Tuesday, October 6, 2009

నైవేద్యము , Naivedyamu



  • ************************************************************************************



నైవేద్యం అనునది భుజించడానికి మునుపు దేవునికి ఆహారము సమర్పించు ప్రక్రియ. కావున దేవునికి ఆహారము సమర్పించు మునుపు, ఆ ఆహారము వండునప్పుడు దాని రుచి చూడటము నిషిద్ధము. ఆహారమును దేవుని మూర్తి ముందు ఉంచి పూజించడం జరుగుతుంది. ఆ పై దానిని పుణ్యఫలంగా ఆరగించవచ్చు.

ఈ పదము సంస్కృతం నుండి వచ్చింది. నైవేద్యము అంటే సరైన అర్థము దేవునికి సమర్పణ అని - ఈ సమర్పణ ఆహారపదార్థమే కానవసరము లేదు. ఈ సమర్పణ భౌతిక వస్తు సంబంధమే అవ్వవలసిన అవసరము లేదు. ఒక మొక్కు, ప్రతిజ్ఞ, ఏదైనా చేయవలను లేక చేయరాదు అన్న నిశ్చితాభిప్రాయము మున్నగునవన్నీ కూడా నైవేద్యముగా భావించవచ్చు. అయితే నైవేద్యానికి, ప్రసాదానికి ఉన్న తేడా తెలుసుకోవడం అవసరం. వాడుకలో రెండూ సమానార్థంలో ఉపయోగించినప్పటికీ, ప్రసాదమంటే దేవుని దగ్గర లభ్యమయ్యేదిగా అర్థం. సాధారణంగా తమ మనోవాంచలు నెరవేర్చుకోవడం దేవతలకు పూజ చేసి ప్రత్యేక రోజులలో ప్రసాదాలు సమర్పించడం జరుగుతుంది. ఇది సరియైన పద్ధతేనా?? కాదు. భగవంతుడు సర్వశక్తిమంతుడు. వాస్తవానికి అతడు భక్తుడి నుండి ఏమీ ఆశించడు. అతను మనఃస్పూర్థిగా ఇచ్చినదేదైనా సంతోషంగా స్వీకరిస్తాడు. అది ఫలమైనా, పుష్పమైనా ఏదైనా సరే. అది కూడా భక్తుని సంతృప్తి పరచడానికే తీసుకుంటాడు. కనుక తన సంతృప్తికై భక్తుడు తన ఇష్టదైవానికి తీపి వంటకమో, పుష్పమాలయో, ధూపదీపాలో లేక మరే ఇతరమైనవో సమర్పించుకుంటాడు . అంతే కాని ఏ దేవుడు నాకిది కావాలని అడగడు. ఇచ్చింది కాదనడు. దైవానికి నైవేద్యం సమర్పించడమంటే భగవంతుడికి పూర్ణంగా శరణు జొచ్చడమని భావం. దేవుడి పూజకు కావలసినవి సమర్పించిన తరువాత భక్తుడి ఆత్మవిశ్వాసం, దైవవిశ్వాసం పెరిగి తన ప్రార్ధనా లక్ష్యంపై మనసు
సంపుఉర్నంగా లగ్నం కాదు. ప్రసాదం అంటె దేవునికి లంచం ఇవ్వడం కాదు. భక్తుడు తనకోసమై తనదనుకుంటున్న సొత్తును కాస్త భగవంతుడికి అర్పించడం. అలాగే అది తనకు భగవానుడే ఇచ్చాడు అని భావించడం అనేది నైవేద్యం యొక్క ముఖ్య ఉద్ధేశ్యం.

ప్రమదలందరికీ పండుగ పిండివంటల సన్నాహాలకి స్వాగతం. అసలేనైవేద్యాలు తయారుచేసుకొవాలి. పూజకి అన్నీ సిధ్ధం చేసుకోవాలి. భక్తిగా పూజచేసుకోవాలి. అందుకని సులభంగా 9 రకాలు చెసుకునె విధానం. ప్రమదలందరూ చదివితరించుదురుగాక.

