Saturday, October 3, 2009

చాతుర్మాస్య వ్రతం , chaaturmaasya vratam

సూర్య -------------------------- శ్రీహరి & లక్ష్మి ,---------------------శివ & పార్వతి

  • ************************************************************************************

చాతుర్మాస్య
వ్రతం ప్రాచీన కాలం నుండి హిందూదేశంలో మునీశ్వరులు పాటిస్తూ వస్తున్న వ్రతం. చాతుర్మాస్య వ్రతం అంటే నాలుగు నెలల కాలం అనుష్ఠించవలసిన వ్రతమని అర్ధం. కొందరు రెండు నెలల కాలమే ఈ వ్రతాన్ని పాటించి 'అర్థచాతుర్మాస్యం' అనే పేరుతో చేస్తున్నారు. ఈ వ్రతాచరణకు స్త్రీ,పురుష భేదం కానీ, జాతి భేదం కానీ లేదు. వితంతువులు, యోగినులు మున్నగువారెవరైనా చేయవచ్చును. ఇది హిందువులతో పాటు జైన , బౌద్ధ మతస్తలుండే సమాజములోను ఆచరణలో కనిపిస్తుంది . ఈ వ్రతము చేస్తే సంవస్తార కాలపు పాపాలు పోతాయని , చెయ్యని వారికి పాపాలన్నీ సంక్రమిస్తాయన్నది ఓ విశ్వాసం . ఈ వ్రతాన్ని ఆషాడ శుద్ధ ఏకాదశి నాడు గానీ , వీలుకాకపోతే కటక సంక్రాంతి , కాకపొతే ఆషాడ శుద్ధ పూర్ణిమ నుంచి విధిగా ఆచరించాలి అంటున్నాయి వ్రత గ్రంధాలు .

ఇంతగా ఈ వ్రతాన్ని గురించి మన ఋషులు ఎందుకు నొక్కి చెప్పారు ... అని క్షణం కాలం ఆలోచిస్తే ... అది ,వ్రతాచరణ చేసేవారి ఆరోగ్య పరిరక్షణ కోసమేనని భోదపడుతుంది . ఆషాడం నుంచి నాలుగు నెలలు వర్షాలు బాగా పడుతుంటాయి , నేల బురద మాయమవుతుంది .. ఇలాంటి తేమ వాతావరణం వ్యాధులను కలిగించే సూక్ష్మ క్రిముల వ్యాప్తికి అనువుగా ఉంటుంది . చాతుర్మాస్య వ్రతము లో పాటించే ఆహార , విహారాది నియమాల ద్వారా రోగాల బారిన పడకుండా జాగ్రత్తపడవచ్చు. ఈ chaaturmaasya vratam ఆచరించదమనేది ఇటీవల కాలం లో వచ్చినది కాదు ... యుగ యుగాలుగా ఆచరణలో ఉందని భవిష్య , స్కంద పురాణాలలోని కదనాల అవగతమవుతుంది . ఒకప్పుడు ఇప్పటిలాగా కాక నాలుగు నెలలుపాటు కొనసాగే ఋతువులు మూడే ఉండేవట . అనంతర కాలం లో రెండేసి నెలల పాటు ఉండే ఆరు ఋతువులు గా అవి మారాయి . తొలినాళ్ళ లో వర్ష , హేమంత , వసంత - అనే మూడు ఋతువులు మాత్రమె ఉండేవి . వర్ష రుతువుతోనే సంవత్సరము ఆరంభామవుతూ ఉండేది . ఈ కారణం వల్ల సంవత్సరానికి " వర్షం " అనే పేరు వచ్చింది . సంవతరానికి మూడు ఋతువులున్న ఆ కాలము లో ఒక్క ఋతువు ప్రారంభం లో ఒక్కో యజ్ఞం చేస్తుండేవారు . ఆషాడ పూర్ణిమ నుండి 'వరుణ ప్రఘాస యజ్ఞం' , కార్తీక పూర్ణిమ నుండి 'సాకమేద యజ్ఞం' , ఫాల్గుణ పూర్ణిమ నుండి 'వైశ్య దేవయజ్ఞము ' చేస్తుఉండేవారు . ఆ నాటి ఆషాడము లో చేసే యజ్ఞమే అనంతర కాలం నాటికి ' చాతుర్మాస్య vratam' గా మారి ఆచరణలోకి వచ్చిందని పెద్దలు చెబుతున్నారు . చాతుర్మాస్య vratam పాటించేవారు ఆహార నియమాలలో భాగం గా -- శ్రావణ మాసం లో "ఆకుకూరలను ", భాద్రపద మాసం లో "పెరుగును" ఆశ్వయుజ మాసం లో "పాలను " కార్తీక మాసం లో పప్పు పదార్దాలను విధిగా వాకిలి పెట్టాలి .. వాటిని ఆహారము గా ఏ మాత్రము స్వీకరించ కూడదు . పాత ఉసిరి కాయ పచ్చడి మాత్రం వాడవచ్చును . ఈ ఆహార నియమాలన్నీ .. వాత , పిత్త , శ్లేష్మ -సంబంధ రోగాలు నుంచి కాపాడు కోవటానికి బాగా ఉపకరిస్తాయి. ఇలా ఎటు చూసినా chaaturmaasya వ్రతదీక్ష అనేది - మానవాళి ఆరోగ్య పరిరక్షణకు ఉపకరించే ఉత్తమ వ్రత దీక్ష అని పురాణ వాజ్మయం వివరిస్తోంది .

