లో క్రైస్తవాన్ని అనేకమంది స్వీకరించారు. 15, 16 శతాబ్దాల్లో ఐరోపానుంచి క్రైస్తవ మిషనరీల రాకతో క్రైస్తవమతం దేశంలోని అన్ని మారుమూల ప్రాంతాలకూ విస్తరించింది. ఆంధ్రప్రదేశ్, కేరళ, గోవా, తమిళనాడు, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మిజోరం... తదితర రాష్ట్రాల్లో క్రైస్తవ మతస్తులు అధికసంఖ్యలో ఉన్నారు.
క్రైస్తవంలో క్యాథలిక్, ప్రొటెస్టెంట్ అని ప్రధానంగా రెండు శాఖలున్నాయి. క్రమేణా క్రైస్తవం ఆచరించే ప్రజల సంఖ్య పెరగడంతో వారి ప్రార్థనల కోసం దేశంలోని వివిధప్రాంతాల్లో క్రైస్తవులు చర్చిలను నిర్మించారు. వాస్తుపరంగానే కాకుండా అద్భుతమైన కళారీతులతో పాటు స్థానిక నిర్మాణ సంప్రదాయపద్దతులను ఈ చర్చిల నిర్మాణంలో వినియోగించడం విశేషం.
ప్రముఖ చర్చిలు-శాంతి మందిరం... ప్రశాంతతకు నిలయం
1. మెదక్ కెథడ్రల్చర్చి...

2. బాసిలికా చర్చి

3. సెయింట్ ఫ్రాన్సిస్ చర్చి

4. వల్లర్పదం చర్చి

5. సెయింట్ థామస్ బాసిలికా- చెన్నై

6. మార్ థోమ చర్చి- మలబార్

7. సెయింట్ ఆండ్రూస్ చర్చి

8. సెయింట్ పాల్స్ కాథెడ్రల్

9. వైస్రాయ్ చర్చి

10. వేలాంకణి చర్చి (నాగపట్టణం)

- ========================
No comments:
Post a Comment