1.
పులగం. (ఇది అమ్మవారికి చాలా ప్రీతి). చేసుకోవడం అందరికి తెలుసనేఅనుకుంటున్నాను. నాలుగు పప్పుబద్దలు, బియ్యం, చిటికెడు పసుపు కలిపిచిన్నగిన్నెలో కుక్కర్ లొ పెట్టెయ్యడమే.
--------------------------------------


2.
పరవాన్నం.(ఇది కూడా అమ్మవారికి ఇష్టమైనదే). బియ్యంతో కాని, సేమ్యాతోకాని చేసుకోవచ్చు.
------------------------------------


3.
పులిహార. (ఇది అమ్మవారికే కాదు, చాలామందికీ ఇష్టమైనదే) . వివిధరకాలుగాచేసుకోవడం తెలుసుకదా.
-------------------------------------------------


4. దధ్ధోజనం.(గుళ్ళో కూడా ఈ ప్రసాదం పెడుతుంటారు). వండిన అన్నంలోపెరుగు, ఉప్పు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమిర కలుపుకుని, కాస్తఇంగువ, ఆవాలు, 2 మెంతిగింజలు, 2ఎండు మిరపకాయముక్కలు వేసి నేతిపోపుపెట్టుకోవడమే.
----------------------------------------------------



5. కేసరి. (అదే సత్యనారాయణస్వామివారి ప్రసాదం). 1కప్-బొంబాయిరవ్వ, 1కప్-పంచదార, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, కావలసినన్ని జీడిపప్పులు, కిస్ మిస్,సువాసనకు యాలకులపొడి.ముందుగా రవ్వలో పంచదార కలిపేసుకుని రెడీగా పెట్టుకోవాలి. (అలాగయితేప్రసాదం వుండలు కట్టకుండా వుంటుంది). తర్వాత స్టౌవ్ వెలిగించుకునిఅందులొ1టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని జీడిపప్పులు, కిస్ మిస్ లువేయించుకోవాలి. వేగాక 2కప్పుల నీరు పోసుకుని, మరిగాక కలిపి పెట్టుకున్నరవ్వ, పంచదార వేసి ఒక్క నిమిషం వుడకనివ్వాలి. అప్పుడందులో యేలకుల పొడివేసి, మిగిలిన నెయ్యివేసి కలిపేసుకుంటే కేసరి రెడీ. సగం నైవేద్యానికిఅట్టిపెట్టుకుని మిగిలిన సగంతో సొజ్జప్పాలు చేసుకొవాలి. ఒక్క దెబ్బకిరెండు ప్రసాదాలన్నమాట.
---------------------------------------------------------



6. సొజ్జప్పాలు. ( పల్చగా చెసుకుంటే కరకరలాడుతూ వుంటాయి). 1కప్ మైదాచపాతిపిండిలా కలుపుకున్నాక, అందులో 1 స్పూన్ ఆయిల్ వేసి కలుపుకోవాలి. అవిచిన్న వుండగా చేసి అరచేతిలొ తట్టుకుంటూ మధ్యలో కేసరి చిన్న వుండగా చేసిపెట్టి చిన్న పూరీలా చేతితోనే వత్తుకోవాలి. అవి ఆయిల్ లో వేయించుకోవాలి.(డీప్ ఫ్రై అన్నమాట).
-----------------------------------------------------------


7.గారెలు. (అమ్మవారికి చాలా ఇష్టమైన నైవేద్యం). ఇది చెయ్యడం అందరికీతెలుసుకదా. అవే మరికొన్ని ఎక్కువగా చెసుకుంటే మరో నైవెద్యం. అదే ఆపడలు (పెరుగుగారెలు)
------------------------------------------------------


8. ఆవడలు. (లేదా పెరుగు గారెలు). ఇవి చెయ్యడం అందరికీ తెలుసనేఅనుకుంటున్నాను.
----------------------------------------------------------------------------


9. మైసూరుబజ్జీ.- ఇది చెయ్యడం చాలా సులభం. 1కప్ మైదా, 1/4 కప్బియ్యంపిండి, 1కప్ పెరుగు, 1స్పూన్ పచ్చిమిరపకాయముక్కలు,1/4స్పూన్వంటసోడా, తగినంత ఉప్పు. అన్ని బాగా కలిపి చిన్న చిన్న వుండలుగా నూనెలోవేసి డీప్ ఫ్రై చెయ్యడమే.
-----------------------------------------------------

ఏమైనా సవరణలుంటే నిస్సంకోచంగా చెప్పండి

10. మహానైవేద్యం - దసరా ఉత్సవాలలో 7 వ రోజు అమ్మవారికి 108 తీపిపదార్దాములతోతయారుచేసిని మహానైవేద్యము ను సమర్పిస్తారు .
--------------------------------------------

11. చెక్కెర పొంగలి : ఆశ్వయుజ అష్టమి రోజున గౌరీమాతను ఆరాధించి చేక్కేరపొంగాలి , బెల్లం పాయసం గాని నైవేద్యం గా సమర్పిస్తారు .
-----------------------------------------------

మరికొన్ని నైవేద్యాలు

శ్రీ వేంకటేశ్వరస్వామికి

వడపప్పు, పానకము, నైవేద్యం పెట్టవలెను. తులసిమాల మెడలో ధరింపవలెను.
----------------------------------------------------

వినాయకునకు

బెల్లం, ఉండ్రాళ్ళు, జిల్లేడుకాయలు నైవేద్యం. శ్వేత (తెల్లని) అక్షతలతో పూజింపవలెను.
-------------------------------------------------------

ఆంజనేయస్వామికి

అప్పములు నైవేద్యం, తమలపాకులతోనూ గంగసింధూరంతోనూ పూజింపవలెను.
---------------------------------------------

సూర్యుడుకు

మొక్కపెసలు, క్షీరాన్నము నైవేద్యం
---------------------------------------------------------------------
శనీశ్వరుడు :
శనీస్వరునకు నేయి నైవేద్యము
-----------------------------------------------------------------------


లక్ష్మీదేవికి

క్షీరాన్నము, తీపిపండ్లు, నైవేద్యం, తామరపూవులతో పూజింపవలెను.
----------------------------------------------------------------

లలితాదేవికి

క్షీరాన్నము, మధురఫలాలు, పులిహోర, మిరియాలు కలిపిన పానకము, వడపప్పు, చలిమిడి, పానకము.
-------------------------------------------------------------------------------------------------
సత్యన్నారాయణస్వామికి

ఎర్ర గోధుమనూకతో, జీడిపప్పు, కిస్ మిస్, నెయ్యి కలిపి ప్రసాదము నైవేద్యం.
-------------------------------------------------------------------------------------------------
దుర్గాదేవికి

మినపగారెలు, అల్లం ముక్కలు, నైవేద్యం.
-------------------------------------------------------------------------------------------------
సంతోషీమాతకు

పులుపులేని పిండివంటలు, తీపిపదార్ధాలు.
-------------------------------------------------------------------------------------------------
శ్రీ షిర్డీ సాయిబాబాకు

పాలు, గోధుమరొట్టెలు , పాతిక బెల్లం నైవేద్యం ,
-------------------------------------------------------------------------------------------------
శ్రీకృష్ణునకు

అటుకులతోకూడిన తీపిపదార్ధాలు, వెన్న నైవేద్యం. తులసి దళములతో పూజించవలెను.
-------------------------------------------------------------------------------------------------
శివునకు
కొబ్బరికాయ, అరటిపండ్లు నైవేద్యంగా, మారేడు దళములు, నాగమల్లి పువ్వులతో అర్చన చేయాలి.
--------------------------------------------------------------------------------------------------
నైవేద్యము గా జంతువుల మాంసము ,సిగరెట్లు ,మద్యము (సారా):

సహజంగా ఆయా దేవాలయాల్లో భక్తులు భగంవతునికి కొబ్బరికాయలు, పూలు, పండ్లు ఇత్యాది వస్తువులను సమర్పించుకోవడాన్ని మనం చూస్తుంటాం. మద్యపానం, సిగరెట్లు ఓ ఆలయానికి సమర్పించడాన్ని మీరెక్కడైనా చూశారా...? దాదాపు చూసి వుండకపోవచ్చు.

ఇటుంవటి వస్తువులను ఓ ఆలయానికి సమర్పించడాన్ని మేము చూశాం. అందుకే ఈ వారం ఏదినిజం శీర్షికలో ఆ దేవాలయానికే మిమ్మల్ని తీసుకుని వెళ్లదలిచాం. బరోడాకు సమీపంలో వున్న మంజల్‌పూర్‌లో వున్న ఈ దేవాలయాన్ని జీవ మామా ఆలయమని పిలుస్తారు. జీవ మామకు మద్యం, సిగిరెట్లు సమర్పిస్తే కోరిన కోర్కెలు నెరవేరతాయని వినడంతో అక్కడికి చేరుకున్నాం.

గుజరాత్‌లో మద్యాన్ని నిషేధించినప్పటికీ భక్తులు మాత్రం తమ కోర్కెలు నెరవేర్చుకునేందుకు ఎలాగైనా మద్యాన్ని సాధించి దేవాలయానికి సమర్పించడం గమనార్హం. కేవలం మద్యం, సిగరెట్లే కాదు కొన్ని సార్లు జంతు బలులను కూడా ఇస్తుంటారు. ఈ సంప్రదాయాల వెనుక వున్న చరిత్ర అత్యంత ఆసక్తిని రేకిత్తించేదిగా వుంటుంది.
జీవా మామ కోర్కెలు తీరుస్తాడట...
తాము అనుకున్న కోర్కెలను జీవాకు విన్నవిస్తారు. కోరిన కోర్కెలు నెరవేరిన పిదప వారు జీవా మామకు మద్యం, సిగిరెట్లు సమర్పించుకుంటారు. అలా ఈ సంప్రదాయం అప్పటి నుంచి ఇలా కొనసాగుతూనే వుంది


స్థానికుడైన శ్రీ భరత్ భాయ్ సోలంకి ఆలయ చరిత్రను గురించి ఇలా చెప్పుకొచ్చాడు. కొన్నేళ్ల క్రితం, ఓ ప్రత్యేక ఉత్సవంకోసం ఆ ఊరి ప్రజలందరూ గ్రామాన్ని విడిచి వెళ్లారు. గ్రామస్తులెవరూ ఊర్లో లేకపోవడంతో దోపిడీ ముఠా ఒకటి ఊరును దోచుకునేందుకు ప్రవేశించింది.

అదే సమయంలో ఆ ఊరిలో నివశిస్తున్న తన సోదరిని చూసి వెళ్లేందుకు వచ్చిన జీవా అనే వ్యక్తి దొంగల ముఠాను అడ్డుకునే ప్రయత్నం చేయసాగాడు. ఇంతలో ఊరి జనం కూడా అతనికి తోడవడంతో అందరూ కలిసి దొంగలను పారదోలారు. అయితే ఈ సంఘటనలో జీవా తీవ్ర గాయాలపాలై మరణించాడు.

దీంతో... జీవా జ్ఞాపకార్థం, జీవా మామ ఆలయాన్ని నిర్మించారు అక్కడి ప్రజలు. అప్పటి నుంచి వారు తాము అనుకున్న కోర్కెలను జీవాకు విన్నవిస్తారు. కోరిన కోర్కెలు నెరవేరిన పిదప వారు జీవా మామకు మద్యం, సిగిరెట్లు సమర్పించుకుంటారు. అలా ఈ సంప్రదాయం అప్పటి నుంచి ఇలా కొనసాగుతూనే వుంది.

జీవా మామకు మద్యం, మాంసం అంటే ఎనలేని ప్రీతి వుండటం చేతనే తాము ఇవన్నీ సమర్పిస్తున్నామని భక్తులు చెపుతున్నారు. ప్రస్తుతం జంతు బలులను నిషేధించటంతో జంతువుల వెంట్రుకలను సమర్పిస్తున్నారు.

ప్రజల శ్రేయస్సుకోసం ప్రాణత్యాగం చేసిన ఓ మహామనిషి జ్ఞాపకార్థం ఓ కట్టడాన్ని నిర్మించడం అభినందించదగ్గ విషయమే. అయితే మద్యం, సిగరెట్లు వంటి వస్తువులను సమర్పించడం ఎంతవరకు సమంజసం?
=====================================================================
రాట్లాం పట్టణానికి 32 కిలోమీటర్ల దూరంలో 'కవాల్కా మాత' ఆలయం ఉంది. చాలా కాలంగా ఈ ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ ఆలయం విశేషం ఏమిటంటే, కవాల్కా మాత, కాళీ మాత, కాలభైరవుడి విగ్రహాలకు సారాను నైవేద్యంగా సమర్పిస్తుంటారు. గిన్నె నిండా సారాయిని పోసి ఇక్కడి దేవతలు, దేవుడి విగ్రహం పెదవుల వద్ద ఉంచితే చాలు గిన్నెడు సారా అమాంతంగా మాయమవుతుంది. పైగా ఇది భక్తుల సమక్షంలోనే జరుగుతుండటం మరీ విశేషం.

ఈ ఆలయ పూజారి పండిట్ అమృత్‌గిరి గోస్వామి మాట్లాడుతూ ఈ ఆలయం 300 సంవత్సరాలుగా ఉనికిలో ఉందని, ఇక్కడ ఉంచిన విగ్రహాలకు మహత్తు ఉందని చెప్పారు. ఇక్కడి విగ్రహాలు సారా తాగడం వాస్తవమేనని ధృవీకరించారు. సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు మహిమలు కలిగిన ఈ దేవతల వద్దకు వచ్చి తమ కోరికలు తీర్చమని వేడుకుంటూ ఉంటారు. కొడుకు పుట్టాలని కోరిన కోరిక తీరడంతో దేవతకు మొక్కు తీర్చుకోవాలని రమేష్ అనే భక్తుడు ఇక్కడికి వచ్చాడు. దేవతను సంతృప్తి పర్చడానికి మేకను తాను బలి ఇచ్చానని, తన బిడ్డ వెంట్రుకలను కూడా దేవతకు సమర్పించానని చెప్పాడు.

దేవతలకు సారా సమర్పించిన తర్వాత సీసాలో మిగిలిన సారాను ఇక్కడికి వచ్చిన భక్తులకు ప్రసాదంగా ఇస్తుంటారు. కోరికలు తీరిన భక్తులు మొక్కులు సమర్పించుకోవడానికి ఆలయానికి చెప్పులు లేకుండా వస్తుంటారు. కొందరు భక్తులు జంతువులను బలి ఇస్తుంటారు. మహాలయ అమావాస్య, నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అనేకమంది ప్రజలు ఈ ఆలయాన్ని సందర్శించి విగ్రహాలకు పూజలు చేస్తారు. కొందరు తమను ఆవహించిన దెయ్యాల పీడ వదిలించుకోవడానికి ఇక్కడికి వస్తుంటారు.

అయితే రాతి విగ్రహం ఎక్కడైనా సారాను తాగటం జరుగుతుందా.. లేదా ఇది ప్రజల విశ్వాసం మాత్రమేనా..!

No comments: