Sunday, September 20, 2009

ముక్కోటి ఏకాదశి, Mukkoti Ekadashi




  • ఏడాది పొడుగునా నెలకి రెండు పక్షాలు 1.సుక్లాపక్షము ,2. కృష్ణ పక్షము ... పక్షానికొక ఏకాదశి చొప్పున్న ..ఇరవైనాలుగు ఏకాదషులుంటాయి . ప్రతి నెలా ఆమవాసి కి , పౌర్ణమికి ముందు ఏకాదశులోస్తుంటాయి . ఆషాడశుక్ల ఏకాదశిని ప్రధమ ఏకాదశి గా పరిగనిస్తారు .

  • * ప్రతినెలలో పూర్ణిమకి ముందు వచ్చే ఏకాదశిని "శుద్ధేకాదశి(శుద్ధ ఏకాదశి)" అంటారు. సంవత్సరం మొత్తంలోఇటువంటిశుద్ధ ఏకాదశులు 12 వుంటాయి.
    ప్రతి నేలా అమావాస్య కి ముందు వచ్చే ఏకాదశి ని " బహుళ ఏకాదశి " సంవత్సరం మొత్తం లో ఇటు వంటి బహుళ ఏకాదషులు 12 ఉంటాయి .
    . వీటిలో ప్రతి ఏకాదశికి ప్రాముఖ్యత వున్నా, నాలుగు ఏకాదశులనువిశేషదాయకంగా పరిగణిస్తాము. అవి:

1.ఆషాడ శుద్ధ ఏకాదశి.(తొలేకాదశి/శయనేకాదశి)
2. కార్తీక శుద్ధ ఏకాదశి
3. పుష్య శుద్ధ ఏకాదశి (వైకుంఠ ఏకాదశి/ముక్కోటి ఏకాదశి)
4.మాఘ శుద్ధ ఏకాదశి (భీష్మ ఏకాదశి)

  • వైకుంఠ ఏకాదశి/ ముక్కోటి ఏకాదశి

పుష్య శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేక ముక్కోటి ఏకాదశి అంటారు. ఒక చిన్న స్థలం ఉంటే తూర్పు దిక్కుగా నిలుచుంటే దానికి నిట్టనిలువుగా తూర్పు పశ్చిమాలు, అడ్డంగా ఉత్తర దక్షిణాలూ వుంటాయి. ఈ ఉత్త్తర దక్షిణ విభాగాన్ని ప్రాచీనులు కేవలం ప్రదేశాలకి మాత్రమే పరిమితం చేయకుండా కాలంలోనూ, శరీరంలోను కూడా ఈ విభాగాన్ని చేశారు.

కాలంలో ఉత్తరం పగలు; దక్షిణం రాత్రి
కుడి చేయి దక్షిణం; ఎడమ చేయి ఉత్తరం
ఎక్కడైనా (ఉత్తర - దక్షిణాలలో) ఉత్తరమే పవిత్రమైనది, శ్రేష్టమైనది.

దేవతలకు ఆరు నెలలు పగలు, ఆరు నెలలు రాత్రి. రాత్రిని దక్షిణాయనం, పగటిని ఉత్తరాయణం అన్నారు. దక్షిణాయనం వెళుతుండగా చీకటి తొలగి సూర్యుడు - అంటే వైకుంఠుడు, ముక్తుడుకాగా దేవతలు కూడా చీకటి పోయి వెలుతురుకు వస్తారన్నమాట. అనగా, వారి పగలు ప్రారంభమైందన్నమాట. ఈ వైకుంఠ ద్వారమన్నది సూర్యుని ఉత్తరాయణ ప్రవేశ చిహ్నముగా చెప్పుకుంటాము. ముక్కోటి దేవతలు ఈనాడు ఉత్తరమందున్న శ్రీ మహా విష్ణువును దర్శించుకుంటారు. అందుచే ప్రాతఃకాలంలో భక్తులుకూడా ముక్కోటి దేవతలతో కూడివున్న వైకుంఠుణ్ణి ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ముక్తి పొందాలని భావిస్తారు. అందుకే దీన్ని మోక్షేకాదశి అని కూడా అంటారు.

సూర్యుడు ఉత్తరాయణానికి మారేముందు వచ్చే ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచిఉంటారు. ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడుకోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడుకోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు.

మరిన్ని వివరాలకొరకు ఇక్కడ క్లిక్ చేయండి > ముక్కోటి ఏకాదశి

Friday, September 18, 2009

పోలేరమ్మ వ్రతము , Poleramma Vrathamu





భాద్రపద బహుళ అమావాస్య నాడు ఈ పండుగ/వ్రతము స్త్రీలు చేస్తారు . ఈ సం.ము 2009 సెప్టెంబర్ 18 న అమావాస్య .

శక్తి ఆరాధనలో సకలశక్తి స్వరూపిణి అయిన దేవిని పరబ్రహ్మము లేదా ఆదిపరాశక్తిగా అర్చిస్తారు. ఇక్కడ త్రిదేవి అనబడే దేవి స్వరూపచిత్రణ చూపబడింది. ఈమె సరస్వతి, లక్ష్మి, పార్వతిలు కలసిన పరమశక్తిగా కనిపిస్తుంది.


హిందూ ధర్మంలో శివుని సర్వశక్తిమంతునిగా ఎంచి ఆరాధించే వారు శైవులుగానూ విశ్ణువును సర్వశక్తిమంతునిగా ఎంచి ఆరాధించేవారిని వైష్ణవులుగానూ ఆదిశక్తిని త్రిమూర్తులకంటే శక్తిమంతురాలని ఎంచి ఆరాధించే వారు శాక్తేయులుగానూ పిలువబడుతారు. త్రిమూర్తులకు కూడా ఆది పరాశక్తి అని దేవీ భాగవతం వర్ణన. ఇలా ఆరాధించే మూర్తులు అనేకరూపాలలో ఉంటాయి.


ఈ శక్తిని శివుని భార్య పార్వతిదేవిలో ఉన్నాయని భావన. ఆ భావనల్తో అనేక రూపాలలో ఉన్న శక్తిని పార్వతీదేవిగా భావిస్తారు. ఆమె విష్ణువులా రాక్షస సంహారిణి. లోకకంటకులగు అనేక రాక్షసులను ఆమె వధించి లోకాలను రక్షించి ప్రజలకు ఆనందం కలిగించింది. ఊరి పొలిమేరలో కాపలా ఉండి ఊరి ప్రజలను దుష్ట శక్తుల నుండి కాపాడే దేవి పోలేరమ్మ, మసూచి లాంటి రోగాల బారిన పడకుండా కాపాడ టానికి రోగం వచ్చిన తరవాత రోగనివారణకు అమ్మను పూజిస్తారు. కొన్ని రోగాలకు అమ్మవారి పేరు పెట్టి ఇప్పటి వరకూ పురాతన పద్ధతుల ద్వారా రోగ నివారాణ చేసే ఆచారం దేశమంతా అనేకరూపాలలో కనిపిస్తుంది. ప్రతి ఊరికీ గ్రామానికి గ్రామదేవతలు ఉంటారు. ఇలా హిందూధర్మంలో శక్తి ఆరాధన అనేక రూపాలలో కనిపిస్తుంది.

గ్రామదేవతలలో ఒకరు గ్రామశక్తి పోలేరమ్మ. ఈమెను తెలంగాణాలో పోచమ్మగాను , కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పోలేరమ్మగాను జనులు పిలుస్తున్నారు.గ్రామ సరిహద్ధులను కాపాడే దేవత కనుక ఈమెను పొలిమేరమ్మగాను. పోలేరమ్మగాను పిలుస్తూ, కొలుస్తూ పూజిస్తున్నారు. గ్రామశక్తి పోలేరమ్మ ఆంధ్ర దేశంలో ఇలవేల్పుగాను, కులవేల్పుగాను, గ్రామవేల్పుగాను ఆరాధింపబడుతున్నది. జగతిని జాగృత్వం చేసి, ప్రగతికి మార్గం చూపేదే మహిళ. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలు, ప్రగతిశీల భావాలు వర్ధిల్లిన కాలం సింధూ నాగరికధ కాలం. ప్రపంచ నాగరికత దేశాలతో పోటీ పడి సాంకేతిక, వైజ్ఞానిక ప్రగతితోపాటు పట్టణ నాగరికతను విశిష్టంగా కలిగిందే సింధు నాగరికత. ఇది మాతృస్వామిక దేశం. మహిళ అన్న పథానికి ‘ మహిళా భూమి ’ అని చెప్పడం జరిగింది. మహిళ అనే పదము మహి మరియు ఇలా అనే రెండు పదాల కలయికతో ఏర్పడింది. మహీ అంటే స్ర్తీ అని, ఇలా అంటే భూమి అని వెరసి దా ల్యాండ్‌ ఆఫ్‌ ఉమెన్‌ అని స్పురింప చేస్తున్నది.
పోలేరమ్మ కధ :
శ్రీమత్ కైలాస పర్వతం మీద ఈశ్వరుడు , పార్వతి ... ప్రధమ గణములతో కూర్చున్న సమయమున పార్వతి శివునితో ఒక సంగతి అడిగెను .. " మహాత్మా తమరు సమస్త లోకములు పరిపాలించు కర్తలు , ఏకనిదానముతో ఉన్నా వారైనందున తమకు తెలియని అంశములు ఏమియు లేవు . కృత , త్రేతా, స్వపర , కలియుగములో చివరిదైన కలియుగములో స్త్రీలు మిక్కిలి పాపత్ములుగాను , సంతానలేమివరుగాను కాగలరు అని భవిస్య వాని చెప్పుతున్నందున పుణ్యము నిచ్చే ఒక వ్రతమును చెప్పుమని కోరగా .. ఈ పోలేరమ్మ వ్రతము ను చెప్పెనని అందురు."

మహాలయ అమావాస్య,Mahalaya Amavaasya, పిత్రుదేవతల పండుగ





ఈ సం.ము 2009 సెప్టెంబర్ 18 న మహాలయ అమావాస్య గా పరిగనిస్తారు .

"మహాలయ అమావాస్య" ఉత్తరాయణము దేవతల కాలము గనుక ఉత్తమ కాలమని పురోహితులు చెబుతున్నారు. అయితే దక్షిణాయణము పితృదేవతల కాలము గనుక అశుభకాలమని మన పూర్వీకుల విశ్వాసం.

ప్రతి మాసంలో వచ్చే అమావాస్య అన్నా, మహాలయ అమావాస్య అన్నా పితృదేవతలకు ఎంతో ఇష్టమని, ఆరోజున శ్రాద్ధ కర్మాదులను చేస్తే మంచి ఫలితం ఉంటుందని పెద్దలంటూ ఉంటారు. ఇందులో మహాలయము అంటే.. భాద్రపద బహుళ పాడ్యమి మొదలుకొని అమావాస్య వరకు ఉన్న 15 రోజులు. దీన్ని పితృపక్షంగా మహాలయంగా చెప్తారు. ఇందులో మరీ ముఖ్యమైన తిధి త్రయోదశి.

"యత్యించిన్మధునా మిశ్రం ప్రదద్యాత్తు త్రయోదశీమ్ |
తదప్య క్షయమేవస్యాత్ వర్షాసుచ మఘాసుచ" ||
అనగా వర్షఋతువు నందు భాద్రపద కృష్ణత్రయోదశి మాఘా నక్షత్రంలో కూడి ఉన్న సమయంలో ఏ పదార్థమైనా శ్రాద్ధం చేసిన అది పితృదేవతలకు అక్షయ తృప్తిని ఇస్తుందని విశ్వాసం.

అంతటి విశిష్టత గాంచిన ఈ మహాలయ పక్షమందు అందరూ వారి వారిశక్తిని తగినట్లుగా పితృదేవతలకు తర్పణమివ్వాలని పురోహితులు చెబుతున్నారు. కొందరు తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి ఆయాతిథులలో తర్పణ శ్రాద్ధ కర్మలు ఆచరించవచ్చును. ఒకవేళ గతించిన పెద్దల తిథి గుర్తులేనప్పుడు "మహాలయ అమావాస్య"నాడే పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు చేయడం ఉత్తమమని పురోహితులు అంటున్నారు.

కావున పితృకార్యములు చేయుటకు అర్హత పొందినవారు అంతా విధిగా పక్షాలను ఆచరించి, వారి వారి వంశవృక్షములకారకులైన పితృదేవతలను స్మరించుకుని శ్రాద్ధ కర్మలు చేస్తే వారి శుభాశీస్సులతో సర్వశుభములు పొందుతారని పండితులు పేర్కొంటున్నారు.

అమావాస్య తిది ... పితృదేవతలకు తృప్తి :

తొలిగా పితృ దేవతల ఆవిర్భావం ఎప్పుడు జరిగినది ? ఎవరి నుంచి జరిగినది ? ఆ పిత్రుదేవతకు అమావాసి తిదికి ఉన్నా సంభందం ఎలాంటిది ? అనే వివరించే కదా సందర్భం ను వరాహ పురాణం ముపైనలుగో అశ్యమం లో వివరించబడి ఉన్నది.
పూర్వము సృష్టి ప్రారంభములో ఈ జగత్తును సృస్తిచేందుకు బ్రహ్మ దేవుడు ధ్యానం లో కూర్చున్నాడు . . ఆయనలా యోగానిస్టలో ఉండగానే శరీరము నుండి కొన్ని దేవతా గణాలు ఆవిర్భవించాయి . ముందు గా పొగ రంగు కాంతుల తో కొన్ని గణాలు, ఆ తరువాత మరి కొన్ని గణాలు వచ్చాయి .పోగరగు తో ఉన్నవారు ఆవిర్హవించిన వెంటనే తామూ ఊర్ధ్వ లోకాలకు పోవాలని సోమరసము తాగాలని ముఖాలు పైకెత్తి నిలుచొని పలుకసాగారు . ఆ శబ్దాలను విన్న బ్రహ్మ ... ముందుగా అలా తల పైకిట్టి ఉన్నా వారిని చూసి మీరంతా పైకెత్తిన తలల to ఉన్నారు కనుక నాందీ ముఖులు అనే పేరున్న దేవతలు గా ఉండండి అని అన్నాడు . గృహస్తులంతా ఆ నాన్దీముఖులను పితృదేవతలు గా పూజిస్తారని చెప్పాడు . వృద్ధి పొందటం కోసం వేద మార్గం లో చేసే కార్యాలలో నాన్దీముఖులకు పుజలన్డుతాయన్నాడు . అలా పూజ లందు కొంటూ పూజలు చేసేవారిని సంరక్షిస్తూ ఉండమని పెరోకొన్నాడు బ్రహ్మ . అగ్నిహోత్రాన్ని అర్చించేవారు , నిత్య , నైమిత్తిక , కామ్య కర్మలను చేసేవారు , పర్వదినాలలో నాన్దీముఖులను తృప్తి పరచాలని ఆనాడు బ్రహ్మ ఒక కట్టడి చేశాడు . . ఆ తర్వాత అక్కడే ఉన్నా బహిహ్ప్రావారునులు అనే పితురులను బ్రహ్మదేవుడు చూసి వారిని క్షత్రియులు తృప్తి పరుస్తారని అన్నాడు . ఆ తర్వాత ఆజ్యపుల (నెయ్యి తాగడం ఇష్టము ఉన్న )గణాలను చూస్తూ వారిని వైశ్యులు తర్పణాలు ఇచ్చి తృప్తి పరుస్తారని అన్నాడు . వేద మంత్రాలు పూర్తిగా తెలుసుకోలేని వారు కుడా ఈ పితృదేవతలను అర్చించ వచ్చునని , మంత్ర విధానం లేకుండానే పండితుల సూచనల మేరకు ఈ దేవతలను కొలవవచ్చునని చెప్పాడు బ్రహ్మదేవుడు . పితృదేవతలు కేవలం పూజలందుకొని ఉరకనే కుర్చోకుడదని ... తమని అర్చించిన వారి కోర్కెలు తీర్చుతూ వారికి ఆయువు , కీర్తి ,దానం , పుత్రులు , విద్య , గొప్పతనం , జ్ఞానం లాంటివి ప్రసాదిస్తూ ఉండమని ఆజ్ఞాపించాడు . ఆ నాడు వారి కోసం దక్షిణాయనం అనే స్థానాన్ని , అమావాస్య అనే తిధిని ప్రత్యేకం గా ఏర్పాటు చేశాడు .

అమావాసి తిదినాడు దర్భల to , నువ్వులతో , జలం to పితురులకు మానవులు తర్పణాలు విడుస్తుంతారని పేర్కొన్నాడు . ఆ తర్పనాలతో పితృదేవతా గన్నలకు తృప్తి కలుగుతుంతోందని బ్రహ్మదేవుడు చెప్పాడు . అమావాస్య తిది అంటే ప్రత్యేకం గా పితృదేవతలకు అందుకే అంట ఇస్తామని వరహ పురాణం లో ఈ కధాంశం వివిరిస్తోంది .

మత్స్యపురాణం ఇరవై రెండో అధ్యాయం .. పితృదేవతలకు శ్రాద్ధం ఇచ్చేందుకు తగిన సమయాలను , తగిన ప్రదేశాలను గురించి వివరించి చెబుతోంది . అభిజితే ముహూర్తం , రోహిణి ముహూర్తం , అపరాహ్న కాలాల్లో జరిగిన శ్రాద్ధం , పూజలు .. పితృదేవతలకు ఏంటో ఇష్టం గా ఉంటాయి . పితృదేవతా ప్రీతికరమైన తీర్ధక్షేత్రాలు అసంఖ్యాకం గా ఉన్నాయి . వాటిలో గయా , కాశి , హరిద్వారం , పూరి , గంగా గోమతి సంగమ స్థానము , కురుక్షేత్రం , నైమిశారణ్యం లాంటివి శ్రద్ధకర్మకు , అతడి పితురులము గొప్ప పుణ్యాన్ని సంపాదిన్చుకోనేందుకు ఉపయుక్త మవుతాయన్తోంది మత్యపురణం ,

--డాక్టర్ ఎల్లాప్రగడ మల్లిఖార్జునరావు .







బతుకమ్మ పండుగ, Batukamma panduga




బతుకమ్మ పండుగ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తెలంగాణా ప్రాంతములో ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ (గౌరి) పండగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది.

బతుకమ్మ పండుగ విశిష్టత

సెప్టంబరు, అక్టోబరు నెలలు తెలంగాణా ప్రజలకు పండుగల నెలలు. ఈ నెలలలో రెండు పెద్ద పండుగలు జరపబడతాయి. ఈ పండుగలకు కనీసం పదిహేను రోజులు అటువైపు, ఇటువైపు అంతా పండుగ సంరంభాలు, కుటుంబ కోలాహలాలు, కలయకలుతో నిండిపోయుంటుంది. ఈ పండుగలలో ఒకటి బతుకమ్మ పండుగ, మరియొకటి దసరా (విజయ దశమి). అయితే బతుకమ్మ పండుగ మాత్రం, తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమయిన పండుగ. తెలంగాణ సాంస్కృతిక ప్రతీక ఈ పండుగ. ఇతర చోట్ల పూలు, నీళ్లతో జరుపుకునే పండుగలు ఎన్ని ఉన్నా, అవి ఏవీ కూడా బతుకమ్మ పండుగతో సరిపోలవు.

పూర్తీ వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి > బతుకమ్మ పండుగ

ఏరువాక పున్నమి , Eruvaka Punnami

HÆæÿ$ÐéMæü ç³#¯èþ²Ñ$

"HÆæÿ$ÐéMö_a…¨ HÆæÿ$ÐéMæüÐèþ$Ã, Hâæý$Ï ¯èþ§æþ$Ë* ´÷…W Ððþ…ºyóþ Ðèþ^éaÆÿ fÆæÿ$ç³#Mæü$¯óþ ç³…yæþVæü HÆæÿ$ÐéMæü ç³#¯èþ²Ñ$. HÆæÿ$ÐéMæü A…sôý ÆðÿO™èþ$ Væü$…yðþ B¯èþ…§æþ…™ø ç³Mæüç³M> ¯èþÐèþ#Ó™èþ$…¨. ç³ÌñýÏç³yæþ$^èþ$ Ðèþ$¯èþçÜ$ ç³…rM>Ë$ÐèþÌê ç³Ææÿ$Væü$Ë$ ¡çÜ$¢…¨. C¨ ç³NÇ¢V> ÆðÿO™èþ$Ë ç³…yæþVæü.

MæüÆæÿÛMæü$Ë ç³…yæþVæü
"HÆæÿ$' A…sôý G§æþ$ªÍ² Mæüsìýt ´÷Ë… §æþ$¯èþ²yé°Mìü íܧæþ®… ^óþíܯèþ ¯éVæüÍ A° AÆæÿ¦…. "ÐéMæü' A…sôý Ðér…. HÆæÿ$ÐéMæü…sôý §æþ$MìüP §æþ$¯èþ²yæþÐóþ$! HÆæÿ$MæüÐé¯èþ$ "Mæü–ÚëÅÆæÿ…¿æý…' A±, çÜÝëÅÆæÿ…¿æý…' A± gZņçÙ Ôéç܈Ðóþ™èþ¢Ë$ ÐèþÅÐèþçßýÇÝë¢Ææÿ$. gôýÅçÙx Ôèý$§æþ® ç³NÇ~Ðèþ$¯éyæþ$ "Ðèþ–Úù™èþÞÆæÿj¯èþ {Ðèþ™èþ…' ^óþÄæý*˰ õßýÐèþ*{¨ ç³…yìþ™èþ$yæþ$ ™èþ¯èþ ^èþ™èþ$ÆæÿÓÆæÿY _…™éÐèþ$×ìýÌZ õ³ÆöP¯é²Ææÿ$. ÐèþÆæÿÛÆæÿ$™èþ$Ðèþ# {´ëÆæÿ…¿æý… M>V>¯óþ ´÷Ë… §æþ$°² „óü{™èþ ´ëËMæü$° çÜ…»Z«¨…^èþyæþ… Ææÿ$VóüÓ§æþ…ÌZ Mæü°í³çÜ$¢…¨. A§óþ Ðóþ§æþM>Ë…ÌZ HÆæÿ$ÐéMæü. §æþ$MìüP {´ëÆæÿ…¿ê°² ÑçÙ$~ ç³#Æ>×ý… "ïÜ™é Äæý$fq…'V> ^ðþí³µ…¨.

ïÜ™é A…sôý ¯éVæüÍ ^éË$. ¯éVæüÍ™ø ¿æý*Ñ$° §æþ$¯èþ²yæþ… JMæü Äæý$fq…V> ç³Ñ{™èþM>ÆæÿÅ…V> ç³#Æ>×ý… ¿êÑ…_…¨. C¨ ç³#Æ>×ý M>Ë… ¯ésìý HÆæÿ$ÐéMæü. Ôèý$§øª§æþ¯èþ Ðèþ$àÆ>k ÐèþÆæÿÛÆæÿ$™èþ$Ðèþ# BÆæÿ…¿æý… M>V>¯óþ ÆðÿO™èþ$ËMìü º…V>Ææÿ$ ¯éVæüâæý$Ï ºçßý*MæüÇ…^óþÐ鯿ÿ° »o§æþª Ðèþ$™èþ {Væü…£éË$ ÑÐèþÇ…^éÆÿ$$. C¨ B¯ésìý HÆæÿ$ÐéMæü çÜ…ºÆæÿ…. Ò$Ðèþ*…Ýë Ôéç܈… gôýÅçÙt ç³NÇ~Ðèþ$ ¯éyæþ$ "E§æþÓËçÙ¿æý Äæý$fq…' ^óþõÜ¢ çÜçÜÅÐèþ–¨® AÐèþ#™èþ$…§æþ° õ³ÆöP…¨. Ðèþ–çÙ¿ê˯èþ$ A…§æþ…V> AË…MæüÇ…_ AÇa…^èþyæþ… B Äæý$fq…ÌZ JMæü ¿êVæü…. G§æþ$ªË¯èþ$ ç³Nh…^èþyæþ…, ¯éVæüÍ ÝëW…^èþyæþ… HÆæÿ$ÐéMæü ç³#¯èþ²Ñ$ ¯éyæþ$ ^óþÄæý*ÍÞ¯èþ {糫§é¯èþ Mæü–™éÅË$.

gôýÅçÙt ç³NÇ~Ðèþ$ «§æþÆæÿà ÝëÐèþÇ~ Ðèþ$¯èþÓ…™èþÆ>¨. B¨ÌZ ¿æý*Ñ$° ´ëÍ…_¯èþ 14 Ðèþ$…¨ Ðèþ$¯èþ$Ðèþ#ÌZÏ «§æþÆæÿà ÝëÐèþÇ~ 11Ðèþ Ðéyæþ$. Mæü¯èþ²yæ {´ë…™èþ…ÌZ D ç³…yæþVæü¯èþ$ "M>Ææÿ$×ìý 糺¾…' A…sêÆæÿ$. MæüÆæÿÛMæü$Ë$ B¯èþ…§æþ…™ø ^óþçÜ$Mæü$¯óþ ç³…yæþVæüV> «§æþÆæÿÃÔéç܈ {Væü…£éË$ HÆæÿ$ÐéMæü ç³#¯èþ²Ñ$° {ç³Ýë¢Ñ…^éÆÿ$.