ఏకభుక్త మధశ్శయ్యా బ్రహ్మచర్య మహింసనమ్
వ్రతవర్యా తపశ్చర్యా కృచ్చచాంద్రాయణాదికమ్
దేవపూజా మంత్రజపో దశైతే నియమాః స్మృతాః

వ్రత నియమాలు

  • * ఈ నాలుగు మాసాలు తాను నివసించే గ్రామం యొక్క ఎల్లలు దాటరాదు.
  • * ఈ కాలంలో అరుణోదయవేళ స్నానం చేయడం అవసరం.
  • * వ్రతకాలంలో బ్రహ్మచర్యం, ఒంటిపూట భోజనం, నేలపై నిద్రించడం, అహింస పాటించాలి.
  • * ఇష్టదేవతలకు చెందిన దివ్యమంత్రాన్ని అక్షరలక్షలుగా జపించాలి.
  • * ఏదైనా ఒక ఉపనిషత్తును పఠించాలి.
  • * భగవద్గీతలోని కొన్ని అధ్యాయాలను కంఠస్థం చేయాలి.
  • * యోగసాధన చేయడం శ్రేయస్కరం.
  • * దానధర్మాది కార్యాలు విశేష ఫలాన్నిస్తాయి.
వ్రత వృత్తాంతము :
చతుర్మాసాలు అంటే, ఆషాఢ శుక్ల ఏకాదశి నుంచి కార్తీక శుక్ల ఏకాదశి వరకు గల సమయం నాలుగు నెలలు. ఆషాఢ, శ్రావణ, భాద్రపద, ఆశ్వీయుజ మాసాల్లోని ఏకాదశులు ఎంతో పవిత్రమైనవి. ఇందులో మొదటిది దేవశయన ఏకాదశి. చివరిది దేవ ఉత్థాన ఏకాదశి. క్షీరసాగరంలో శ్రీ మహావిష్ణువు ఈ నాలుగు నెలలు శయనిస్తాడు. విష్ణువు శయనించే కాలంలో సాధకులు భూశయనం చేయటం, ఆకుకూరలు, వెల్లుల్లి, సొరకాయ, టమాట, ఆవనూనెల సేవనం మానివేయటం, నిరంతర జప, తప, హోమ, పురాణ కథా శ్రవణాల్లో కాలం గడపటం, రోజూ ఒకే పూట భోజనం చేయటం, ఏకాదశులలో పూర్తిగా ఉపవాస దీక్ష చేయటం వంటి దీక్షా ధర్మాలను పాటిస్తారు. పీఠాధిపతులు, దీక్షితులు ఒకే స్థానంలో నివసించటం, క్షురకర్మలు నిషేధించడం వంటి నియమాలు పాటిస్తారు. శ్రావణ, భాద్రపద మాసాలు గృహస్థుల నియమాలకు సరైనవని పద్మపురాణం తెలుపుతోంది. భాద్రపద కృష్ణ ఏకాదశిని అజా ఏకాదశి అంటారు. ఇది సమస్త పాపాలను తొలగిస్తుందంటారు. హరిశ్చంద్ర మహారాజు సత్యం, ధర్మం తప్పక తన భార్యకు దూరమై అనేక ఇక్కట్ల పాలైనప్పటికీ చాతుర్మాస్య వ్రతాన్ని మరువలేదని, చివరికి విజయం చేకూరిందని చెబుతారు. చాతుర్మాస్య దీక్షలో గోపద్మవ్రతం గురించి మూడు పురాణ గాథలు వాడుకలో ఉన్నాయి.