ç³Ôèý$Ðèþ#Ͳ ç³Nh…^ó ç³…yæþVæü
B…{«§æþ§óþÔèý…ÌZ ÆðÿO™èþ$Ë…§æþÆæÿ* E§æþÄæý$Ðóþ$ G§æþ$ªË¯èþ$ Ôèý${¿æý…V> MæüyìþW, MöÐèþ$$ÃËMæü$ Ææÿ…Væü$Ë$ ç³NÝë¢Ææÿ$. VæügñýjË$, Væü…rË$, Mæü$^èþ$aË$, ç³sñýtyæþË$ Ððþ$yæþMæü$, ¯èþyæþ$Ðèþ$$Mìü Mæüsìýt Ðésìý° Ðèþ$$Ý뢺$ ^óþÝë¢Ææÿ$. ™èþÆæÿ$Ðé™èþ ç³Ôèý$Ðèþ#Ͳ MæüsôýtõÜ V>yìþ°, §öyìþz° Ôèý${¿æý… ^óþÝë¢Ææÿ$. Ðèþ$$Væü$YË$ ò³yæþ™éÆæÿ$. «§æþ*ç³… ^èþ*í³Ýë¢Ææÿ$. ´÷§æþ$ª¯óþ² C…sZÏ ç³#ËVæü… Ðèþ…yìþ G§æþ$ªËMæü$ ò³yæþ™éÆæÿ$. ÝëÄæý$… M>Ë… ¯éVæüâæýÏMæü$ G{ÆæÿÐèþ$¯èþ$², çÜ$¯èþ²… ç³sñýtË$ ÐóþíÜ, ¯èþ*¯ðþ Ææÿ…Væü$Ë$ ç³NíÜ AË…MæüÇ…_, B ¯éVæüâæýϯèþ$, Vö{Ææÿ$˯èþ* ¿æý$gêËò³O ò³r$tMö° G§æþ$ªË™ø FÆóÿW…ç³#V> ÆðÿO™èþ$Ë$ ´÷Ìê°Mìü Ððþâæý™éÆæÿ$.

ÆðÿO™èþ$Ë ¿êÆæÿÅË$ Mö™èþ¢ `ÆæÿË$Mæüsìýt íÜ…V>Ç…^èþ$Mö°, ¯èþVæüË$ ò³r$tMö° Ðèþ$…Væüâæý Ðé§éÅË™ø Ððþ…r ¯èþyæþ$Ýë¢Ææÿ$. ™èþÆæÿ$Ðé™èþ ´÷Ë…ÌZ Möº¾Ç M>Äæý$ Mösìýt §æþ$MìüP {´ëÆæÿ…ÀÝë¢Ææÿ$. B ÝëÄæý$…M>ËÐóþ$ FÇ´÷ÍÐóþ$ÆæÿÌZ Æðÿ…yæþ$ Mæü{ÆæÿË$ ´ë† VøVæü$¯éÆæÿ ™øÆæÿ×ý… Mæüyæþ™éÆæÿ$. ÆðÿO™èþ$Ë…§æþÆæÿ* ^èþÆ>²MøËË™ø B ™øÆæÿ×ê°² Möyæþ™éÆæÿ$. ï³^èþ$ ï³^èþ$V> AÆÿ$$¯èþ ™øÆæÿ×ê°² GÐèþÇMìü Ð鯿ÿ$ ç³…^èþ$Mö° C…sìýMìü ¡çÜ$MðüãÏ ™èþÐèþ$ G§æþ$ªË Ððþ$yæþÌZÏ Mæüyæþ™éÆæÿ$. AÌê Mæüyìþ™óþ ™èþÐèþ$Mæü$, ™èþÐèþ$ ç³Ôèý$Ðèþ#ËMìü Ôèý$¿æý… MæüË$Væü$™èþ$…§æþ° ÆðÿO™èþ$Ë ÑÔéÓçÜ…. D HÆæÿ$ÐéMæü ç³#¯èþ²Ñ$¯óþ "§æþÐèþ¯èþ ç³#¯èþ²Ñ$' A° Mæü*yé í³Ë$Ýë¢Ææÿ$. D Æøk¯èþ ÆðÿO™èþ$Ë$ GÐèþÇMîü Aç³#µ CÐèþÓÆæÿ$, ¡çÜ$MøÆæÿ$. HÆæÿ$ÐéMæü ÝëW¯èþ Æøk °ç³#µ Mæü*yé ò³rtÆæÿ$

.& yìþ. }°ÐéçÜ ©„ìü™èþ$Ë$
  • ----==================================


\ª½Õ-„ù X¾ÛÊo-NÕ
Ð -œÄ¹dªý ŸÄ„çÕª½ „ä¢Â¹{ ®¾ÖªÃu-ªÃ«Û





²Ä«Ö->¹ ®¾yª½Ö-¤ÄEo Eª½g-ªá¢-ÍäC ‚ “X¾•-©Â¹× ¦µ¼’¹-«¢-ÅŒÕ-EåXj …Êo Ÿ¿%¹pŸ±¿¢. ‚C «ÖÊ-«Û-œËÂË Ÿä«Ûœ¿Õ “¤Ä¹%-A-¹-¬ÁÂËh. «u«-²Ä§ŒÕ ®¾¢®¾ˆ%A ŸÄÂÃ ÆŸä ²Ä’¹ÕÅŒÖ «*a¢C. ’¹º-°-N-ÅŒ¢-©ðE “¤Ä¹%-A¹ X¾Ü•-©Fo ƪ½Õ|© ÍäA©ð ®¾¢®¾ˆ%-B-¹-ª½º¢ Í碟¿ÕÅŒÖ «ÍÃaªá.

¹%†Ô-«-©Õ©Õ ÅŒ«Õ ‚£¾É-ªÃEo ƒÍäa X¾¢{-¤ñ-©¢-©ðÊÕ, ÅŒ«Õ-Åî-¤Ä{Õ êÂ~“ÅŒ¢©ð “¬ÁNÕ¢Íä X¾¬ÁÙ-«Û-©ðxÊÕ, «u«-²Ä§ŒÕ …X¾-¹-ª½-ºÇ-©ðxÊÕ Ÿçj„ÃEo ®¾¢¦µÇ-N¢-Íê½Õ. ‚¢“Ÿµ¿-Ÿä-¬Á¢©ð èäu†¾e-¬ÁÙŸ¿l´ X¾ÜJg-«ÕÊÕ Â¹ª½¥-Â¹×©Õ '\ª½Õ-„ù X¾ÛÊo--NÕÑ’Ã •ª½Õ-X¾Û-Âî-«-œ¿¢©ð ¨ Ÿ¿%†Ïd ’îÍŒ-J-®¾Õh¢C. 殟¿u¢ ¦µÇª½-ÅŒ-Ÿä-¬Á¢©ð “X¾ŸµÄÊ °«-¯Ã-ŸµÄª½¢. Ÿä¬Á ²ù¦µÇ-’¹u¢©ð ¹ª½¥-¹×E ¤Ä“ÅŒ N®¾t-J¢-X¾-©ä-EC. «ª½¥ ª½ÕÅŒÕ«Û ‚ª½¢-¦µ¼¢©ð ¹ª½¥-Â¹×©Õ •ª½Õ-X¾Û-Âí¯ä ¨ …ÅŒq«¢ •Ê-°-«-Ê¢©ð '\ª½Õ-„ù X¾ÛÊo--NÕÑ’Ã “¤Ä͌ժ½u¢ «£ÏÇ¢-*¯Ã, ƒC „çjC-Âî-ÅŒq«¢ Âß¿Õ. Âí¢Ÿ¿ª½Õ X¾¢œË-ÅŒÕ©Õ ŸÄEE '¹%†Ï ¤ùª½g-NÕÑ’Ã æXªíˆ-¯Ãoª½Õ.

«ª½¥ ª½ÕÅŒÕ«Û ‚ª½¢¦µ¼¢ ÂÒïä ¹%†Ô-«-©Õ©Õ êÂ~“ÅŒ-¤Ä-©ÕE ®¾¢¦ð-Cµ®¾Öh «Õ¢“ÅÃ©Õ ÍŒŸ¿Õ-«Û-Ōբ-œä-„Ã-ª½E ª½Õê’yŸ¿¢ Íç¦Õ-ŌբC.

èãjNÕE ¯Ãu§ŒÕ-«Ö-©©ð '…Ÿ¿y%-†¾-¦µ¼-§ŒÕ•c¢Ñ æXªíˆ--¯Ãoª½Õ. ''…Ÿ¿y%-†¾-¦µ¼-§ŒÕ-èÇc-Ÿ¿§ŒÕ …DÍçjÓ èäu†¾e-«Ö-®¾®¾u ¤ùª½g-«Ö²Äu¢ ¦M-«-ªÃl-¯þ Ʀµ¼u-ª½a-ŸµÄ« §ŒÕA-²ò-§ŒÕ-„þÕ …Ÿ¿y%†¾¦µ¼§ŒÕ•c¢ÑÑ. …ÅŒh-ª½-¦µÇ-ª½-ÅŒ¢©ð ‚¢“Ÿµ¿Õ© \ª½Õ-„ù X¾¢œ¿Õ-’¹©Ç …Ÿ¿y%-†¾-¦µ¼-§ŒÕ•c¢ Íäæ® ®¾¢“X¾-ŸÄ§ŒÕ¢ …¢œä-Ÿ¿E ‚ªîV ‡œ¿xÊÕ X¾Ü>¢* X¾ª½Õ-é’-Ah¢-Íä-„Ã-ª½E Åç©Õ-²òh¢C.

N†¾ßg-X¾Û-ªÃ-º¢©ð '®ÔÅà §ŒÕ•c¢Ñ -“X¾²Äh-«-Ê -…¢C. '®ÔÅŒÑ Æ¯ä «Ö{Â¹× '¯Ãê’-šË- ÍéÕÑ Æ-E ƪ½n¢.
«Õ¢“ÅŒ §ŒÕ•c-X¾-ªÃ-N“¤Ä ®ÔÅÃ-§ŒÕ-èÇc-¬Áa-¹-ª½¥ÂÃÓ
’¹J-§ŒÕèÇc ®¾nŸµÄ-’î¤ÄÓ ƒèðu-²Ät-Gµ-J_-J-ª½yF

Ð “¦Ç£¾Çt-ºÕ-©Â¹× «Õ¢“ÅŒ-•-X¾„äÕ §ŒÕ•c¢. ¹ª½¥-Â¹×©Õ ®ÔÅÃ-§ŒÕ•c¢ Íä²Ähª½Õ. ’î¤Ä-©Õª½Õ TJ-§ŒÕ-•c-X¾-ª½Õ©Õ ÆE ¡Â¹%-†¾ßgœ¿Õ ’îX¾ «%Ÿ¿Õl´-EÅî ÍçXÏp-Ê{Õx ¦µÇ’¹-«ÅŒ X¾ÛªÃº¢ æXªíˆ¢-šð¢C. ¦÷Ÿ¿l´ èÇŌ¹ ¹Ÿ±¿©ðx-E '«X¾p «Õ¢’¹-©-C-«®¾Ñ \ª½Õ-„ù X¾¢œ¿-’¹ÊÕ ¤òL-ÊŸä. ¬ÁÙŸîl´-Ÿ¿Ê «Õ£¾É-ªÃV ¹XÏ-©-«-®¾Õh-Ê-’¹-ª½¢©ð «ª½¥ ª½ÕÅŒÕ«Û ‚ª½¢¦µ¼¢ ÂÒïä ¹ª½¥-¹×-©Â¹× ©Ç¢ÍµŒ-Ê¢’à ŠÂ¹ ¦¢’ê½Õ ¯Ã’¹-LE Æ¢Ÿ¿--èäæ®-„Ã-œ¿E '©L-ÅŒ-N-®¾hª½¢Ñ Íç¦Õ-Åî¢C. £¾É©ÕE ’ß±Ä-®¾-X¾h-¬Á-A©ð '\ª½Õ-„ù X¾ÛÊoNÕÑ “X¾²Äh-«Ê …¢C. '\ª½ÕÑ Æ¢˜ä ‡Ÿ¿Õl-©-ÊÕ-¹šËd Ÿ¿ÕÊo-œÄ-EÂË ®ÏŸ¿l´¢ Íä®ÏÊ ¯Ã’¹L ÆE, '\ª½Õ-„ÃÂ¹Ñ Æ¢˜ä Ÿ¿ÕÊo-œÄ-EÂË ‚ª½¢-¦µ¼-«ÕE ¯çjX¶¾Õ¢-šË-ÂÃ-ªÃn©Õ. «ª½¥ ª½ÕÅŒÕ«Û ‚ª½¢¦µ¼¢ ÂÒïä èäu†¾e X¾ÜJg-«Õ-¯Ãœ¿Õ ¹ª½¥-Â¹×©Õ …Ÿ¿-§ŒÕ„äÕ ‡œ¿xÊÕ Â¹œËT Âí«át-©Â¹× ª½¢’¹Õ©Õ X¾Ü®Ï ’¹èãb©Õ ’¹¢{-©Åî Æ©¢-¹-J¢*, ‡œ¿xÊÕ Â¹˜äd ÂÜËE Ÿµ¿ÖX¾-DX¾ ¯çj„ä-ŸÄu-©Åî X¾Ü>¢-ÍŒœ¿¢ X¾J-¤ÄšË. ‡œ¿xÂ¹× ¤ñ¢’¹L åXœ¿-Åê½Õ. ²Ä§ŒÕ¢-Âé¢ “’ëբ-©ðE éªjÅŒÕ-©¢Åà «Õ¢’¹-@Á-„Ã-ŸÄu-©Åî ­êª-T¢-X¾Û’à ¤ñ©Ç-©Â¹× „çRx Ÿ¿ÕÂˈ “¤Äª½¢-Gµ-²Ähª½Õ. ­J-„Ã-ÂË{ ’î’¹Õ-¯Ã-ª½Åî Íä®ÏÊ Åº¢ ¹œ¿-Åê½Õ. ŸÄEE ÍçªÃo-Âî-©-©Åî ÂíšËd ‡«-JÂË ŸíJ-ÂËÊ XÔÍŒÕÊÕ „ê½Õ B®¾Õ-¹×-¤ò-Åê½Õ. ƒC X¾¬ÁÙ-«Û-©Â¹× „äÕ©Õ-Íä-®¾Õh¢-Ÿ¿E Ê«Õt¹¢. ‰ªî¤Ä Ÿä¬Ç-©ðxE '„äÕ¤ò-„þÑ ƒ{Õ-«¢šË X¾¢œ¿Õê’.

èäu†¾e ¬ÁÙŸ¿l´ X¾ÜJg«Õ ¯Ã-œä «{ ²ÄN“A “«ÅŒ¢ ®ÔY©Õ ‚ÍŒ-J-²Ähª½Õ. ƒC „Ãu«-²Ä-ªá¹ ®¾¢¦¢-Ÿµ¿-„çÕiÊC Âß¿Õ. §ŒÕ«áE „ç¢{-¦œË ¦µ¼ª½hÊÕ ¦A-ÂË¢-ÍŒÕ-¹×Êo ²ÄN-“AE …Ÿäl-P¢* ®ÔY©Õ ‚ÍŒ-J¢Íä “«ÅŒ¢ ƒC.

అక్షయ తృతీయ,Akshaya Truteeya



  • వైశాఖ శుద్ధ తదియనాడు అక్షయ తృతీయ జరుపుకుంటారు . కొందరు వైశాఖ శుక్లపక్ష తృతీయ(తదియ ) రోహిణియుతమైన రోజునే, అక్షయతృతీయ పర్వదినంగా జరుపుకుంటారు . ఇది ఒక నమ్మకం మాత్రమే . పూజలు , వ్రతాలు , నోములు , యజ్ఞాలు ,యాగాలు చేస్తే ధనము , ఐశ్వర్యము వస్తుందనేది ఎంతమాత్రము శాస్త్ర సమ్మతం కాదు . . . కాని నమ్మకం మూలానా మానవుడు కొంతవరకు ఆదా చేసే అవకాశము , కనీసము ఆరోజైనా భవిష్యత్తు అవసరాలకు ఆదాచేసే అవకాశము ఉంది . ఒక తరము నుండి మరొక తరానికి " జ్ఞాపకాల " బదలాయింపు జరుగుతూ ఉండాలి ... ఉంటేనే మన సంస్కృతి , సంప్రదాయాలు కలకాలము నిలిచిఉంటాయి.
ఈనాడు మనం 21వ శతాబ్దంలోకి అడుగు పెట్టాము. ఇది ఎంతో స్పీడు యుగం, అయినప్పటికి ఈ జీవితాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకునేందుకు చివరిగా పరమేశ్వర సాయుజ్యం పొందేందుకు మన హిందూ సంస్కృతి సంప్రదాయాలలో మన జీవిత గమ్యం గాడి తప్పకుండా ధర్మార్ధ కామ, మోక్షాల కొరకు చక్కని మార్గాన్ని తల్లి గర్భధారణ మొదలుకొని క్రమపద్ధతిలో జరిగే షోడశ సంస్కారాలతో మనకు ఆరంభమవుతాయి. అట్టి పూలబాటలో అలనాటి మన ఋషులు ఆదర్శవంతంగా ఆచరించి మనకు మార్గగమ్యాన్ని చూపించారు. ఆ బాటలోనివే ఈ నోములు వ్రత్రాలు, ఉపవాసాలు, పండుగలు అన్నవి. వాటికన్నిటికినీ యుగయుగాలనాటి చరిత్రతో మేళవించబడినవి.

అటువంటి పండుగయే ఈ "అక్షయ తృతీయ-ఉగాది" పర్వదినం. . .అక్షయం అంటే క్షయం లేకుండుట. జీవితంలో అన్నింటిని అక్షయం చేసే పర్వదినం కనుక దీనికి అక్షయ తృతీయ అని పేరు వచ్చింది. ఈ రోజున చేసిన హోమాలు, దానాలు, పిత్రుదేవతలకూ, దేవతలకూ చేసే పూజలు, క్షయం కాకుండా, అక్షయంగా ఉంటాయని, అందుచేతనే ఈ రోజుకు అక్షయ తృతీయ అని పేరు వచ్చిందని శ్రీ కృష్ణుడు, ధర్మరాజుకు చెబుతాడు. ఈ అక్షయ తృతీయ నాడు బంగారాన్ని తప్పకుండా కొనాలని తద్వారా లక్ష్మిదేవిని తమ తమ ఇళ్లల్లో సుస్థిరంగా నివాసం ఉండేలా చేయాలని పెద్దలు చెబుతుంటారు. బంగారం కొనుగోలు చేయలేనివారు లవణం (అంటే ఉప్పు)ను కొనుగోలు చేయవచ్చు. ఉప్పు కూడా శ్రీ మహాలక్ష్మికి కటాక్షం కలిగిన వస్తువు కనుక బంగారం కొనలేనివారు ఉప్పును అయినా కొనుగోలు చేస్తే సుఖంగా జీవిస్తారని అంటారు.

వైశాఖ శుద్ధ తదియనాడు జరుపుకునే అక్షయ తృతీయకు చాలా విశిష్టత ఉంది. ఈ రోజున సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి విష్ణువును ప్రార్థిస్తే సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. ఈ రోజున బదిరీనారాయణ మందిరం ద్వారములు భక్తుల దర్శనం కోసం తెరిచే ఉంటాయని వారు చెబుతున్నారు.

వైశాఖ శుక్లపక్ష తృతీయ రోహిణియుతమైన రోజునే, అక్షయతృతీయ పర్వదినంగా జరుపుకుంటారు. ఈ రోజున దేవతలను, పితృదేవతలను ఆరాధించడం ద్వారా పుణ్య ఫలము సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. గోదానము, భూదానము. సువర్ణదానము, వస్త్రదానము చేసేవారికి సుఖసంతోషాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు.

అందుచేత అక్షయ తృతీయ రోజున స్త్రీలు చిన్ని కృష్ణునికి, గౌరీదేవీకి డోలోత్సవము జరిపించి ముత్తైదువలను కన్యలను పూజించి ఫలపుష్పాదులను శనగలు వాయనమిచ్చి సత్కరిస్తే దీర్ఘసుమంగళీ ప్రాప్తంతో పాటు ఆ గృహం సిరిసంపదలతో వెల్లివిరుస్తుందని విశ్వాసం.
-----------
శ్రీ నరసింహుడు ప్రహ్లాదునికి అనుగ్రహించిన రోజునే "అక్షయ తృతీయ"గా పిలువబడుతోందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున శ్రీ మహాలక్ష్మిదేవిని పూజించడం సంప్రదాయం. ఈ రోజున బంగారం కొని ఇంటికి తెచ్చుకుంటే ఏడాదంతా సిరిసంపదలతో వర్ధిల్లుతారని విశ్వాసం.


బంగారం కొనలేని పక్షంలో శ్రీ మహాలక్ష్మి ప్రతిమ లేదా ఫోటో ముందు.. ఉప్పు, పచ్చిబియ్యం, పసుపును ఓ అరటి ఆకుపై పోసి నిష్ఠతో ప్రార్థించి, కర్పూర నీరాజనాలు సమర్పించుకునే వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు అంటున్నారు.

అదేవిధంగా ఇదే రోజున నరసింహస్వామిని పుష్ప, ఫలాలను అర్పించి దైవ నామస్మరణ చేసిన వారికి సంపద, పుణ్యఫలం ప్రాప్తిస్తాయని ప్రతీతి. ఇంకా చెప్పాలంటే... ఈ రోజున గోధుమలు, శెనగలు, పెరుగన్నం దానం చేసిన వారికి సకల పాపాలు హరించి, శాశ్వతంగా శివసాయుజ్యం పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. వీటితో పాటు గొడుగు, పాదరక్షలు, భూమి, బంగారం, వస్త్రాలను దానం చేసే వారికి పుణ్యం లభిస్తుందని విశ్వాసం.
--------------
అక్షయ తృతీయ

"వైశాఖమాసస్య చ యా తృతీయా నవమ్య సౌ కార్తీక శుక్లపక్షే
నభస్య మాసస్య తమిస్రపక్షే త్రయోదశీ పంచదశీ చ మాఘే"

కావున ఇది కృతయుగ ఆరంభ ఉగాది అని విష్ణు పురాణాదులు పేర్కొనుచున్నవి. కొన్ని ప్రాంతములలో వైశాఖశుద్ధ తదియనాడు ఈ పండుగ చేయుచుందురు. ఈనాడే "బదరీనారాయణ" మందిర ద్వారములు భక్తుల దర్శన నిమిత్తం తిరిగి తెరుతురు. అంతవరకు ఈ ఆలయం మంచుతో నిండియుండి అగమ్య గోచరమైన ఈ హృషీకేశము భక్తులచే కిటకిటలాడుచు పూజాదికాలు ప్రారంభమగును. ఈ దినమున కొన్ని ప్రాంతములందు స్త్రీలు చిన్నికృష్ణునికి, గౌరీదేవికి డోలోత్సవము జరిపించి ముత్తైదువలను కన్యలను పూజించి ఫలపుష్పాదులు, శనగలు వాయనమిచ్చి సత్కరించెదరు.

ఈ పుణ్యదినమందు దేవతలను, పితృదేవతలను ఆరాధించుట, గోదానము, భూదానము, సువర్ణదానము, వస్త్రదానము, పూర్ణఘటముతో నిండియున్న ఉదక దానము మున్నగునవి, మరియు ఈ దినమందు చేయు జప, హొమ, దానాదులన్నియు "అక్షయము" పొందునుగాన! ఇది "అక్షయతృతీయ" మని కృష్ణభగవానుడు స్వయముగా ధర్మరాజుకు వివరించినాడు.

ఇందులకొక పురాణగాధకలదు. పూర్వము ఒక వైశ్యుడు ఎన్నో దారిద్ర్య బాధలు వెంటాడుతున్నా; సత్ప్రవర్తన వీడక జీవించుచు ఒకసారి ఒక పౌరాణికుడు "వైశాఖశుద్ధ తృతీయ నాడు చేయు స్వల్పదానమైనను అక్షయ ఫలప్రదము" అని చెప్పగా విని, ఆ దినమందు గంగలో పుణ్యస్నానమాచరించి దేవతలకు, పితృదేవలకు తర్పణమాచరించి, ఇంటికి వచ్చి సద్‌బ్రాహ్మణులను ఆహ్వానించి వారికి యథాశక్తి భోజన తాంబూలాదులతో దానమిచ్చెను. అలా ఆచరించిన పుణ్యఫలమే వాని వెంటవచ్చి మరుజన్మమున అతడు కుశావతీ నగరమునకు రాజుగా జన్మించెను. అయినను అతడు ఎన్నో యజ్ఞయాగాదులు, దానధర్మాలు నిర్వర్తించుచున్నను వాని సంపద అక్షయమగుటే గాని తరుగలేదుట. "అందువల్లనే మన పౌరాణికుల మాటలు పెడచెవిని పెట్టకుండా, విశ్వసించే వారికి విశ్వసించినంత ఫలం ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు.

"వైశాఖ శుక్ల పక్షేతు తృతీయా రోహిణి యుతా,
దుర్లభా బుధచారేణ సోమనాపి యుతా తథా"

వైశాఖ శుక్లపక్ష తృతీయ రోహిణీయుతమైన అత్యంత పుణ్యప్రదమైనది అని విష్ణుపురాణాదులు చెప్పుచున్నవని, పరమభాగవతోత్తముడు నారదీయవచనమును నిర్ణయామృతకారుడు ఉదహరించినాడు. అట్టి పుణ్య ఫలాన్ని అందించే ఈ అక్షయ తృతీయను భక్తి శ్రద్ధలతో ఆచరించి సర్వులము పునీతులౌదాము.
మూలం: పండుగలు పర్వదినాలు, ఆదిపూడి వేంకట శివ సాయిరామ్.
  • -----------------------------------------------------
ఈ క్రమంలో ఈ నెల 16వ తేదీన వచ్చే అక్షయ తృతీయ నాడు జాతక రీత్యా 12 రాశులకు చెందిన జాతకులు, ఏయే దేవతలు పూజించాలనే విషయాన్ని జ్యోతిష్య నిపుణులు ఇలా చెబుతున్నారు.

అక్షయ తృతీయ నాడు మేషరాశిలో పుట్టిన జాతకులు వినాయక, సుబ్రహ్మణ్య స్వాములను పూజించడం మంచిది. ఇంకా విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యులకు అర్చనలు చేసి పాయసం దానం చేసే వారికి సకల సంపదలు, సుఖసంతోషాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు.

అలాగే వృషభ రాశిలో జన్మించిన జాతకులు శాంతరూపంలో దర్శనమిస్తున్న అంబికాదేవికి స్మరించడం, పూజించడం చేయాలి. అమ్మవారికి చక్కెర పొంగలి, పాలతో చేసిన పాయసం లేదా రవ్వలడ్డును నైవేద్యంగా సమర్పించుకుంటే.. ఈతిబాధలు తొలగిపోతాయి. ఇంకా ఆలయాల్లో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేయిస్తే శుభ ఫలితాలుంటాయి.

ఇక మిథున రాశిలో పుట్టిన జాతకులు అక్షయ తృతీయనాడు విష్ణు, మహాలక్ష్మీలను పూజించడం శ్రేయస్కరం. విష్ణు, మహాలక్ష్మీదేవిని అష్టోత్తరాలతో పూజించి, బ్రాహ్మణులకు, పేదలకు చేతనైనా సహాయం చేయడం ద్వారా ఆర్థికాభివృద్ధి చేకూరుతుందని పురోహితులు చెబుతున్నారు.

కర్కాటక రాశిలో జన్మించిన జాతకులు దుర్గమ్మ తల్లిని పూజించడం చేయాలి. దుర్గమ్మ తల్లికి నేతితో దీపమెలిగించి బియ్యం పిండితో చేసే పదార్థాలను దానం చేయడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.

ఇక సింహరాశిలో పుట్టిన జాతకులు పరమేశ్వరుడిని, కన్యారాశిలో జన్మించిన జాతకులు విష్ణు, మహాలక్ష్మీదేవిలను ఆరాధించడం ద్వారా సకల సంతోషాలు, అష్టైశ్వర్యాలు

చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు. సింహ, కన్యారాశిలో పుట్టిన జాతకులు అక్షయ తృతీయ నాడు శివావిష్ణులువుండే ఆలయాలను సందర్శించడం చాలా మంచిది.

తులారాశిలో పుట్టిన జాతకులు దుర్గమ్మను, వృశ్చిక రాశి జాతకులు వినాయకస్వామి, సుబ్రహ్మణ్యులను పూజించడం మంచిది. అలాగే ధనుస్సురాశిలో పుట్టిన జాతకులు దక్షిణామూర్తిని ఆరాధించడం మంచిది. ఇంకా దక్షిణామూర్తికి తెల్లటిపువ్వులతో కూడిన మాలను సమర్పించుకోవడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.

ఇకపోతే.. మకరరాశిలో జన్మించిన జాతకులు విఘ్నేశ్వరుడు, హనుమంతుడిని పూజించడం మంచిది. అక్షయ తృతీయ నాడు హనుమంతునికి తమలపాకులతో మాల, వెన్నను సమర్పించుకునే వారికి మనోధైర్యం ఏర్పడుతుంది. ఇంకా ఈతిబాధలు తొలగిపోయి మానసిక ప్రశాంతత నెలకొంటుంది. అలాగే విఘ్నేశ్వరునికి గరిక మాలను సమర్పించుకోవచ్చు.

అలాగే కుంభ రాశి జాతకులు శనీశ్వరుడు, హనుమంతుడిని, మీన రాశి జాతకులు నందీశ్వరుడిని పూజించడం ద్వారా వ్యాపారాభివృద్ధి, కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

  • ==============================================
Visit my website -> dr.seshagirirao.com/

Wednesday, September 16, 2009

అట్లతదియ , atla taddi,ఉయ్యాలపండగ,గోరింటాకుపండగ




అట్ల తద్ది లేదా అట్ల తదియ తెలుగువారి ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఇది ఆశ్వయుజ బహుళ తదియ నాడు జరుపుకొంటారు. "అట్లతద్దె ఆరట్లు ముద్దపప్పు మూడట్లు" అంటూ ఆడ పడుచులకు బంధువులకు ఇరుగు పొరుగులకు వాయినాలివ్వటం పరిపాటి. సాయం సమయమందు వాయినలు, నైవేద్యాలు పూర్తి చేసుకొని గోపూజకు వెళ్ళి, అటునుండి చెరువులలో కాలువలలో దీపాలను వదలి, చెట్లకు ఊయలలు కట్టి ఊగటం చేస్తుంటారు.

పెళ్ళీడు వచ్చిన ప్రతి ఆడపిల్ల కాబోయే భర్త గురించి, రాబోయే వైవాహిక జీవితం గురించి అలాంటి కలలు కనటం సహజం. ఆ కలలు నెరవేరాలని ఎన్నో వ్రతాలు, నోములు చేస్తుంటారు. ప్రతి ఏడాది జరుపుకొనే అట్లతద్ది నోము అందులో ముఖ్యమైనది.

ఆశ్వయుజ మాసంలో దసరా పండుగ తరవాత వచ్చే తదియనాడు ఈ పండుగ జరుపుకొంటారు. అయిదేళ్ళు దాటిన ఆడపిల్లల నుంచి పెద్దల వరకు చేసుకుంటారు. పెళ్ళికాని పిల్లలు మంచి భర్తకావాలని ఈ పూజ చేస్తే, పెళ్ళైనవారు మంచి భర్త దొరికినందుకు, ఆ భర్త ఆరోగ్యంగా ఉండటానికి చేస్తారు. సాధారణంగా- పెళ్ళి అయిన తరవాత పది సంవత్సరాలపాటు తప్పనిసరిగా చేస్తారు. సమాప్తం అయిందనడానికి గుర్తుగా ఉద్యాపన చేస్తారు. అంటే ఆఖరుసారి పూజచేసి పేరంటాలను పిలిచి వాయనాలిచ్చి కన్నులపండుగగా ముగిస్తారు

త్రిలోక సంచారి అయిన నారదుని ప్రోద్బలముతో గౌరీదేవి శివుని పతిగా పొందగోరి తొలుతగ చేసిన విశిస్టమైన వ్రతమే ఈ అట్లతద్ది. స్రీలు సౌభాగ్యము కోసం చేసుకొనే వ్రతమిది. చంద్రారాధన ప్రధానమైన పూజ, చంద్రకళల్లో కొలువైవున్నశక్తి అనుగ్రహం చేత స్రీసౌభాగ్యము పెరుగుతుంది. కుటుంబములో సుఖశాంతులు వర్దిల్లుతాయని శాస్త్రవచనం. ఈ పండగలో అమ్మవారికి అట్లు నైవేద్యముగా పెట్టడములో ఒక అంతర్ధానముంది. నవగ్రహాలలోని కుజుడుకీ అట్లంటే మహాప్రీతి, అట్లను ఆయనకు నైవేద్యముగాపెడితే కుజదోషపరిహారమై సంసారసుఖములో ఎటువంటి అడ్డంకులు రావని నమ్మకము. రజోదయమునకు కారకుడు కనుక ఋతుచక్రం సరిగావుంచి ఋతుసమస్యలు రానివ్వకుండా కాపాడుతాడు. అందువలన గర్భదారణలోఎటువంటిసమస్యలుండవు. మినుములు పిండి, బియ్యము పిండి కలిపి అట్లను తయారుచేస్తారు. మినుములు రాహువునకు, బియ్యము చంద్రునకు సంభందంచిన దాన్యాలు. గర్భదోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయనముగా ఇవ్వాలి. గర్భస్రావమురాకుండా, సుఖప్రసవం అయ్యేందుకు దోహదపడుతుందికూడా. అందుకే ముత్తయిదువులకు అట్లను వాయనముగా ఇస్తారు. అట్లతద్దిలోని 'అట్ల'కు ఇంతటి వైద్యవిజ్ఞానము నిక్షిప్తం చేయబడివుంది.

వ్రతవిధానము

ఈ రోజు తెల్లవారుఝామునే మేల్కొని శుచి, శుభ్రత తో స్నానమాచరించి, ఉపవాసముండి, ఇంటిలో తూర్పుదిక్కున మంటపము యేర్పాటుచేసి గౌరీదేవి పూజ చేయాలి. ధూప, దీప, నైవేద్యాలు పెట్టి, వినాయక పూజ తర్వాత, గౌరీ స్తోత్రము, స్లోకాలు, పాటలు చదవడమ్, పాడడం చేస్తారు. సాయంత్రం చంద్రదర్సనము అనంతరము శుచియై తిరిగి గౌరీపూజచేసి, 10 అట్లు నైవేద్యముగాపెట్టి, ముత్తైదువులకు అలంకారము చేసి, 10 అట్లు, 10 ఫలాలు వాయనముగా సమర్పించి, అట్లతద్దినోము కధ చెప్పుకొని, అక్షతలు వేసుకోవాలి. ముత్తైదువులకు నల్లపూసలు, లక్కకోళ్ళు, రవిక గుడ్డలు, దక్షినతాంబూలాలు ఇచ్చి భోజనాలుపెట్టి, తామూ భోజనము చేయాలి. 10 రకాల ఫలాలను తినడం, 10 మార్లు తాంబూలం వేసుకోవడం, 10 మార్లు ఊయల ఊగడం, గోరింటాకు పెట్టుకోవడం, ఈపండుగలో విశేషము. దీనినే 'ఉయ్యాలపండగ' అనీ, 'గోరింటాకుపండగ' అనీ అంటారు. ఈపండగ చేయడం వలన గౌరీదేవి అనుగ్రహం తో పెల్లికాని అమ్మాయిలకు గుణవంతుడైన రూపసి భర్తగా లభిస్తాడని, పెళ్ళైనవారికి పిల్లకు కలుగుతారని, ఐదవతనముతోపాటు, పుణ్యము లభిస్తుందని తరతరాలనుంచి వస్తున్న నమ్మకము.
(సేకరణ:డా.శేషగిరిరావు-శ్రీకాకుళం)

అట్ట్ల తద్దోయ్ ఆరట్లోయ్
ముద్దపప్పోయ్, మూడట్లోయ్

చిప్ప చిప్ప గోళ్ళు, సింగరయ్య గోళ్ళు
మా తాత గోళ్ళు, మందాపరాళ్ళు


వ్రతంలో ఒక కథ చదువుతుంటారు. పూర్వం ఒక రాజుకు కావేరి అనే అందమైన కూతురు ఉండేది. ఆమె స్నేహితులతో కలిసి ఈ అట్లతద్ది నోమును ఎంతో భక్తితో ఆచరించింది. అందరికీ అందమైన భర్తలు లభించారు. కావేరికి మాత్రం కురూపులు, వృద్ధులైన పెండ్లికుమారులు తారసిల్లేవారు. కావేరి ఎంతో కలతచెంది అడవికి వెళ్ళి తీవ్రంగా తపస్సు చేసింది. పార్వతీపరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు. వారికి తన బాధ చెప్పుకొంది.

అప్పుడు వ్రతంలో ఆమె చేసిన దోషం వలన అలా జరిగిందని ఆదిదంపతులు వివరించారు. ఆమె నోము నోచే సమయంలో ఉపవాసం వలన నీరసించిపోయింది. ఆమె అన్నలు అది తెలిసి, గడ్డితో మంటపెట్టి అది అద్దంలో చూపించి చంద్రుడని భ్రమింపజేసి ఉపవాసాన్ని విరమింపజేశారు. ఫలితంగా ఆమెకు సరియైన వరుడు దొరకలేదు. ఈ వ్రతాన్ని జాగ్రత్తగా మరొకసారి ఆచరించమని చెప్పి అంతర్థానమయ్యారు పార్వతీ పరమేశ్వరులు. కావేరి మళ్లీ శ్రద్ధా భక్తులతో వ్రతమాచరించింది. ఫలితంగా అందమైన, శౌర్యపరాక్రమాలు కలిగినవాడు భర్తగా లభించాడు- ఈ కథను చదువుకుని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ ముగిస్తారు.

అట్లతద్దిలో పార్వతీ పరమేశ్వరుల్ని పూజించటానికి కారణం అర్ధనారీశ్వరత్వం. సాక్షాత్తూ భగవంతుడే రెండుగా వీడి ప్రకృతి పురుషుడిగా మారాడనీ, ఆ అర్ధ నారీశ్వరంలో నుంచి సమస్త సృష్టి జరిగిందనీ ఇతిహాసాలు చెబుతున్నాయి. అన్యమతాల్లోనూ ఇదే పద్ధతిలో ఉపవాసం ఉండి చంద్రోదయం తరవాత ఉపవాసాన్ని విరమించడం మనం చూడవచ్చు. మతాలు వేరైనా అభిమతం ఒక్కటే అని తెలియజెప్పే ఈ అట్లతదియ నోము మతసామరస్యానికి పెద్దపీట వేస్తుంది.



శ్రీరామనవమి,Sri Rama Navami




శ్రీరామనవమి హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. శ్రీరాముడు చైత్ర శుద్ధ నవమి నాడు జన్మించినాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో అడుగిడిన శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. ఈ చైత్ర శుద్ధ నవమి నాడే సీతారామ కళ్యాణము జరిగినది .... ఆంధ్రప్రదేశ్ లో గల భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు.

మరిన్ని వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి -> శ్రీ రామ నవమి