ఒకసారి కైలాసంలో శివునిచేతి మెత్తదనాన్ని చూసిన పార్వతి- చేయి మెత్తగా, మృదువుగా ఉండటానికి కారణం అడిగింది. పరోపకారం చేయడం వలన చేతులు మెత్తగా ఉంటాయని శివుడు చెప్పాడు. అందుకే 'ఎముక లేని చెయ్యి' అని దానం చేసేవారిని వర్ణిస్తారు. పార్వతికి పరోపకార సేవ చేయాలనే కోరిక కలిగింది. మారువేషంతో భూలోకానికి వెళ్లింది. నారేళ్ళనాచి అనే పేరు గల గర్భిణికి చేయూతనిచ్చి, సేవచేసి, 11 రోజుల తరవాత సకలైశ్వర్యాలు కలగజేసి, చాతుర్మాస్య గోపద్మ వ్రతాన్ని తెలిపి అంతర్ధానమైపోయింది. అయిదేళ్ళ తరవాత అమ్మకు నారేళ్ళనాచి పరిస్థితిని తెలుసుకోవాలనిపించింది. అప్పుడు నారేళ్ళనాచి గోపద్మవ్రత ఉద్యాపన చేసుకొంటోంది. పార్వతి ఓ ముసలమ్మ రూపంలో వెళ్ళి మంచి నీళ్ళడిగింది. నారేళ్ళనాచి కోపంతో ఆమెకు బయట తొట్టిలో నీరిమ్మని తనవారితో చెప్పింది. అవమానపడిన పార్వతి తిరిగి శివుని దగ్గరకు వెళ్ళి ఆమెకు ఐశ్వర్యం లేకుండా చేయాలని కోరింది. అది సాధ్యపడదన్నాడు శివుడు. విష్ణువూ తానేం చేయలేనన్నాడు. చివరికి నారదుడు వెళ్ళి నారేళ్ళనాచికి తెలిపాడు. తన అపరాధాన్ని గ్రహించిన భక్తురాలు వెంటనే పార్వతీ పరమేశ్వరులకు పాయసం, గణపతికి ఉండ్రాళ్ళు నైవేద్యం చేసి, క్షమించమని కోరింది. పార్వతీ పరమేశ్వరులు ఆమెకు సకలైశ్వర్యాలు అందజేశారు.

ఇదే విధంగా ఒక రాజు సంతానం లేని కారణంగా చెరువులు, బావులు తవ్వించడం, బాటలు వేయించడం, బాటల పక్క చెట్లు నాటించడం చేసి తన రెండో భార్యకు అయిదుగురు సంతానాన్ని పొంది, తన మొదటి భార్యలో గల ఈర్ష్య వల్ల రెండో భార్య గోపద్మ వ్రతానికి భంగం కలగకుండా చేశాడు. మరో కథలో యముడు గోపద్మ వ్రతం చేయనివారి వెన్నెముక చర్మాన్ని తెచ్చి జయభేరి మోగించాలని తన భటులను కోరాడట. తన చెల్లెలు ఈ వ్రతాన్ని చేయలేదని తెలిసిన శ్రీకృష్ణుడు వెంటనే సుభద్ర వద్దకు వెళ్ళి అయిదేళ్ళ వ్రతాన్ని ఒకేరోజు జరిపించాడట. దాంతో యమభటులకు జయభేరిని మోగించడానికి చర్మం లభించలేదట. తూర్పు దిక్కుకు తలపెట్టి పడుకొన్న ఓ జీవి వెన్నెముక చర్మాన్నైనా తెచ్చి జయభేరి మోగించాలన్నాడట యముడు. అప్పుడు ఓ దున్నపోతు అలా నిద్రిస్తుండటం చూసి దాని చర్మాన్ని తెచ్చి డోలు వాయించారని కథనం.

చాతుర్మాస్య గోపద్మ వ్రతంలో ముత్త్తెదువలు తొలి ఏకాదశి నుంచి ప్రతిరోజు కొన్ని చొప్పున 1100 వత్తులు, 11 వందల ముగ్గులు పెట్టుకుంటారు. అయిదేళ్ళు నోముకున్నాక కన్నెముత్త్తెదువకు పసుపు, కుంకుమ, గాజులు, బట్టలు, భోజనం, బియ్యం, నువ్వుపిండి పెట్టి నమస్కరిస్తారు. గణపతికి ఉండ్రాళ్ళు నివేదన చేస్తారు. దూర్వాలతో గౌరమ్మను పూజించి, తులసికోటవద్ద దీపం వెలిగిస్తారు. జామపండ్లు, సీతాఫలాలు, చెరకు, ఖర్జూర పండ్లు, కన్నె పిల్లలకు ఓడినింపి, గౌరమ్మకు నమస్కరిస్తారు. పరోపకారం, సేవాభావం, పరులను గౌరవించడం, చాతుర్మాస్య నియమాలు పాటించడం- మానవాళికి ఎంతో శుభం, ఆనందం చేకూరుస్తాయని అందరి నమ్మకం.

- డాక్టర్‌ మాడుగుల భాస్కరశర్మ

  • ==============================
Visit web-blog at -> Dr.Seshagirirao -MBBS

No comments: